English | Telugu

Eto Vellipoindi Manasu : రమ్య ప్లాన్ తెలుసుకున్న రామలక్ష్మి.. అతడికి నిజం చెప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -359 లో... రమ్య ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం రామలక్ష్మి చూస్తుంది. రమ్య వెళ్ళిపోయాక అడ్వాన్స్ తీసుకున్నఅతని దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. రమ్య గురించి అడుగుతుంది. ఇల్లు కొంటానంటే నీకు అంత సీన్ లేదన్న అందుకే పొగరుగా వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తుందని అతను చెప్తాడు. అంత డబ్బు ఎలా వచ్చిందంటారని రామలక్ష్మి అతన్ని అడుగగా.. చూస్తే తెలియడం లేదా నిన్న నడుచుకుంటూ వచ్చింది.. ఇప్పుడు కార్ లో వచ్చింది.. ఎవడో బకరాని పట్టిందని అతను అంటాడు.

ఆ తర్వాత రామ్ కి రమ్య భోజనం తినిపిస్తుంది. నిన్ను అందరిలాగే పేరు పెట్టి పిలుస్తానని రామ్ అనగానే సరే అని రమ్య అంటుంది. అదంతా సీతాకాంత్ చూస్తుంటాడు. రమ్య నాపై ప్రేమతో రామ్ ని బాగా చూసుకుంటుంది.. నేనే తనని అవసరం కోసం వాడుకుంటున్నానని అనుకుంటాడు. మీరు ఇలా నాపై జాలి చూపిస్తేనే కదా మీరు నాకు దగ్గర అయ్యేదని రమ్య అనుకుంటుంది. రమ్య చూసారా తన నటనతో బావ గారిని ఎలా పడేస్తుందోనని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి ఫణీంద్ర మనిషి వచ్చి రమ్య గురించి ఇన్ఫర్మేషన్‌ ఇస్తాడు. తాను డబ్బు కోసం ఇదంతా చేస్తుంది. సందీప్ అకౌంట్ నుండి తన అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్తాడు. నా అనుమానమే నిజం అయిందన్నమాట అని రామలక్ష్మి అనుకొని సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది.

మరోవైపు నా రామలక్ష్మి రేపు బయటపడుతుందనుకుంటే ఈ రోజే బయటపడుతుంది. ఎందుకు కలవాలని ఫోన్ చేసింది.. ఇప్పటికైనా ఒప్పుకుంటుందేమో అని సీతాకాంత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వచ్చి శ్రీలత, రమ్య నాటకం గురించి చెప్పినట్లు దాంతో నువ్వే రామలక్ష్మివి అని సీతాకాంత్ అన్నట్లు.. దాంతో ఏం చేయలేక రామలక్ష్మి నిజం ఒప్పుకున్నట్లు ఉహించుకుంటుంది. ఇక రామలక్ష్మి వస్తుంటుంది..‌అలా సీతాకాంత్ దగ్గర వరకు వచ్చి అలా కాకుడదని వెళ్లిపోతుంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మిని సీతాకాంత్ చూసి ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు. కొంచెం బిజీ అందుకే వెళ్తున్నానని వెళ్తుంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా బయటపడాలి కదా అని సీతాకాంత్ అనుకుంటాడు. శ్రీలత, శ్రీవల్లి, రమ్య ముగ్గురు నగలు సెలెక్ట్ చేసుకుంటుంటే రామలక్ష్మి వెళ్తుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.

Illu illalu pillalu : శ్రీవల్లిని ఇరికించిన ప్రేమ, నర్మద.. ప్రేమ ఎస్సై కావాలని ధీరజ్ తపన!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Ilu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -334 లో.....శ్రీవల్లి తన పుట్టింటికి వచ్చి ఇవన్నీ జరగడానికి కారణం మీరే.. అసలు నా భర్తతో సంతోషంగా కాపురం చెయ్యట్లేదు. ఎప్పుడు నిజం తెలుస్తుందోనని భయపడుతున్నానని శ్రీవల్లి అంటుంది. ఆ నర్మద, ప్రేమ మంచి వాళ్ళు కాబట్టే వాళ్ళు నిజం చెప్పకుండా ఆగారు.. వాళ్ళ జోలికి నువ్వు వెళ్లకుంటే వాళ్ళు కూడ నీ జోలికి రారు అమ్మ అని ఆనందరావు అంటాడు. చాల్లే చెప్పొచ్చావ్.. ఇప్పుడు మీ మావయ్య వాళ్ళపై కోపంగా ఉన్నాడు.. మనం అనుకున్నది జరుగుతుందని శ్రీవల్లికి భాగ్యం దైర్యం చెప్పి పంపిస్తుంది.  

Karthika Deepam2 : దీప కడుపులో బిడ్డ క్షేమం కోసం శివన్నారాయణ తపన.. తను ఒప్పుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -533 లో... దశరథ్, సుమిత్ర కలిసి దీపని తన బిడ్డ అనుకొని పసుపు కుంకుమతో సారె తీసుకొని వచ్చి ఇస్తారు. దాంతో దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కార్తీక్, దీప ఇద్దరు సుమిత్ర, దశరథ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు మీకొక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం.. ఇక దీప నువ్వు పనికి రానవసరం లేదు.. నువు జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనగానే దీప షాక్ అవుతుంది. నీకు ఏమైనా అవసరం ఉంటే అన్ని మేమ్ తీసుకొని వస్తామని దశరథ్ చెప్తాడు.