మహేష్, చరణ్ ల మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Dec 8, 2021
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో చివరి ఎపిసోడ్ లో సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మల్టీస్టారర్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ జనరేషన్ హీరోలంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారనీ అన్నాడు. మల్టీస్టారర్ సినిమాలు చేయడం తనకి ఇష్టమేనని చెప్పిన మహేష్.. రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు చాలా మల్టీస్టారర్స్ చూడబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే మహేష్ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నాడని, దానిని దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశాడని ప్రచారం జరుగుతోంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఎఫెక్ట్.. మా థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలి!
మహేష్ గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. ఇక చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తారక్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్స్ కి శ్రీకారం చుట్టింది. దర్శక నిర్మాతలతో పాటు స్టార్స్ సైతం మల్టీస్టారర్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. మహేష్-చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ తెరకిక్కేంచేందుకు సన్నాహాలు చేస్తున్నారని న్యూస్ వినిపిస్తోంది. ఈ క్రేజీ మల్టీస్టారర్ కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వంశీ గతంలో చరణ్ తో 'ఎవడు', మహేష్ తో 'మహర్షి' సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్స్ తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Also Read: తారక్, మహేష్ ల మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కి పండగే!
కాగా, చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, చిరంజీవి 'ఆచార్య'లో కీలక పాత్రలో నటించిన చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. వంశీ పైడిపల్లి విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
Also Read