![]() |
![]() |

'నరుడా డోనరుడా' సినిమాకు సంబంధించి చెక్ బౌన్స్ కేసులో హీరో సుమంత్, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు. తనకిచ్చిన చెక్ బౌన్స్ అయిందంటూ ఈ సినిమా ఫైనాన్సియర్ కారుమంచి శ్రీనివాసరావు గతంలో కేసు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సుమంత్, సుప్రియ కోర్టుకు హాజరయ్యారు.
Also Read: సూపర్ స్టార్ ఎపిసోడ్ కి ఇంత దారుణమైన రేటింగా!!
2012లో వచ్చిన హిందీ చిత్రం ‘విక్కీ డోనర్’కు తెలుగు రీమేక్ గా 'నరుడా డోనరుడా' తెరకెక్కింది. 2016 నవంబర్ లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో సుమంత్ హీరోగా నటించగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై జాన్ సుధీర్ పుధోతతో కలిసి సుప్రియ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఫైనాన్సియర్గా వ్యవహరించిన శ్రీనివాసరావు.. 70 లక్షలకు సుప్రియ, సమంత చెక్ లు ఇవ్వగా, అవి బౌన్స్ అయ్యాయని.. ఈ వ్యవహారంలో తనను మోసం చేశారని మార్కాపురం కోర్టులో కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన వాయిదా కోసం సుమంత్, సుప్రియ గురువారం మార్కాపురం కోర్టుకు హాజరయ్యారు.
Also Read: నిన్నటి వరకు సిరి ఫ్రెండ్.. కానీ ఇప్పడు పెళ్లాం?
అయితే ఈ కేసు విషయంలో గతంలో కూడా సుమంత్, సుప్రియ కోర్టుకి హాజరయ్యారు. మూడు నాలుగేళ్లుగా వాయిదాల మీద నడుస్తున్న ఈ కేసుకు కరోనా వల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఈ గురువారం నాడు మరోసారి ఈ కేసు వాయిదాకు రావడంతో సుమంత్, సుప్రియ కోర్టుకు హాజరయ్యారు.
![]() |
![]() |