English | Telugu

జేమ్స్ కామెరూన్ కి సంబంధించిన అసలు నిజాలు ఇవే 


-ఏంటి ఆ నిజాలు
-గత చరిత్ర ఏం చెప్తుంది!
-ఎన్నో సంచలనాలు సృష్టించాడు
-అత్యంత ధనవంతుడు కూడా


ప్రపంచ సినీ పితామహుడు ఎవరంటే సినీ మేకర్స్, సినీ అభిమానుల నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట 'జేమ్స్ కామెరూన్'. ఈ విషయంలో మిగతా వాళ్ళకి డౌట్ ఉంటే రీసెంట్ గా వచ్చిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' తో పాటు అయన నుంచి వచ్చిన గత చిత్రాలే ఉదాహరణ. భూమ్మీద కాలుమోపిన ఒక అతీంద్రియ శక్తిలా వరల్డ్ సినిమా పాతిక సంవత్సరాల తర్వాత ఆలోచించేది కామెరూన్ పాతిక సంవత్సరాల క్రితమే అలోచించి సిల్వర్ స్క్రీన్ పై ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేసాడు. సరికొత్త స్క్రీన్ ప్లే ని,టెక్నలాజి ని పరిచయం చెయ్యడంతో పాటు కథ, కథనాల్లో వేగాన్ని పెంచిన ఘనత కూడా కామెరూన్ సొంతం.అందుకే ప్రపంచ సినీ పితామహుడిగా మారాడు.సోషల్ మీడియాలో తాజాగా కామెరూన్ ప్రారంభ జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు అభిమానులని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


కామెరూన్ పదిహేడేళ్ల వయసులోనే కాలేజీ చదువుకి స్వస్తి చెప్పి పలు రకాల ఉద్యోగాలు చేసాడు.ఈ క్రమంలోనే ట్రక్ (లారీ)డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకుని సినీరంగంలోకి అడుగుపెట్టి రోజర్ కార్మాన్ న్యూ వరల్డ్ పిక్చర్స్ అనే సంస్థలో వారానికి 175 డాలర్లకి దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరాడు. 1978 లో 12 నిమిషాల నిడివితో 20000 డాలర్స్ తో 'జీనో జెనిసస్' అనే సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో షార్ట్ ఫిలింని రూపొందించాడు. మన ఇండియన్ కరెన్సీ లో చెప్పుకోవాలంటే దగ్గర దగ్గర గా 18 లక్షల రూపాయిలు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి 1981లో ‘పిరాన్హా 2: ది స్పానింగ్’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసి మనస్పర్థలు రావడంతో మూవీ కంప్లీట్ కాకముందే దర్శకత్వబాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 1984లో 'ది టెర్మినేటర్' మూవీతో మళ్ళీ దర్శకుడిగా మారారు.

వరల్డ్ వైడ్ గా సదరు చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కామెరూన్ పేరు మారుమోగిపోయింది.ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసిన తర్వాత 1997లో టైటానిక్ మూవీతో ప్రపంచం మొత్తాన్ని మెస్మరైజ్ చేసాడు.తెలుగులో కూడా ఆ చిత్రం విడుదలై చాలా ఏరియాల్లో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత 12 సంవత్సరాలకి అవతార్ ప్రపంచాన్ని సృష్టించాడు. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దర్శకుడిగా కేవలం ఇంత వరకు పదకొండు చిత్రాలే వచ్చినా అవన్నీ వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై మరిచిపోలేని చిత్రాలుగా ఉండిపోయాయి.

also read: నన్ను క్షమించండి.. స్త్రీ అంటే ఒక మహా శక్తి


ప్రస్తుతం రిలీజైన అవతార్: ఫైర్ అండ్ యాష్ చిత్రం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 3,000 కోట్లకి గా వసూలు చేసింది. సినిమా ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో కూడా ఒకరు. నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు 1.1 బిలియన్స్ . అవతార్ 4 2029 డిసెంబర్ 21 న రానుంది. మరి మూడు అవతార్ భాగాలని మించి నాలగవ భాగాన్ని అందించాలని కామెరూన్ ఇప్పట్నుంచే కసరత్తుల్లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.