రెండు నెలల కాలం నుంచీ నాగచైతన్య, సమంత సంసార జీవితంపై వార్తలు లేని రోజు ఉండటం లేదు. ఆ ఇద్దరూ విడిపోవడం ఖాయమనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట. హైదరాబాద్లో 'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజు సామ్ ఇక్కడ ఉండకుండా చెన్నైలో త్రిష, కీర్తి సురేశ్, కల్యాణి ప్రియదర్శిని లాంటి తోటి తారలతో పార్టీల్లో గడపడం ఆశ్చర్యం కలిగించలేదు. చైతూ-సామ్ ప్రెజెంట్ రిలేషన్షిప్ను ఇది సూచిస్తోందని అనుకోవడానికి ఆస్కారం ఏర్పడింది.
కాగా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజు రాత్రే నాగార్జున 'లవ్ స్టోరి' మెయిన్ యూనిట్కు డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ఆమిర్ ఖాన్ కూడా అటెండయ్యారు. నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల, అఖిల్ పాల్గొన్న ఈ పార్టీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారంతా చాలా హ్యాపీగా టైమ్ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే ఈ పార్టీలో సమంత లేకపోవడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక అక్కినేని ఫ్యామిలీలో సామ్ మెంబర్ కాదనే నమ్మకాన్ని ఈ పరిణామాలు కలిగిస్తున్నాయంటున్నారు ఇండస్ట్రీ జనం.
'లవ్ స్టోరి' ప్రి రిలీజ్ ఈవెంట్లో చైతూ తల్లిదండ్రులు నాగార్జున, లక్ష్మిలను తలచుకొన్న ఆమిర్ ఖాన్, వారి కడుపున పుట్టిన చైతూ ఒక చక్కని నటునిగా, మంచి మనిషిగా మన ముందు ఉన్నాడంటూ ప్రశంసించడం, చైతూకు అసలైన ఫ్యామిలీ ఫ్యాన్స్ అని చెప్పడం, సమంత పేరు కనీసం ప్రస్తావించకపోవడం చాలామంది గమనించారు. చైతూ, సమంత మధ్య దూరం పెరిగిందనే విషయం, వారు విడిపోతున్నారనే విషయం ఆమిర్కు తెలుసు కాబట్టే సామ్ పేరును ప్రస్తావించలేదని అందరూ అనుకుంటున్నారు. అక్కినేని కుటుంబంలో జరిగే వేడుకల్లో, కార్యక్రమాల్లో ఇక ముందు సమంత కనిపించే అవకాశం లేదనేది ఆ కుటుంబ సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.