LATEST NEWS
ప్రపంచ ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్, డ్రగ్స్ వ్యాపారి, క్రిమినల్ ఎస్కోబార్ గురించి తెలియకపోవడం పెద్ద తప్పేమీ కాదు. ఈ ప్రపంచంలోని అందరు వ్యక్తులూ అందరికీ తెలియాలని రూలేమీ లేదు. విజయవాడలో హోటల్ నడుపుకునే వ్యక్తిని ‘నీకు పాబ్లో ఎస్కోబార్ తెలుసా?’ అని అడిగితే అతను తెలియదని అనడం తప్పేమీ కాదు. మన్యంలో కూలీపని చేసుకునే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితే, అతను ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే తప్పు కానే కాదు. సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అక్కనో, చెల్లినో ఈ ప్రశ్న అడిగితే ఆమె ‘తెలియదు’ అని సమాధానం చెబితే అది తప్పు కానే కాదు. అంతెందుకు? రీసెంట్‌గా బీటెక్ పాసై, భారీ జీతానికి సాఫ్ట్.వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్‌ కూడా ఈ ప్రశ్నకు ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే, అదీ తప్పు కాదు. కానీ, మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే  మాత్రం క్షమించరాని తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించినప్పుడు జగన్ని అంతర్జాతీయంగా చెడ్డ పేరు వున్న డ్రగ్స్ వ్యాపారి, హంతకుడు, క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. అంతే, ఈ పాయింట్‌ని నేషనల్ మీడియా అందుకుంది. జగన్‌ని చంద్రబాబు నాయుడు ఎస్కోబార్‌తో పోల్చారని, జగన్ ఈజ్ ఆంధ్రా ఎస్కోబార్ అని భారీ స్థాయిలో కథనాలు ప్రసారం చేసింది. జగన్‌కి ఇవన్నీ ఆయన భజనపరులు చెప్పరో, చెప్పినా తెలియనట్టు నటిస్తారో గానీ, జర్నలిస్టులు జగన్ దగ్గర ఎస్కోబార్ ప్రస్తావన తెచ్చినప్పుడు జగన్ పాబ్లో ఎస్కోబార్ పేరుని పలకడానికే తికమకపడిపోయినట్లు, ఆ పేరు జీవితంలో ఏనాడూ విననట్టు వ్యవహరించాడు. జగన్ ఈ విషయంలో తన అమోఘమైన నటన ప్రదర్శించాడని అనుకోవడం లేదు. ఎందుకంటే, ఈ మొహానికి నిజంగానే ఎస్కోబార్ ఎవరో తెలిసి వుండదు. తండ్రి, తాత సంపాదించిన డబ్బు, తండ్రి పేరుని అడ్డు పెట్టుకుని తాను తాను సంపాదించిన డబ్బు, వెంట వుండే క్రిమినల్ బ్యాచ్, చెప్పినట్టు చేసే రాయలసీమ గ్యాంగ్‌లు.. వీటి సహాయంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప, అయ్యగారికి చదువు లేదు, సంస్కారం లేదు, పరిజ్ఞానం లేదు, విచక్షణా జ్ఞానం అంతకన్నా లేదు. అందినచోటల్లా అప్పు చేయడం, బటన్లు నొక్కడం తప్ప ఏమీ తెలియదు. ఐదేళ్ళ పదవీ కాలంలో అప్పులు చేయడం తప్ప, సొంతగా ప్లాన్ చేసి రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే, మన జగనయ్య.  ఇలాంటి వ్యక్తికి శరీరంలో సిగ్గు ఎంతమాత్రం లేకపోవడం బాగా కలిసొచ్చిన అంశం. ఎవరు ఏమైనా అనుకోనీ, నా బిహేవియర్ నాదే, నా అబద్ధాలు నావే, నా అహంకారం నాదే, నా అజ్ఞానం నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇలాంటి మనిషినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా భరించింది అని మనమీద మనకే జాలి కలుగుతోంది. 
సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోడీ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఎన్నికల ముందు అయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని ఆర్ఎస్ఎస్ పెద్దలే అన్నారు. ప్రధానిగా మోడీకి ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చూసుకోవాలన్న బలమైన సంకేతాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పంపింది.  ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచీ, అంటే 2019 ఎన్నికలలో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించిన నాటి నుంచీ... కమలం పార్టీలో ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండాలన్న లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభమైంది. ఆ క్రమంలో మిత్రపక్షాలలో సైతం చీలికలను ప్రోత్సహించింది. ఈ క్రమంలో పార్టీకి రాజకీయ మెంటార్ అయిన బీజేపీని ఖాతరు చేయడం మానేసింది. ఇందుకు కారణం.. పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాని మోడీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మధ్య అగాధం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. పర్యవశానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు దిగిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని తీరు మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరెస్సెస్‌ విమర్శలు గుప్పించారు.   బీజేపీ ఒక స్వతంత్రమైన పార్టీ అనీ, దాని వ్యవహారాలను అది నిర్వహించుకోగలదని నడ్డా వ్యాఖ్యానించడం జరిగింది. అదంతా పక్కన పెడితే.. 2024 ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తగిలింది. గత రెండు ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను గెలుచుకోవడంలో విఫలమైంది. దీంతో అనివార్యంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు, దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోలా ఏకపక్ష నిర్ణాయాలు తీసుకునే సావకాశం కానీ అవకాశం కానీ మోడీకి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం పార్టీపైనా, ప్రభుత్వంపైనా తిరుగులేని ఆధిపత్యం వహించిన మోడీకి ఇప్పుడు ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాగస్వామ్య పక్షాల డిమాండ్లకు తలొగ్గక తప్పని సరి కావడమే కాకుండా, ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ లేకుండా చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అండ లేకుండా పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు పొందడం సాధ్యం కాదు. అదీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ లేని స్థితిలో  అలాంటి మద్దతు లభించడం దాదాపు అసంభవం. ఎందుకంటే బీజేపీలో అత్యధికులు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవారే. అందుకే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ అనివార్యంగా ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నాలు ఆరంభించారు. అందులో భాగమే  ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వోద్యోగులు పాల్గనకుండా ఉన్న నిషేధాన్నితొలగించడం.  గత ఐదు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడం కోసం మోడీ గత పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చేయలేదు.   ఇప్పుడు హడావుడిగా నిషేధాన్ని ఎత్తివేయడంతో సర్వత్రా మోడీ ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను  చాటు కోవడం కోసమేనని అంటున్నారు. ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ 1966, 1970, 1980 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    ఆ నిషేధాన్ని  జూలై 9న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  ప్రభుత్వ వ్యవహారాల నుంచి రాజకీయ వ్యవహారాలను దూరంగా ఉంచాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగు లను పార్టీలు, పార్టీల అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది. ఇప్పుడు మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిషేధాన్ని తొలగించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించి. కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తెలంగాణ రాజధాని వాసులపై బాంబు పడ్డంత పనైంది.  హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది. 'నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.' అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి. కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.  ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.
జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించి అసంపూర్తిగా మధ్యలో వదిలేసింది. ఇలా మధ్యలో ఆగిపోయిన తరగతి గది లింటెల్, దాని మీద వున్న గోడ కూలి నెల్లూరు భక్తవత్సల నగర్‌ కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో గురుమహేంద్ర అనే విద్యార్థి మరణించాడు. ఈ పాఠశాలలో 12 గదులను నిర్మించాలని పనులు ప్రారంభించారు. కానీ, ఆ పనులన్నీ రెండేళ్ళ క్రితం ఆగిపోయాయి. ప్రమాదకరంగా వున్న ఈ గదుల్లో విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. ఊహించని విధంగా లెంటెల్, గోడ కూలిపోవడంతో గురుమహేంద్ర మరణించాడు. భవిష్యత్తు మీద ఎన్నో కలలతో చదువుకుంటున్న తమ కుమారుడు మరణించడంతో గురుమహేంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భవనాలు ప్రమాదకరంగా వున్నాయని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.  విద్యార్థి మరణానికి దారితీసిన నిర్మాణంలో వున్న తరగతి గదులు, మొండి గోడలను డీఈఓ పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను కలెక్టర్, పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు వివరించారు. దుర్ఘటన మీద స్పందించిన కలెక్టర్ విద్యార్థి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సంఘటన మీద మంత్రి నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. విద్యార్థి తల్లిదండ్రులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను మరో సారి తిరస్కరించింది. ఈ నెలాఖరు వరకూ ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు కూడా బెయిలు దక్కని సంగతి తెలిసిందే.  కవిత దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అంతకు ముందు సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కవితను శుక్రవారం (జులై 26) కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.  కోర్టు ఆదేశాల మేరకు కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.  వాదనల అనంతరం కోర్టు ముగ్గురికీ కూడా బెయిలు నిరాకరించింది. ఇక సీబీఐ కేసుకు సంబంధించి కవిత బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం (జులై 24) నిరాకరించిన సంగతి విదితమే.  ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కస్టడీని కోర్టు ఆగస్టు 8 వరకూ వాయిదా వేసింది.  దీనిని బట్టి కవిత మరో రెండు వారాల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.  కవిత అరెస్టై నాలుగు నెలలు దాటిపోయింది. ఆమె  మార్చి 15న  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి విదితమే. 
ALSO ON TELUGUONE N E W S
‘హనుమాన్‌’ సాధించిన ఘనవిజయంతో ప్రశాంత్‌వర్మ టాప్‌ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. అంతకుముందు చేసిన సినిమాలు అతనికి ఆశించిన గుర్తింపు తీసుకురాలేదు. ఒక్క సినిమా అతని కెరీర్‌ని టర్న్‌ చేసేసింది. ఇప్పుడు ప్రశాంత్‌ ఓ కొత్త సెటప్‌ చేయబోతున్నాడు. 20 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని తన ఆఫీస్‌గా కన్వర్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంతకుముందు అతనికి ఓ ఆఫీస్‌ ఉంది. అందులోనే తన సినిమాలకు సంబంధించిన పనులన్నీ జరిగేవి. ‘హనుమాన్‌’ విడుదలైన తర్వాత 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన 100 మందిని రిక్రూట్‌ చేసుకుంటానని ఆ మధ్య ప్రకటించాడు ప్రశాంత్‌.  సినిమా ఆఫీస్‌ కోసం అంత పెద్ద బిల్డింగ్‌ ఎందుకు అనే డౌట్‌ అందరికీ వస్తుంది.  అంతేకాదు, వందమందికి తన ఆఫీస్‌లో జాబ్‌ కల్పిస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అసలు అక్కడ ఏం చెయ్యబోతున్నారనేది ఆరా తీస్తే.. సిజి వర్క్‌, డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌తోపాటు 24 క్రాఫ్ట్స్‌లోని ఎక్కువ భాగం టెక్నీషియన్లు తన దగ్గరే ఉండి సినిమాకి సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేందుకు ప్లాన్‌ చేశాడు ప్రశాంత్‌. ఇక అతను చేసే సినిమాల విషయానికి వస్తే ‘జై హనుమాన్‌’ పూర్తి చెయ్యాల్సిన బాధ్యత ఉండనే ఉంది. అలాగే నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించే సినిమాను డైరెక్ట్‌ చెయ్యాలి. వీటితోపాటు తన దగ్గర ఉన్న ఐడియాలను డెవలప్‌ చేసి స్క్రిప్ట్‌లుగా మార్చే ప్రక్రియ ఈ ఆఫీసులోనే జరుగుతుందని తెలుస్తోంది. 
