టైగర్-దిశ వెడ్డింగ్ రూమర్స్.. జాకీ ష్రాఫ్ రియాక్షన్!
on Mar 2, 2021
బాలీవుడ్ యూత్ ఐకాన్ టైగర్ ష్రాఫ్ నేడు 31వ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అతడిని శుభాకాంక్షల్లో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంలో గాళ్ఫ్రెండ్ దిశా పటానీని త్వరలోనే టైగర్ పెళ్లాడబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై టైగర్ ఫాదర్, నిన్నటి తరం టాప్ హీరో జాకీ ష్రాఫ్ రియాక్టయ్యారు.
టైగర్ వెడ్డింగ్ ప్లాన్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో జాకీని ప్రశ్నించగా, "ప్రెజెంట్ అతను తన పనిని పెళ్లాడాడు. పని మీద నుంచి తన దృష్టిని మరో విషయంపైకి మళ్లిస్తాడని నేననుకోను. దేనిపైనైనా అతను ఫోకస్ పెట్టాడంటే, అది లేజర్ లాంటి ఫోకస్ అవుతుంది. అతను పెళ్లాడితే, అతని ఫోకస్ అంతా దానిపైనే ఉంటుందని నాకు తెలుసు." అని చెప్పారు.
టైగర్ బర్త్డే సంప్రదాయాల గురించి మాట్లాడుతూ, "జనరల్గా నేను అతని పేరు మీద ఓ మొక్క నాటుతాను. మా అబ్బాయి తనకోసం, తన తల్లి కోసం, సిస్టర్ కృష్ణ కోసం ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. ఆ రోజు నాకు షూటింగ్ ఉంటే, సాయంత్రం వాళ్లు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు. ఉదాహరణకు, ఇంట్లో డిన్నర్ లాంటిది." అని ఆయన వెల్లడించారు.
టైగర్ ఒక కలలుకనే యువకుడిగా ఆయన చెప్పుకొచ్చారు. "చిన్నప్పుడు వాడు కలలు కనేవాడు. ఇప్పడూ కలలు కంటూనే ఉన్నాడు. తన వర్క్ గురించీ, హెల్త్ గురించీ కలలు కంటున్నాడు. ఈ టైమ్లో ఇది సరైన పని అనుకుంటే ఆ పని చేసేస్తాడు. చిన్నపిల్లలు వాడిని ఇష్టపడుతుండటం చూస్తే నాకు ముచ్చటగా అనిపిస్తుంది. నేను పిల్లల్ని ఎవరైనా కలిస్తే, వారు 'అతను చాలా బాగా చేస్తున్నాడు', 'అతను సిక్స్ ప్యాక్ ఎలా చేశాడు?', 'అతనేం తింటుంటాడు?' అని అడుగుతుంటారు అని తెలిపారు ప్రౌడ్ ఫాదర్ జాకీ.
Also Read