![]() |
![]() |
సోషల్ మీడియా బాగా విస్తరించడంతో సెలబ్రిటీలు ఎంతో జాగ్రత్తగా పోస్టులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారు విపరీతమైన ట్రోలింగ్కి గురవుతున్నారు. అలా ఈమధ్య చాలా మంది ట్రోలింగ్ బారిన పడ్డారు. టాలీవుడ్ హీరోయిన్ సమంత పెట్టిన ఓ పోస్ట్పై ఆమధ్య పెద్ద దుమారమే రేగింది. ఆమెను అరెస్ట్ చెయ్యాలంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎంతో కాలం చికిత్స తీసుకున్న తర్వాత దాని నుంచి బయటపడిరది. చికిత్స సమయంలో షూటింగులకు కూడా హాజరు కాలేదు. ఆ టైమ్లోనే సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఓ హెల్త్ టిప్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిపై ఓ డాక్టర్ రియాక్ట్ అయ్యాడు. హెల్త్కి సంబంధించి సమంత పెట్టిన పోస్ట్ కరెక్ట్ కాదని, తన ఫాలోవర్స్ని ఆమె తప్పు దారి పట్టిస్తోందని విమర్శించాడు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్న సమంతను అరెస్ట్ చెయ్యాలంటూ ఘాటుగా స్పందించాడు.
ఇప్పుడు మరో హీరోయిన్ నయనతార వంతు వచ్చింది. తన ఇన్స్టాలో ఒక టీ గురించి ఆమె ఓ పోస్ట్ వేసింది. మందార పువ్వు వేసిన టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని సెలవిచ్చింది. అంతేకాదు, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారికి ఈ టీ ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని సలహా ఇచ్చింది. ఈ పోస్ట్పై పెద్ద చర్చే జరిగింది. అంతకుముందులాగే ఈ పోస్ట్పై ఓ డాక్టర్ స్పందిస్తూ.. నయనతార చెప్పిన దానిలో వాస్తవం లేదని, ఎవరూ దాన్ని నమ్మొద్దు అంటూ రిప్లై ఇచ్చాడు. డాక్టర్ వేసిన ట్వీట్ వైరల్ అయి అది నయనతారను ట్రోల్ చేసే వరకు వెళ్లింది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ ఆమెను విమర్శించారు. దాంతో తను పెట్టిన పోస్టుని డిలీట్ చేసింది నయన్. ఇలా తమకు సంబంధం లేని, అవగాహన లేని హెల్త్ టిప్స్ ఇవ్వడం ఎవరికీ ఆరోగ్యకరం కాదు. ఇలాంటి విషయాల్లో వాస్తవాన్ని సెలబ్రిటీలు గుర్తించాలంటూ నెటిజన్లు హితబోధ చేస్తున్నారు.
![]() |
![]() |