Home  »  News  »  వర్మ వ్యూహం కి బ్రేక్ 

Updated : Oct 20, 2023

 

నట్టికుమార్.. ఒక సినీ నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో అనుబంధం ఉన్న వ్యక్తి. అలాగే ఆయన నిర్మాత మాత్రమే కాదు ఒక ఎగ్జిబిటర్ కూడాను .చిన్న సినిమా లు బతకాలని అనుక్షణం తపించే వ్యక్తి.ఎప్పుడు సినీ పరిశ్రమ మంచిని కోరుకునే అయన దాదాపు ఇరవై ఏళ్ళు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉంటున్నారు. అలాగే సామాన్య ప్రజల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రజలకి మంచి జరగడం కోసం ఎంతవరకైనా పోరాడతారు. ఇప్పుడు ఆయన తాజాగా ఒక సినిమా ని ఆపివేయాలని సంబంధిత అధికారులకి తన లాయర్ ద్వారా వినతి పత్రం తో పాటు గతంలో అధికారులు ఆపివేసిన ఒక సినిమా తాలుకు ఆర్డర్స్ ని అధికారులకి పంపించడం  సంచలనం సృష్టిస్తుంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం నుంచి వస్తున్న తాజా మూవీ వ్యూహం. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్ ఆ విషయం స్పష్టంగా చెప్పింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ,పవన్ కళ్యాణ్ లకి వ్యతిరేకంగా వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలంగాణా  రాష్ట్రం లో విడుదల కాకుండా ఆపాలని నట్టికుమార్ తన లాయర్ ద్వారా సెంట్రల్  చీఫ్ ఎలక్షన్  కమీషనర్ ,తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమీషనర్, మరియు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసారు. తెలంగాణా రాష్ట్రం లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల  వ్యూహం సినిమాను తెలంగాణాలో విడుదల కాకుండా ఆపాలని అలాగే గతంలో ఒకసారి లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ని కూడా అప్పుడు ఉన్న ఎలక్షన్ కమీషన్ అధికారులు అపివేసారని గుర్తు చేస్తూ  అందుకు సంబంధించిన ప్రతుల్ని కూడా నట్టికుమార్ తన లాయర్ ద్వారా ఉన్నతాధికారులకి పంపించాడు.

వ్యూహం సినిమాలో వర్మ చుపించబోతున్నవన్ని పచ్చి అబద్దాలని కావాలనే తనకి నచ్చినట్టుగా చంద్రబాబు గారిని పవన్ గారిని తక్కువ చేసి చూపిస్తున్నాడని ఒక వేళ సినిమా రిలీజ్ అయితే శాంతి భద్రత లకి భంగం వాటిల్లవచ్చని తన ఫిర్యాదులో స్పష్టం గా చెప్పాడు. అలాగే పక్కా ప్లాన్ ప్రకారమే వ్యూహం సినిమా ని కట్టు కధలతో అల్లారని పూర్తి పొలిటికల్ కథతో  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయనను పాజిటివ్ గా చూపిస్తూ ఇతర నాయకులను తక్కువ చేసి చూపిస్తున్నాడని నట్టికుమార్ చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు కు సంబందించిన అంశాలు కూడా ఈ సినిమాలో పెట్టారని  గతంలో ఇలాగే  2019వ సంవత్సరంలో వర్మ  దర్సకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ని  కూడా ఎలక్షన్ కోడ్ సమయంలో రిలీజ్ చేయాలని ప్రయత్నించగా  ఎలక్షన్ కమీషన్ ఆ సినిమా విడుదలను ఆపివేసింది అని గుర్తు చేస్తున్నారు.ఈ సినిమాకి  వైసిపి నాయకుడు  అలాగే గత సంవత్సరం తిరుమల తిరుపతి  ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు గా పని చేసిన  దాసరి కిరణ్ కుమార్ నిర్మాత. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.