![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న 'ఓజీ' సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఓజీ మూవీపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలవుతున్న ఒక్కో కంటెంట్.. ఆ అంచనాలను పెంచుతూ వస్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్న ఓజీ కోసం పవన్ కళ్యాణ్ ఫాన్స్తో పాటు.. సినీ సెలబ్రిటీలు సైతం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ క్రేజ్ కి అద్దంపట్టేలా తాజాగా యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర ట్వీట్ చేశాడు. (They Call Him OG)
"ఓజీ హైప్కి హెల్త్ అప్సెట్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 25 వరకు మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, 25 తర్వాత ఏంటో పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్." అంటూ సిద్ధు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓజీ సినిమా కోసం హీరోలే ఇంత ఎక్సైట్ అవుతుంటే.. ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రీమియర్లు పడనున్నాయి. రేపు(సెప్టెంబర్ 21) ఉదయం ట్రైలర్ విడుదల కానుంది. రేపు సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

![]() |
![]() |