Home » Articles » దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి


 

దీపావళి పండుగ అంటే దీపోత్సవం. ఈ రోజున ప్రతి ఇల్లు, వీధి, దేవాలయం దీపాలతో కళకళలాడుతూ ఉంటుంది. నిజానికి ఇది ఐదు రోజుల పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాటినుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది.
-  ఆశ్వయుజ బహుళ త్రయోదశి    -  ధన త్రయోదశి (మనం చెప్పుకున్నాం)
-  ఆశ్వయుజ బహుళ చతుర్దశి      -  నరక చతుర్దశి (ఇదీ చెప్పుకున్నాం)
-  ఆశ్వయుజ అమావాస్య            -  దీపావళి
-  కార్తీక శుద్ధ పాడ్యమి               -  గోవర్థన పూజ
-  కార్తీక శుద్ధ విదియ                -  భగినీ హస్తభోజనం
ఈ ఐదు పండుగలు కలిసి జరుపుకుంటేనే దీపావళి పండుగను పూర్తిగా జరుపుకున్నట్టు.
ఉత్తర భారతదేశంలో ఈ ఐదు పండుగలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో  నరక చతుర్దశి, దీపావళి, భగినీ హస్తభోజనం పండుగలను జరుపుకుంటారు.                   
-  అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో ఈ పండుగను ‘జగద్ధాత్రి పూజ’గా జరుపుకుంటారు.
    బెంగాల్ రాష్ట్రంలో ఈ రోజున ‘కలిపూజ’ను ఎంతో వైభవంగా జరుపుతారు.
-  ఒరిస్సా రాష్ట్రంలో ఈ పండుగను  ‘కుమార పూర్ణిమ’గా కృష్ణ త్రయోదశి నాడు             ప్రారంభించి దీపావళి వరకూ దీపోత్సవాలతో, ఆటపాటలతో జరుపుకుంటారు.
-  తమిళనాడులో దీపావళిని ఉదయయమే జరుపుకుంటారు.
-  కర్నాటక రాష్ట్రంలో మొదటి మూడు రోజులు  దీపావళి పండుగను జరుపుకుంటారు.
-  రాజస్థాన్ రాష్ట్రంలో ఈ పండుగను ‘ధన్ తెరాన్’గా జరుపుకుంటారు. ఈ పండుగ           రోజున స్త్రీలు తమ నగలను నదిలో కడుగుతారు. స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా భావించి        పూజిస్తారు. అన్ని రకాల వంటలూ పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు.


More...