English | Telugu

మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌!

పవన్‌కళ్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన వయొలెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చేస్తున్నారు పవన్‌. ఈ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ చేయబోయే సినిమా ఏమిటి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతంగా ఉంది.

పవర్‌స్టార్‌ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ న్యూస్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనొక్కడే, కిక్‌, రేసుగుర్రం, ఊసరవెల్లి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో పవన్‌కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్‌క్యూజివ్‌ అప్‌డేట్‌ ఏమిటో చూద్దాం.

పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ దక్కించుకున్న నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మించే ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్‌ ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు సురేందర్‌రెడ్డి. ఇంటర్వెల్‌ ముందు పవన్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 నిమిషాల పాటు నడుస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ కేటాయించారు. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. ఆ హీరో ఎవరు అనేది నెక్స్‌ట్‌ అప్‌డేట్‌లో తెలుసుకుందాం.