![]() |
![]() |

స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ రచించగా, మూడు దశాబ్దాల క్రితం తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన హారర్ నవల 'తులసీదళం'. 1980లో ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్గా 'తులసిదళం' ప్రచురితమైనప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మరోవైపు హేతువాదులు ఈ నవలను సమాజంలో తిరోగామి భావాలను ప్రేరేపించేదిగా ఉందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నవలపై అనేక చర్చలు జరిగాయి. నవలగా పబ్లిష్ అయినప్పుడు కూడా 'తులసీదళం' చరిత్ర సృష్టించింది. ఆ నవల ఆధారంగా కన్నడలో 'తులసీదళ' (1985), తెలుగులో 'కాష్మోరా' (1986), హిందీలో 'ఫూంక్' (2008) సినిమాలు వచ్చాయి.
కాగా ఇప్పుడు ఆ నవలకు సీక్వెల్గా 'తులసీతీర్థం' కథ రాశారు యండమూరి. ఇదివరకు 'ఫూంక్'ను డైరెక్ట్ చేసిన రామ్గోపాల్ వర్మ.. ఇప్పుడు 'తులసీతీర్థం' కథతో, అదే టైటిల్తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీని భీమవరం టాకీస్ బ్యానర్పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించనున్నారు.
గురువారం తన ఆఫీసులో 'తులసీతీర్థం' టైటిల్ లోగో పోస్టర్ను వర్మ ఆవిష్కరించారు. రైటర్ యండమూరి, ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి త్వరలో సెట్స్కు వెళ్లనున్న ఈ హారర్ థ్రిల్లర్కు సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |