![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -284 లో.....ధీరజ్, నేను ముద్దు పెట్టుకున్నామో లేదో అన్న కన్ఫ్యూషన్ ఉంది అక్క నువ్వు ధీరజ్ ని అడుగు అక్క అని నర్మదని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ వస్తుంటే నర్మద ఆపి మాట్లాడుతుంది. ప్రేమ చాటు నుండి అంతా వింటుంది. నిన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందంట కదా అని అడుగుతుంది. ఏం అయింది పార్టీ బాగా జరిగిందని ధీరజ్ అంటాడు. ప్రేమ వింటున్న విషయం ధీరజ్ చూస్తాడు. దాంతో ఏమో వదిన కరెంటు పోయింది. నాకేం తెలియదని ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మీరు ఏమైనా చిన్నపిల్లలా నువ్వు ఏమో కళ్ళు మూసుకున్నానంటావ్.. అతనేమో కరెంటు పోయిందని అంటున్నాడు.. మధ్యలో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత ముగ్గురు కోడళ్ళు బతుకమ్మ పేరుస్తారు. ఎవరు బాగా పేర్చారని ముగ్గురు అడుగుతారు. నాన్న మీరు చెప్పండి అనీ ధీరజ్, సాగర్ చందు అంటారు. మీ భార్యలకి సంబంధించినది మీరే చెప్పాలని అనేసి రామరాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమ బతుకమ్మ బాగుందని సాగర్ అంటాడు. వల్లి వదినది బాగుందని ధీరజ్ అంటాడు. నర్మద బతుకమ్మ బాగుందని చందు అంటాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములు గొడవ పడినట్టు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తిరుపతిని చెప్పమంటే నాకేం తెలియదని అంటాడు.
మరొకవైపు భద్రవతి బతుకమ్మ పేరుస్తూ వేదవతి, ప్రేమలని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడకు అత్త.. వచ్చే సంవత్సరానికి ప్రేమ వచ్చేలా చేస్తానని భద్రవతికి విశ్వ మాటిస్తాడు. మరొకవైపు పుట్టింటిని చూస్తూ ప్రేమ, వేదవతి ఇద్దరు బాధపడతారు. అప్పుడే నర్మద వస్తుంది. ఎప్పుడు నా చేత్తో బతుకమ్మ తీసుకొని వెళ్లేదాన్ని అని వేదవతి బాధపడుతుంటే నేను ఈసారి ఆ ఇంట్లో నుండి మీరు బతుకమ్మ తీసుకొని వెళ్లేలా చేస్తానని వేదవతికి నర్మద చెప్తుంది. అందరు బతుకమ్మలు అడేందుకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |