![]() |
![]() |

పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే.దీంతో అల్లుఅర్జున్(allu arjun)సుకుమార్(sukumar)చిత్ర నిర్మాతలు జరిగిన ఘటనకి చింతిస్తు 3 కోట్ల రూపాయలు ఇవ్వగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో దిల్ రాజు రేవతి భర్తకి సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తానని మాట ఇచ్చాడు.
ఇక రేవతి కేసులో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి తరలించగా హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మరుసటి రోజే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.ఇప్పుడు ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చెయ్యగా కోర్టు తదుపరి విచారణ జనవరి 3 కి వాయిదా వేసింది.
![]() |
![]() |