![]() |
![]() |

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన-దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
'లగ్గం' సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ.. "లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి. 'లగ్గం విందు భోజనం' లాంటి సినిమా" అని అన్నారు.

దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ... "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.. రెండు మనసులు కలవడం. గట్టి దావత్ ఇవ్వబోతున్నాం" అన్నారు.
హీరో సాయి రోనక్ "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్ ఉంటాయి. తెలంగాణ పెళ్లి కల్చర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుంది. పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు .
రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా బేబీ ఫేమ్ బాల్ రెడ్డి, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 5నుండి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.
![]() |
![]() |