English | Telugu

గౌతమీపుత్ర శాతకర్ణి కోసం భారీ సెట్..?

బాలకృష్ణ తన వందో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఎక్కడా రాజీపడట్లేదు మూవీ టీం. సగంపైగా షూటింగ్, కీలక సన్నివేశాలను మొరాకోలో తెరకెక్కిస్తామని దర్శకుడు క్రిష్ ఇప్పటికే ప్రకటించేశాడు. ఆ తర్వాత మరిన్ని కీలక సన్నివేశాల్ని హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో తెరకెక్కిస్తామని మూవీ యూనిట్ చెబుతున్నారు. మొరాకో వెళ్లే లోపే క్రిష్ ఈ సెట్ పనుల్ని పూర్తి చేయించాలని చూస్తున్నారట. ఫారిన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత, సినిమాలోని కీలక సన్నివేశాల్ని ఈ సెట్లో జరుపుతారని సమాచారం. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు ఐదారు కోట్ల వరకూ ఖర్చుపెడుతున్నారని సినీ వర్గాలంటున్నాయి. తెలుగువారి చరిత్ర అని మొదటి రోజునుంచే ప్రచారం చేయడంతో, ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించాలని బాలయ్య ముందునుంచీ మూవీ యూనిట్ కు చెబుతూ వస్తున్నారు. కాగా లెజండ్ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీప్రసాద్, ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా, తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి డైరెక్టర్ క్రిష్ శాతకర్ణిని నిర్మిస్తున్నారు. 2017 సంక్రాంతి రోజున రిలీజ్ కాబోతున్న శాతకర్ణి, బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా గా తెరకెక్కడం విశేషం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.