Home  »  News  »  ‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను: సాయి ధరమ్ తేజ్

Updated : Jul 31, 2025

 

వైవిధ్యమైన కంటెంట్‌తో అలరిస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 

 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. "దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ఇప్పుడు దేవా కట్టా గారి కోసం ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను"అని అన్నారు.

 

దేవా కట్టా మాట్లాడుతూ .. "మయసభ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌‌లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.

 

సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ .. "కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించాం. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నాం." అని అన్నారు.

 

సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎంత అందంగా నెరేట్ చేశారో.. అంతే అద్భుతంగా తీశారు. ఎంతో గొప్ప నటీనటులు అందరూ ఆ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దేవా కట్టా గారు మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. దేవా గారు ఈ సిరీస్ కోసం వందకు 150 శాతం కష్టపడ్డారు. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌కు చేసి పెట్టిన దేవా కట్టా గారికి థాంక్స్" అని అన్నారు.

 

ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. "పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా గారు పని చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌ని సపోర్ట్ చేస్తున్న సోనీ లివ్‌ టీంకు థాంక్స్. దేవా గారు కన్న కలను ‘మయసభ’ టీం నిజం చేసింది. శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.

 

చైతన్య రావ్ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గారు చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్ సర్, సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం అదృష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్‌లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.

 

నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ .. "మయసభ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది" అని అన్నారు.

 

నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ .. ‘"దేవా గారు ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.

 

చరితా వర్మ మాట్లాడుతూ .. "నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఆది, చైతన్య గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.

 

నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. ‘మయసభ’ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.

 

మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ మాట్లాడుతూ .. "మయసభ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దేవా గారికి థాంక్స్. బృందా తరువాత సోనీ లివ్‌లో ఇది నాకు రెండో ప్రాజెక్ట్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

 

డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా గారికి, సోనీ లివ్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 7న బ్లాస్ అయ్యేలా ‘మయసభ’ రాబోతోంది" అని అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.