![]() |
![]() |

సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu),సుకుమార్(Sukumar)కాంబినేషన్ లో తెరకెక్కిన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'కృతి సనన్'. ఆ తర్వాత 'హీరోపంత్' అనే మూవీతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ హిట్ మూవీస్ లో ఒకటైన 'పరుగు' కి రీమేక్ గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత వరుసగా పలు విభిన్న చిత్రాల్లో చేస్తు, తన అద్భుతమైన నటనతో అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ 'ఆదిపురుష్' లో 'సీతమ్మ తల్లి' గా చేసి భారతీయ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. నిర్మాతగాను సత్తా చాటుతున్న కృతి సనన్ రీసెంట్ గా 'ఇక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా'(Unfpa)కి లింగ సమానత్వ గౌరవ రాయబారిగా ఎంపిక అయ్యింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఇండస్ట్రీలో హీరోకి లభించే సౌకర్యాలు హీరోయిన్ కి లభించవు. సౌకర్యాల్లోనే కాదు గౌరవించడంలోను తేడా ఉంది. హీరోలకి పెద్ద పెద్ద కార్లు, రూమ్స్ కేటాయిస్తారు. మాకు మాత్రం అలా ఉండవు. ఇలా ఎందుకు చేస్తారని చాలా సార్లు బాధపడ్డాను. షూటింగ్ టైంలో హీరో కంటే ముందే సెట్ కి వచ్చి వెయిట్ చేస్తుండాలి. ఒక వేళ మేము సెట్ కి లేట్ గా వస్తే ఒప్పుకోరు .హీరోలు లేట్ గా వచ్చినా వాళ్ళని అడిగే దైర్యం చెయ్యరు. మా అమ్మ 'లింగ వివక్ష'ని దాటుకొని నాకు నా సోదరికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి పెంచింది. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని కృతి సనన్ చెప్పుకొచ్చింది.
ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ ఇండియా ప్రధాన కార్యాలయం 'న్యూయార్క్'(New York)లో ఉంది. ప్రధానంగా లింగ సమానవత్వాన్ని పెంపొందించడమే ఆ సంస్థ ప్రధాన లక్ష్యం. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి, తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బాల్య వివాహం , లింగ ఆధారిత హింస, ప్రసూతితో పాటు, స్త్రీ కి సంబందించిన అనేక సమస్యలపై ఎవెర్ నెస్ తీసుకురానుంది. సినిమాల పరంగా చూసుకుంటే కృతి సనన్ గత ఏడాది 'దోపత్తి' అనే వెబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం 'తేరే ఇష్క్ మెయిన్' తో పాటు 'కాక్ టైల్ పార్ట్ 2 ' చిత్రాల్లో చేస్తుంది.

![]() |
![]() |