![]() |
![]() |

కబాలి, సార్పట్ట, తంగలాన్ వంటి పలు విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం మరో విభిన్న తరహా కథతో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని స్టంట్ మాస్టర్ ఎస్ ఏం రాజు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు కొన్ని కార్లతో రిస్క్ తో కూడిన యాక్షన్ సీన్స్ నీ చిత్రీకరించారు. కారు పల్టీలు కొట్టడంతో రాజు చనిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |