![]() |
![]() |

నటుడు సందీప్ కిషన్ (Sundeep Kishan), దర్శకుడు కృష్ణ చైతన్య కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పవర్ పేట' (Power Peta). 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతోంది. కృష్ణ చైతన్యకు ఇది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పవచ్చు. అలాంటి సినిమా ఇద్దరు హీరోలను దాటుకొని, ఇప్పుడు ఫైనల్ గా సందీప్ కిషన్ చేతికి వెళ్ళింది.
కథా నేపథ్యం
‘పవర్ పేట’ కేవలం ఒక సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఇది ప్రేమ, ఆత్మగౌరవం, రాజకీయాల చుట్టూ తిరిగే ఒక ఇంటెన్స్ జోనర్-బ్లెండింగ్ ఫిల్మ్. ఒక సాధారణ వ్యక్తి, శక్తివంతమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు అనే ప్రయాణాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య ఇందులో ఆవిష్కరించబోతున్నారు.
ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుండటం విశేషం. పీరియడ్ సెటప్లో సాగే ఈ కథలో సందీప్ కిషన్ విభిన్నమైన గెటప్స్లో కనిపించనున్నారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. చెస్ బోర్డుపై గులాబీ పువ్వు, రక్తపు మరకలతో డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది.

నితిన్ నుంచి సందీప్ కిషన్ వరకు:
నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట హీరో నితిన్తో ప్రారంభం కావాల్సింది. కొన్ని ఏళ్ల క్రితమే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత విశ్వక్ సేన్ పేరు వినిపించినా అదీ పట్టాలెక్కలేదు.
ఇప్పుడు అదే శక్తివంతమైన కథను సందీప్ కిషన్ తన భుజానికెత్తుకున్నారు. సందీప్ కిషన్కు ఉన్న మాస్ ఇమేజ్, ఆయన నటనకు ఈ ‘పవర్ పేట’ కథ సరిగ్గా సరిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
నిర్మాణ విలువలు:
ఈ చిత్రాన్ని 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రస్టిక్ విజువల్స్, సహజ సిద్ధమైన లోకేషన్లలో చిత్రీకరణ జరపనున్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు కృష్ణ చైతన్య ధీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |