![]() |
![]() |

-రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ కొడుతుందా!
-ఇంకెందుకు ఆలస్యం ఓటిటిలోకి వెళ్ళండి
-మీ కోసమే వచ్చింది
దేవభూమిగా కేరళ రాష్టానికి ఉన్న కితాబు గురించి తెలిసిందే. చాలా ఏళ్ళ నుంచి సినీ ప్రియులకి అద్భుతమైన కథనంతో కూడిన సినిమాలని అందించే సినీభూమిగా కూడా కీర్తి గడించింది. మనుషుల్లో ఉండే మంచి, చెడులని బేసిక్ గా చేసుకొని ఎలాంటి భారీ తననానికి పోకుండా సృజనాత్మకత తో కూడిన చిత్రాలని మాత్రమే తెరకెక్కిస్తోంది. ఈ మధ్య కాలంలో హర్రర్, థ్రిల్లర్ సినిమాలని కూడా తెరకెక్కిస్తు పాన్ ఇండియా ప్రేక్షకులు తమపై పెట్టుకున్న నమ్మకానికి పది రేట్లు అధికంగా సినీ అనుభూతిని, వినోదాన్ని అందిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం సైలెంట్ గా ఓటిటిలోకి షిఫ్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
'శంభవం ఆద్యం ఒన్ను'(sambhavam adhyayam onnu).. పక్కా మిస్టరీ థ్రిల్లర్. గత నెల 6 న థియేటర్స్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఊహకి అందని కథ, కథనం ,ట్విస్టులు, నటీనటుల పెర్ ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ ఇలా అన్ని అంశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. టైమ్ లూప్ ఎలిమెంట్స్ జోడించడం స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు ఈ మూవీ నిన్న అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఐఎమ్డీబీలోను టాప్ రేటింగ్ దక్కించుకుందంటే 'శంభవం ఆద్యం ఒన్ను' క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.
Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ఫెయిల్ అవ్వాలని స్టార్ డైరెక్టర్స్ కోరిక.. కోహ్లి సంచలన కామెంట్స్
కథ విషయానికి వస్తే.. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం నేపథ్యంలో సాగుతుంది. ఇంతకంటే లోతుగా వెళ్లి కథ చెప్పడం సినీ దర్మం కాదు. మీరు కూడా వద్దనే అంటారనుకోండి. మరి లేటు చేయకుండా చూసెయ్యండి. అస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్దార్ధ్ భరతన్, సెంథిల్ కృష ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా జీతు(Jeethu) దర్శకుడు. ఫరాజ్ మహమ్మద్, ఫాహద్, ఫయేజ్ మహమ్మద్ నిర్మాతలు. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేయగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

![]() |
![]() |