![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో తెలుగు హీరోగా చరణ్ నిలవనున్నాడు. గతంలో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ ఘనత సాధించారు.
బ్యాంగ్ కాక్ లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ (Prabhas), సింగపూర్ మ్యూజియంలో మహేష్ బాబు (Mahesh Babu), దుబాయ్ లో అల్లు అర్జున్ (Allu Arjun) మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు లండన్ ఉన్న మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. చరణ్ ఫ్రెంచ్ బార్బేట్ జాతికి చెందిన రైమ్ అనే ఓ కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. ఆ రైమ్ ను ఎత్తుకుని ఉన్న చరణ్ మైనపు బొమ్మనే మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |