![]() |
![]() |

'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. పాయల్ రాజ్పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి.
నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'మంగళవారం' సినిమా విడుదల కానుంది. ఈ నెల 11న హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెషన్ సెంటర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. "మా జాతరకి పుష్పా వస్తున్నారు" అంటూ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

'మంగళవారం' చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'ఆర్ఎక్స్ 100' తరహాలో మరోసారి డిఫరెంట్ కంటెంట్ అండ్ కమర్షియల్ బేస్డ్ సినిమాతో అజయ్ భూపతి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే నమ్మకం ప్రేక్షకులలో కలిగించింది. మరి తన రెండో సినిమా 'మహాసముద్రం'తో విజయాన్ని అందుకోలేకపోయిన అజయ్.. 'మంగళవారం'తో లెక్క సరిచేస్తాడేమో చూడాలి.
![]() |
![]() |