English | Telugu

సుధీర్ కి విజయ్ ఆంటోనీ కూడా పెద్ద ఫ్యాన్


సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షోకి "మార్గన్"మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోని, అజయ్ ధిషన్ వచ్చారు. రాగానే "మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్..మీరు ఎంచుకుంటే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి " అంటూ సుధీర్ చెప్పాడు. దాంతో విజయ్ ఆంటోని వెంటనే "నేను కూడా నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని.. నీ షోస్ అన్ని నేను చూసాను. రష్మీతో నీ కెమిస్ట్రీ చాలా ఆసంగా ఉంటుంది" అనేసరికి సుధీర్ సిగ్గుపడిపోయాడు. "సర్ అసలు నేను ఇన్ని షోస్, సినిమాలు ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా సర్" అనగానే బిచ్చగాడు మూవీలోంచి "ఒక్క పూట అన్నం కోసం" అంటూ సాంగ్ పడేసారు విజయ్. ఇక మూవీలో లేడీ క్యారెక్టర్స్ ఐన బ్రిగిడ సాగ, దీప్ షికా వచ్చారు. సుధీర్ ఐతే "మీరు సర్కార్ గురించి టెన్షన్ పడక్కర్లేదు..బ్రెయిన్ ఉన్నోళ్లు విన్ అవుతారు అసలు బ్రెయిన్ లేనోళ్ళు ఉన్నారనుకోండి" అనేసరికి "యాంకర్ అవుతారు" అంటూ కౌంటర్ వేసింది.

"నువ్వేం ప్రేమ కోసం వెతకక్కర్లేదు.." అంటూ దీప్ షికా సుధీర్ ని చూసి కన్ను కొట్టింది. దాంతో సుధీర్ ఎం చేశారు మేడం మీరిప్పుడు అన్నాడు వెంటనే అజయ్ ఎంట్రీ ఇచ్చి " రష్మీ మేడంకి ఈ విషయం తెలుసా" అని అడిగాడు. ఇక ఈ షోలో "గీతాంజలి" మూవీలోని ఒక సీన్ ని స్పూఫ్ గా చేశారు సుధీర్, దీప్ షికా. విజయ్ ఆంటోనీ వాళ్ళను డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ టీమ్ మొత్తం సర్కార్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నవ్వించబోతున్నారు.

Brahmamudi : తన పాప కాదనే నిజం కావ్యకి తెలుస్తుందా.. మినిస్టర్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -936 లో.... కావ్య ఎప్పుడు అలా మాట్లాడలేదు. అలా అంటుందంటే తన మాటల్లో నిజం ఉందని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నాకు కావ్య మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది కానీ ఒక్క మాటతో మనం సాక్ష్యం చూపించలేం కదా ఆధారాలు కావాలని రాజ్ అంటాడు. మనం ముందు DNA టెస్ట్ చేయించాలని అప్పు చెప్తుంది. ఒకవేళ కోర్ట్ లో కేసు వేసినా వాళ్ళు కూడా ఇదే చెప్తారు. మనం ముందే చేపిద్దామని అప్పు అనగానే రాజ్ సరే అంటాడు. అదే విషయం కావ్యకి చెప్పాడానికి రాజ్ వెళ్తాడు.

Jayam serial : గంగ జాతకంలో తన భర్తకి ప్రాణగండం.. బాబా మాటలతో కుటుంబమంతా షాక్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -175 లో... శకుంతలతో పాటు పెద్ద సారు, వీరు, ఇషిక, సూర్య, గంగ అందరు హాల్లో ఉంటారు. ఎందుకు మనం అంతా ఇప్పుడు ఇలా ఎదురుచూడటం ఎవరు ఈ బాబా అని శకుంతల అడుగుతుంది. ఎప్పటి నుండో మనం స్వామిని నమ్ముకున్నాం కదా కొత్తగా ఈ బాబా ఏంటని శకుంతల అడుగగా.. మంచి మహిమ గల బాబా అని మా అమ్మ చెప్పిందని గంగ అంటుంది. అదే ఎందుకు ఇప్పుడు అని అంటుంది. ఏ రాయిలో ఏ మహిమ ఉందోనని కనపడిన ప్రతీ దగ్గర మొక్కుకోవట్లేదా అని పెద్దసారు అంటాడు. అప్పుడే విభూది బాబా వస్తాడు. 

Karthika Deepam2 : కార్తీక్ కి ఫోన్ చేసిన దాస్.. జ్యోత్స్న పని అయిపోయినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -574 లో.....శివన్నారాయణ ప్రొద్దున్నే సూర్య నమస్కారం చేస్తుంటే పారిజాతం వచ్చి తన ముందు ఉంటుంది. ఛీ నువ్వు ఎందుకు వచ్చావని కోప్పడతాడు. సుమిత్ర, దశరథ్ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడే దీప, శౌర్యలని తీసుకొని వస్తాడు కార్తీక్. మీ అమ్మ ఎక్కడ అని శివన్నారాయణ అడుగుతాడు. తనకి ధైర్యం సరిపోవడం లేదట రాలేను అందని కార్తీక్ చెప్తాడు. పాపం జ్యోత్స్న పరిస్థితి కూడా అలాగే ఉంది రా.. గదిలో నుండి బయటకు రావడం లేదని పారిజాతం అంటుంది. నేను రప్పిస్తా కదా అని కార్తీక్, జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు.

Podharillu : రౌడీలతో ఆది దాడి..   స్వల్ప గాయాలతో కన్నా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో......చక్రిని మహా పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. మీ వాళ్ళు నేను ఇక్కడే ఉంటానని అనుకుంటున్నారు ఇవన్నీ ఏర్పాట్లు ఏంటి వాళ్ళకి చెప్పండి లేదా నేనైనా చెప్తానని మహా అంటుంది. వాళ్లకి నేను చెప్తాను కానీ ఇప్పుడే కాదు ప్లీజ్ అర్ధం చేసుకోండి అని చక్రి అనగానే మహా సరే అంటుంది. మరొకవైపు మాధవ వంట చేస్తాడు. అసలు వదిన ఇక్కడ అడ్జెస్ట్ అవుతుందా వచ్చినప్పుటి నుండి ఇంటిని అదోలా చూస్తుందని కన్నా అంటాడు. చక్రి అన్ని విషయాలు చెప్పే ఉంటాడులే అని మాధవ అంటాడు.