![]() |
![]() |
పుష్ప2 రిలీజ్ సందర్భంగా వేసిన ప్రీమియర్ షోలో విషాద ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్రోడ్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు 9 ఏళ్ళ శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత 11 రోజులుగా అతనికి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అతని పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా కిమ్స్ ఆస్పత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అతను కోమాలోనే ఉన్నాడని, పైప్ ద్వారా లిక్విడ్ రూపంలో ఆహారాన్ని అందిస్తున్నామని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే ట్రీట్మెంట్కి అతను స్పందించడం లేదని, తమ ప్రయత్నం చేస్తున్నామని, దేవుడిపైనే భారం అని డాక్టర్లు చెప్పడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. శ్రీతేజ్ కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
![]() |
![]() |