'వంగవీటి', 'జార్జ్ రెడ్డి' చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ మాధవ్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో అప్సర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
'గంధర్వ' సినిమాని జూలై 1న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది. జూలై 8 న థియేటర్లలో విడుదల కాబోతుంది.
గాయత్రి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. సినిమాటోగ్రఫీ జవహర్ రెడ్డి అందించగా ఎడిటర్ గా బసవా పైడి రెడ్డి వ్యవహరించారు.