![]() |
![]() |

రెండు రోజులుగా మెగా ఫ్యామిలీ అంతా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి హడావిడిలో ఉంది. పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీతో వివాహ వేడుక మొదలైంది. అక్టోబర్ 31న హల్దీ, మెహందీ ఫంక్షన్లు జరిగాయి. పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ కుటుంబం, స్నేహితులు కలిపి మొత్తం 120 మంది ఇటలీకి వెళ్లారు. ఈరోజు(నవంబర్ 1) మధ్యాహ్నం 2:48 గంటలకు ముహూర్తం కాగా, ముందు జరిగే వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా వీటిలో కొన్ని ఫొటోలు క్యూట్ గా ఉన్నాయి. తల్లి నిర్మల, మేనత్త సురేఖ(చిరంజీవి సతీమణి)తో బన్నీ దిగిన ఫొటో, శిరీష్ కి వరుణ్ కబుర్లు చెబుతున్న ఫొటో, వరుణ్ ఒడిలో నితిన్ కూర్చున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.





![]() |
![]() |