సింగపూర్ నగరంలోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో చాంగి బీచ్ లో ప్రవాసాంధ్రులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదనం ఉట్టి పడేలా సంప్రదాయమైన వస్త్రధారణతో మహితలు బతుకమ్మ కొలిచారు. భక్తి గీతాలు ఆలపించారు. సుమారు రెండు వందల మంది ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజ కార్య వర్గ సభ్యులు రవికుమార్ రంగా, విజ్జేందర్ ముద్దం, అనిత చాడ, విజయ వుట్ట, సతీష్ శివనాధుని, సురేష్ కుమార్ ఆకునూరి, బోయపాటి శ్రీధర్, దుర్గ ప్రసాద్ తెసాని. తేజశ్రీ, సేగు సురేఖ భాస్కర్ చౌదరి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమవడానికి తమ వంతు సహకారాన్ని అందించారు.