'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సుజిత్. మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. రెండో సినిమాగా పాన్ ఇండియా మూవీ 'సాహో' చేశాడు. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైంది. అయితే ఆ అంచనాలను అందుకోవడంతో విఫలమైంది సాహో. అయినప్పటికీ 'లూసిఫర్' రీమేక్ తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు సుజిత్. కానీ చివరి నిమిషంలో ఆ అవకాశం చేజారిపోయింది. అయితే ఇప్పుడు సుజిత్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడని అంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను దృష్టి లో పెట్టుకుని సుజిత్ ఓ స్టొరీ రెడీ చేశాడట. తాజాగా ఆ స్టొరీని చరణ్ కి వినిపించగా.. ఇంప్రెస్ అయిన చరణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీన్ని సుజిత్ తొలి రెండు సినిమాలు రన్ రాజా రన్, సాహోలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సంస్థే నిర్మించనుందట. మొత్తానికి మెగా స్టార్ ప్రాజెక్ట్ మిస్ అయినా.. మెగా పవర్ స్టార్ ప్రాజెక్ట్ సుజిత్ కు లభించిందని టాక్ వినిపిస్తోంది.
చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. అలాగే చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య'లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే మూవీ చేయబోతున్నాడు.