అభిమానులు ప్రేమగా 'తల' అని పిలుచుకొనే అజిత్ తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అతని పీఆర్వో సురేశ్ చంద్ర తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. కొవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా, తన విరాళాన్ని ఆయన ఈరోజు (మే 14) ఉదయం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించారు.
కరోనా మహమ్మారిపై పోరాటం కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంపీఆర్ఎఫ్)కి విరాళాలు అందజేయాల్సిందిగా ఈ నెల 11న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రజలను, ప్రైవేట్ సంస్థలను రిక్వెస్ట్ చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు అవసరంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి పలువురు కోలీవుడ్కు చెందిన పలువురు యాక్టర్లు, టెక్నీషియన్లు విరాళాలు అందజేస్తూ వస్తున్నారు.
ఈరోజు తన వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్కు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ. 25 లక్షలు విరాళం అందించారు అజిత్కుమార్. ఆయన కంట్రిబ్యూషన్ను ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అభినందిస్తూ ట్విట్టర్ ద్వారా సందేశాలు పోస్ట్ చేశారు.