English | Telugu

Gummadi Narsaiah: అసలు ఈ గుమ్మడి నర్సయ్య ఎవరు..?

ప్రజా నాయకుడు 'గుమ్మడి నర్సయ్య' గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన జీవితం ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు 'గుమ్మడి నర్సయ్య' గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.(Gummadi Narsaiah)

చిన్న చిన్న రాజకీయ నాయకులే మందీ మార్బలంతో హడావుడి చేసే రోజులివి. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా.. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు గుమ్మడి నర్సయ్య. నిజాయితీ, నిరాడంబరత ఆయన సిద్ధాంతం. సైకిల్ ఆయన వాహనం.

ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య.. మొదటినుండి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేవారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన.. ఎమ్మెల్యేగా ఎదిగి, ఆదర్శ నాయకుడిగా పేరుపొందారు.

సిపిఐ(ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే 'గుమ్మడి నర్సయ్య' కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుండి 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు నర్సయ్య. అనంతరం 1985, 89, 99, 2004 లో కూడా గెలుపొంది.. ఆ నియోజకవర్గం నుండి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే.. తమని తాము దేవుళ్ళలా ఊహించుకుంటారు కొందరు రాజకీయ నాయకులు. అలాంటిది, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ప్రజల్లోనే ఉంటూ ఓ సామాన్యుడిలా జీవిస్తున్నారు నర్సయ్య.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. బస్సు లేదా ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి.. పార్టీ ఆఫీసులో విశ్రాంతి తీసుకొని, ఆటోలోనో లేదా సైకిల్ మీదనో అసెంబ్లీకి వెళ్ళేవారు. ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే విరాళంగా ఇచ్చేవారు.

ఒకట్రెండు సార్లు ఎమ్మెల్యేగా చేస్తేనే.. వందల కోట్ల ఆస్తులు పోగేసేవాళ్ళని చూస్తుంటాం. అలాంటిది, నర్సయ్యకు కొద్దిపాటి పొలం తప్ప ఆస్తులు లేవు. ఇప్పటికీ ఒక్క చిన్న ఇంట్లో సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిలా జీవిస్తున్నారు.

రైతులు, గిరిజనులు, శ్రామికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన గుమ్మడి నర్సయ్య.. ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా లక్షలాది హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.