![]() |
![]() |

బెంగళూరు నగర శివారులోని జి.ఆర్. ఫామ్ హౌస్లో మే 19న జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి చాలా మందిని అదుపులోకి తీసుకొని వారికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. వారిలో కొందరికి పాజిటివ్ వచ్చింది. అలా వచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. ఆ తర్వాత ఆమె రిపోర్ట్ పాజిటివ్గా రావడంతో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మొదటి నుంచీ హేమ చెబుతోంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళపాటు ఎవరికీ అందుబాటులో లేరు. రీసెంట్ ఒక వీడియోని రిలీజ్ చేసారు.
ఆ వీడియో హేమ మాట్లాడుతూ ‘నేను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా వాయిస్ వాళ్ళకి వినిపించాలి. కొన్ని మీడియా ఛానల్స్ నన్ను ఒక టెర్రరిస్ట్లా, జిహాద్కి వర్క్ చేసేదానిలా ప్రచారం చేసాయి. రేవంత్రెడ్డిగారిని, పవన్కళ్యాణ్గారిని ఎలా కలవాలో అర్ధం కావడం లేదు. నేను ఆ ఇద్దరినీ కలవాలంటే నా శ్రేయోభిలాషులు, నా అన్నదమ్ములు, నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ల వల్ల అవుతుంది. మీరంతా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తద్వారా నా వాయిస్ ఆ ఇద్దరికి వినిపించే అవకాశం కలుగుతుంది.
అదే విధంగా కొంత మంది మీడియా వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసారు. పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని కూడా చెప్పారు. నేనేం తప్పు చేసానని సెటిల్మెంట్కి రావాలి. ఆ మీడియా వాళ్ళ నంబర్స్ కూడా త్వరలోనే బయట పెడతాను. మీడియా వల్ల ముపై ఐదు సంవత్సరాలుగా సంపాదించుకున్న పరువు మొత్తం భూస్థాపితం అయిపోయింది. నా హెయిర్, నైల్, బ్లడ్ అన్నీ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. నా మాటలని నమ్మమని చెప్పడం లేదు. బహిరంగంగా ఎలాంటి టెస్ట్లకైనా సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు హేమ.
![]() |
![]() |