Home  »  News  »  Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ భారీ మూవీ.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్!

Updated : Mar 30, 2026

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan), టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు. #SVC63 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న 63వ చిత్రమిది. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు, వంశీ పైడిపల్లి క్లాసీ అండ్ ఎమోషనల్ మేకింగ్‌ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

షూటింగ్ అప్‌డేట్:
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. ముంబైలోని గోరెగావ్‌లో ఇందుకోసం ఒక భారీ 'మినీ సిటీ' సెట్‌ను కూడా నిర్మించినట్లు సమాచారం.

ఇదొక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్‌లో, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో వంశీ చూపించబోతున్నారట.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై మొదటిసారి రాబోతుండటం విశేషం. అంతేకాకుండా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాక్.

రిలీజ్ టార్గెట్: ఈద్ 2027
సల్మాన్ ఖాన్‌కు 'ఈద్' సీజన్ అంటే ఎంత సెంటిమెంటో మనకు తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ కానుంది.

దిల్, దిమాగ్, జిగర్‌తో వస్తున్నాం!
షూటింగ్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "దిల్, దిమాగ్, జిగర్ సే.. ఈ ఏప్రిల్ నుండి ప్రారంభం" అంటూ డైరెక్టర్ వంశీతో దిగిన ఫోటోను షేర్ చేశారు.

వంశీ పైడిపల్లి బాలీవుడ్ ఎంట్రీ
ప్రభాస్‌తో 'మున్నా' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన వంశీ పైడిపల్లి.. బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి బ్లాక్ బస్టర్లను అందించారు. విజయ్‌తో 'వారసుడు' తీసి కోలీవుడ్‌లోనూ సత్తా చాటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగుపెడుతున్నారు. నిజానికి బాలీవుడ్ ఎంట్రీ కోసం చాలారోజులుగా వంశీ వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన ఎదురుచూపులకు తెర పడింది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, బలమైన ఎమోషనల్ కోర్ ఉన్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

https://x.com/SVC_official/status/2038507294846255377






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.