
-పెద్దితో బిజీగా ఉన్న రామ్ చరణ్
-ధురంధర్ 2 డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడా!
-అశ్వద్ధామ వెనక ఉన్న కథ ఏంటి
రూమర్ పేరుపై కూడా గుళ్లో అర్చన చేసే రోజు వస్తుందని ఎవరైనా ఉహించి ఉంటారా!. మసీదు, చర్చిల్లో సైతం అదే గౌరవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ధురంధర్ 2 (Aditya Dhar) డైరెక్టర్ ఆదిత్య ధర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కాంబోలో మూవీ తెరకెక్కబోతుందనేదే రూమర్ .. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
ఆదిత్య ధర్ డ్రీం ప్రాజెక్ట్స్ లో 'ఇమ్మోర్టల్ అశ్వద్ధామ'(immortal ashwatthama)ఒకటి. నిజానికి ధురంధర్ 2 కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సిన మూవీ. అంటే తన సెకండ్ మూవీగా రావాల్సింది. అగ్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ముందుకొచ్చినా, కారణాలు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లోకి ధురంధర్ వచ్చేసింది. ఇప్పుడు ఆదిత్య ధర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఇమ్మోర్టల్ అశ్వద్ధామని తెరకెక్కించాలని రామ్ చరణ్ టైటిల్ రోల్ లో చేయబోతున్నట్టుగా రూమర్. మరి వింటు ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! మరి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఆదిత్య ధర్ ఇమ్మోర్టల్ అశ్వద్ధామని ప్రకటించినప్పుడే రామ్ చరణ్ హీరో అనే పుకారు వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ని ఆకట్టుకున్నాడు.
Also Read: ott: ఓటీటీలో 7 హై ఓల్టేజ్ రొమాంటిక్ చిత్రాలు.. ఒంటరిగా మాత్రమే చూడండి
కానీ రెండో చిత్రానికే ఆదిత్య ధర్ తో బడ్జెట్ విషయంలో రిస్క్ చేయడం ఎందుకని నిర్మాతలు ఆలోచించారనే న్యూస్ వినపడింది. కానీ ఆ వార్తలో నిజం లేదు. ఎందుకంటే ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 నిర్మించింది కూడా జియో స్టూడియోస్ నే. ఏది ఏమైనా ఫస్ట్ టైం ఒక రూమర్ అరుదైన గౌరవానికి అర్హత సాధించింది. ప్రెజెంట్ రామ్ చరణ్ అయితే పెద్దికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ ఇంకా కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.





