English | Telugu

చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్.. ఇప్పటికీ అదే మాట మీద కీర్తి సురేష్!

స్టార్స్ లో గొప్ప డ్యాన్సర్ ఎవరంటే ఎక్కువమంది టక్కున చెప్పే పేరు.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). అలాంటిది హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం.. చిరంజీవి కన్నా విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో కీర్తి సురేష్ తీరుని తెలుగు సినీ అభిమానులు తప్పుబట్టారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, తాజాగా ఈ వివాదంపై కీర్తి స్పందించింది. అంతేకాదు, ఇప్పటికీ ఆమె తన కామెంట్స్ ని సమర్ధించుకోవడం విశేషం. (Keerthy Suresh)

కీర్తి సురేష్ నటించిన 'రివాల్వర్ రీటా'(Revolver Rita) మూవీ నవంబర్ 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. మీడియా నుండి 'చిరంజీవి కంటే విజయ్ గొప్ప డ్యాన్సర్ అనడం ఎంతవరకు కరెక్ట్?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి ఊహించని సమాధానం ఇచ్చింది.

"చిరంజీవి గారు లెజెండ్. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఆయన ఒకరు. చిరంజీవి గారిని నేనెంతో గౌరవిస్తాను. అయితే నేను విజయ్ గారికి వీరాభిమానిని అనే విషయం చిరంజీవి గారికి కూడా తెలుసు. ఫేవరెట్ యాక్టర్, ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరని మేము సరదాగా మాట్లాడుకున్నప్పుడు కూడా.. నేను విజయ్ గారి పేరే చెప్పాను. దానిని చిరంజీవి గారు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. పైగా, నేను నిజాయితీగా చెప్పానని ప్రశంసించారు కూడా. విజయ్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన పేరు చెప్పాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో చిరంజీవి గారి అభిమానులను బాధపెట్టి ఉంటే క్షమించండి" అని కీర్తి చెప్పుకొచ్చింది.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.