![]() |
![]() |
.webp)
గుంటూరు కారం సినిమాలో ' ఆ కుర్చీని మడతబెట్టి' సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఆ పాటకి బుల్లితెర నుండి వెండితెర వరకు ఉన్న నటీమణులు వారి స్టైల్ లో డ్యాన్స్ తో అదరహో అనిపించేలా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ జాబితాలో విష్ణుప్రియ కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం ఓ డ్యాన్సర్ తో కలిసి ఈ పాటకి డ్యాన్స్ చేసిన విష్ణుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.
బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. కొంతకాలం క్రితం మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది.
విష్ణుప్రియకి బిగ్ స్క్రీన్ మీద తనని తాను చూసుకోవాలని ఆశంట.. ఎందుకంటే అది వాళ్ళ నాన్న డ్రీమ్ అంట. తనలోని నటనను ఎవరు గుర్తించకపోయేసరికి డ్యాన్స్ మీద దృష్టి పెట్టి కసరత్తులు చేస్తుంది. యోగాలు, జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ డ్యాన్స్ కోసం తన బాడీనీ మలుచుకుంటుంది విష్ణుప్రియ. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే విష్ణుప్రియ.. తనకి సంబంధించిన ఒక ప్రతీ విషయాన్ని అప్డేడ్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా తన ఇమ్ స్టాగ్రామ్ లో ' ఆ కుర్చీని మడతబెట్టి' పాట 3 మిలియన్ వ్యూస్ దాటింది. అదే విషయాన్ని విష్ణుప్రియ చెప్పుకుంటూ ఓ పోస్ట్ చేసింది. నా పాటని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి థాంక్స్ అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. కాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
![]() |
![]() |