![]() |
![]() |

హనుమాన్(hanuman)మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ(prashanth varma) సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతున్న హనుమాన్ తాజాగా 250 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన ఒక ఫంక్షన్ లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి.
ప్రశాంత్ వర్మ ఆదిపురుష్( adipurush)మూవీ గురించి మాట్లాడుతు నేను ఆదిపురుష్ చూశానని అందులోని కొన్ని సీన్స్ తనకి నచ్చలేదని తానైతే ఆ సీన్స్ ని ఇంకా బాగా తెరకెక్కించేవాడినని చెప్పాడు. పైగా ప్రతి దర్శకుడు కూడా ఒక సినిమా చూస్తున్నంతసేపు అందులో వస్తున్న సీన్స్ ని తాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో ఉహించుకుంటాడని కూడా ఆయన చెప్పాడు. అలాగే సినిమాలోని కొన్ని సీన్స్ చూసి చాలా ఆశ్చర్యపోయానని అవి తనకెంతో నచ్చాయని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఆదిపురుష్ సినిమా ఫలితం తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని కూడా ప్రశాంత్ చెప్పాడు.. ఈ విషయాలన్నీ హిందీ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రశాంత్ చెప్పడం జరిగింది
హైదరాబాద్ లో ఎంతో అట్టహాసంగా జరిగిన హనుమన్ సక్సెస్ మీట్ లో హీరో తేజ సజ్జ (teja sajja)తో పాటు హీరోయిన్ అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ లు పాల్గొన్నారు. అలాగే వీరితో పాటు నిర్మాత నిరంజన్ రెడ్డి మరియు హనుమాన్ కి పని చేసిన సాంకేతిక నిపుణులందరు పాల్గొన్నారు .అలాగే హనుమాన్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్(jai hanuman) ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి.
![]() |
![]() |