English | Telugu

సినీనటుడు నూతన్ ప్రసాద్ మృతి

సినీనటుడు నూతన్ ప్రసాద్ మృతి చెందారు. మార్చ్ 30 వ తేదీన ఉదయం నూతన్ ప్రసాద్ ఆరోగ్యం విషమించటంతో, నూతన్ ప్రసాద్ ను ఆసుపత్రికి తరలిస్తూండగా, నూతన్ ప్రసాద్ మరణించారు. నూతన్ ప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యమతో బాధపడుతున్నారు. నూతన్ ప్రసాద్ 1950 అక్టోబర్ 10 వ తేదీన జన్మించారు.

ఆయన రంగస్థలం మీద నటుడిగా మంచి పేరు గడించి, అనంతరం "చలిచీమలు" చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. బాపుగారు దర్శకత్వంలో వచ్చిన "అందాల రాముడు" చిత్రంలో నూతన్ ప్రసాద్ కమర్షియల్ సినిమాల్లో ప్రవేశించటం జరిగింది. బాపు గారి దర్శకత్వంలోని "ముత్యాల ముగ్గు" చిత్రం ద్వారా నూతన్ ప్రసాద్ కు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఆయనకు 1984 లో తొలి సారి నంది అవార్డు లభించింది. 2005 లో యన్ టి ఆర్ జాతీయ పురస్కారం లభించింది.

నూతన్ ప్రసాద్ "బామ్మమాట-బంగారు బాట" చిత్రంలో కారులో పై నుండి కిందపడిన కారణంగా నూతన్ ప్రసాద్ నడుం భాగం పనిచేయటం మానేసింది. అప్పటి నుండీ నూతన్ ప్రసాద్ వీల్ చైర్ లోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. నూతన్ ప్రసాద్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, నూతన్ ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నూతన్ ప్రసాద్ కుటుంబానికి తెలుగువన్ ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.