![]() |
![]() |
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ జి.ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి.రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి.ఎస్.ఎస్.పెద్దిరాజు, ట్రెజరర్ బి.రాజశేఖర్రెడ్డి మరియు కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జె.బాలరాజు, ఎ.గోపాలరావు.. వెంకయ్యనాయుడుని కలిసి అభినందించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘గతంలో వెంకయ్యనాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు వివిధ శాఖల మంత్రి, ఉప రాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్యనాయుడుగారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది’ అన్నారు.
సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ‘ఈరోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మవిభూషణ్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువాడిగా ఉప రాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి వెంకయ్యనాయుడుగారు. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం’ అని తెలియజేశారు.
![]() |
![]() |