ముగ్గురు హీరోలతో త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్..!
on Jun 8, 2025
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ (Trivikram) ఒకరు. ఆయనతో సినిమా చేయడానికి బిగ్ స్టార్స్ కూడా ఆసక్తి చూపిస్తారు. అలాంటి త్రివిక్రమ్.. ఏడాదిన్నర అవుతున్నా తన కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్రివిక్రమ్ గత చిత్రం 'గుంటూరు కారం' 2024 జనవరిలో విడుదలైంది. ఇప్పుడు 2025 జూన్ వచ్చింది. అయినా ఆయన నెక్స్ట్ మూవీ మొదలుకాలేదు. అయితే ఈ గ్యాప్ ని కవర్ చేసేలా త్రివిక్రమ్ ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది త్రివిక్రమ్. కానీ, అట్లీ ప్రాజెక్ట్ తో బన్నీ బిజీ కావడంతో.. మాటల మాంత్రికుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. వెంకటేష్, రామ్ చరణ్, శివకార్తికేయన్, రామ్ వంటి హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం.. ఒక ప్రాజెక్ట్ కాదు, ఏకంగా ప్రాజెక్ట్ లను త్రివిక్రమ్ లైన్ లో పెడుతున్నారని అంటున్నారు.
త్రివిక్రమ్ చేయనున్న ప్రాజెక్ట్ లలో.. ఒక దానిలో వెంకటేష్, మరో దానిలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారట. మూడో ప్రాజెక్ట్ కోసం ఏ హీరోని రంగంలోకి దింపుతారో చూడాలి. ఇప్పటికే ఈ మూడు సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లు పారలల్ గా జరుగుతున్నాయట. వేగంగా పూర్తి చేసి.. రాబోయే రెండు మూడేళ్ళలో ఈ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి గ్యాప్ ని కవర్ చేసేలా త్రివిక్రమ్ జెట్ స్పీడ్ లో మూడు ప్రాజెక్ట్ లను చేయడానికి సిద్ధమైనట్లు వినికిడి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
