English | Telugu

దేవీరెడ్డి మృతిపై రామ్ చరణ్ భార్య స్పందన..!

హైదరాబాద్ లో ఇటీవలే మరణించిన ఇంజనీరింగ్ స్టూడెంట్ దేవీ మరణం మిస్టరీ గా మారిన విషయం తెలిసిందే. మొదట ఆమెడి యాక్సిడెంట్ అని అనుకున్నా, ఆ తర్వాత ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఆమెను హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దేవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని స్పందించారు. మరో భారత కూతురు ప్రాణం కోల్పోయింది. కానీ నిందితులపై ఎలాంటి చర్యలు లేవు. కేవలం డబ్బు, పలుకుబడి ఉంటే తప్పు చేసి తప్పించుకోవచ్చనుకుంటున్నారు. ఈ కేసులో నిందితులు తప్పించుకోకుండా కలిసి పోరాడాలి. దేవికి న్యాయం జరిగేలా చేద్దాం, నిందితుల్ని శిక్షించే వరకూ పోస్ట్ ను షేర్ చేద్దాం అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ఉపాసన. కాగా దేవీ రెడ్డి కేసు రోజురోజుకూ మరింత అనుమానాస్పదంగా మారుతోంది. పోలీసులు రోజుకో వాదన వినిపించడం, ప్రత్యక్షసాక్షులు కథనాలు భిన్నంగా ఉండటంలాంటివి అనుమానాన్ని మరింత బలపరుస్తున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.