టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సుదీర్ఘ కాల బాయ్ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న పెళ్లాడింది. వివాహం తరువాత, ఆమె తన భర్తతో కలిసి హనీమూన్ వెళ్ళింది . ఆ ఇద్దరూ మాల్దీవుల్లో హనీమూన్ను ఆస్వాదించారు. గౌతమ్తో వివాహానికి అంగీకరించడానికి ఒక కారణం ఉందని కాజల్ తెలిపింది.
అందరు అమ్మాయిల మాదిరిగానే, తన కాబోయే భర్త మోకాళ్లపై నిల్చొని ఎర్ర గులాబీని ఇవ్వడం ద్వారా తన ప్రేమను వ్యక్తం చేయాలని ఆమె కోరుకుంది. ఆమె కోరుకున్న విధంగానే గౌతమ్ కిచ్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ కారణంగా, గౌతమ్తో మ్యారేజ్కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చేయకపోతే అతన్ని వివాహం చేసుకోవడం కష్టమేనని ఆమె సరదాగా వ్యాఖ్యానించింది. ప్రతి అమ్మాయి తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి నుండి గులాబీని పొందాలని కోరుకుంటుందని కాజల్ చెప్పింది. పెళ్లిని ఖాయం చేసుకునే ముందు గౌతమ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడని కాజల్ తెలిపింది. అయితే అతను మోకాళ్లపై ఉండి గులాబీతో ప్రపోజ్ చేయాలని ఆమె రూల్ పెట్టింది.
వర్క్ విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య' చిత్రంలో కాజల్ అగర్వాల్ కనిపించనుంది. డిసెంబర్ 5 నుండి ఆమె సెట్స్లో ఉంటున్నట్లు సమాచారం. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం కరోనావైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో వాయిదా పడింది. లాక్డౌన్ ముగిసి, ప్రభుత్వం అనుమతులు ఇచ్చాక షూటింగ్ను పునరుద్ధరించారు. విష్ణు మంచు నటిస్తోన్న 'మోసగాళ్లు' చిత్రంలో ఆమె అతని సోదరిగా కనిపించనుండటం విశేషం. అలాగే కమల్ హాసన్ సినిమా 'ఇండియన్ 2'లో ఆమె ఆయన జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.