మెగాస్టార్  చిరంజీవి(chiranjeevi)ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు. ఏం సాధించారు అని చెప్పడం స్టార్ట్ చేస్తే ఒక్కసారిగా అందరు నోరెళ్లెబెట్టి చెప్పే వాళ్ళ వైపే చూస్తుంటారు. పైగా చెప్పడం  పూర్తి అయిన తర్వాత ఇవన్నీ మాకు చిన్నప్పుడే తెలుసు  ఎక్స్ క్లూజివ్ గా  ఏమైనా ఉంటే  చెప్పమని అంటారు.  కాబట్టి  చిరు  ఎక్స్ క్లూజివ్ వార్త లేటు లేకుండా చూద్దాం. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్రీడల మహోత్సవం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఆరంభ వేడుకలకి చిరంజీవి ఆయన శ్రీమతి సురేఖ, రామ్ చరణ్(ram charan)ఉపాసన(upasana)క్లీంకార(klin kaara)పాల్గొన్నారనే విషయం అందరకి తెలిసిందే. లేటెస్ట్ గా  తన  ఎక్స్  వేదికగా సురేఖ తో కలిసి దిగిన ఒక ఫోటోని చిరు షేర్ చేసాడు. ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న చోట చిరు తన  చేతిలో ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని  పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు కూడా చేసాడు. ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా సురేఖ తో కలిసి ఒలింపిక్ టార్చ్ ప్రతి రూపాన్ని పట్టుకోవడం కూడా చాలా సంతోషకరమైన క్షణం. అదే విధంగా పోటీలో పాల్గొంటున్న మన దేశ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం తో పాటు పతకాలు తీసుకురావాలని కూడా అభిలషించారు. ఇక చిరు ట్వీట్ చూసిన అభిమానులతో పాటు సాధారణ ప్రజానీకం మొత్తం ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఇండియా ఏ క్రీడలో పతకం గెలిచినా కూడా చిరు వాళ్ళని తన ఇంటికి పిలిచి సన్మానించడం గ్యారంటీ అని అంటున్నారు.  ఇక  సినిమాల విషయానికి వస్తే  ప్రస్తుతం విశ్వంభర లో చేస్తున్నాడు. నెక్స్ట్ జనవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.   
అనసూయ గతంలో టీవీ షోలతో బిజీగా ఉండేది. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది. అయినా సోషల్‌ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తన పర్సనల్‌ విషయాలను కూడా వారితో షేర్‌ చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు వివాదాలు చోటు చేసుకున్నా వాటిని కూడా క్లారిఫై చేస్తుంటుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన పట్ల అనసూయ తన బాధను వ్యక్తం చేసింది. అదేమిటంటే.. ఒక అభిమాని తనను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు వచ్చాడట. కానీ, అది కుదరక వెళ్లిపోయాడట. దాంతో ఆ అభిమానిని ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేసింది అనసూయ. అదేమిటో తెలుసుకుందాం.  అనసూయ ఈమధ్యకాలంలో సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. అందులో ‘సింబా’ చిత్రం విడుదలకు వచ్చింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఆ  ఈవెంట్‌లో అనసూయ పాల్గొంది. అందులో భాగంగానే మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇదిలా ఉంటే.. ఓ అభిమాని తనకు పెట్టిన ట్వీట్‌పై స్పందించింది. అనసూయను సింబా ఈవెంట్‌కి వచ్చినపుడు ఆ అభిమాని చూశాడట. ఆమెను చూడడం అది రెండోసారట. చూశాను. అంతేచాలు అని ట్వీట్‌ చేశాడు. దానికి అనసూయ స్పందిస్తూ అయ్యో మరి నన్ను కలవొచ్చు కదా అని అడిగింది. ట్రై చేశాను. కానీ, కుదరలేదు. లంచ్‌ టైమ్‌ దాటిపోతున్నా ఓపికగా మీరు మీడియాలో మాట్లాడడం చూశాను. లైవ్‌లో మిమ్మల్ని చూశాను. చాలు అనుకున్నాను అంటూ అతను సమాధానమిచ్చాడు. దానికి మరోసారి స్పందిస్తూ ‘ఈసారి వస్తే మాత్రం దయచేసి నన్ను కలవండి. అనుక్షణం నాతో ఒక ఆర్మీలా ఉంటూ నన్ను రక్షిస్తున్న మీలాంటి అభిమానుల్ని కలుసుకోలేకపోతే నాకు అదృష్టం లేనట్టే. అందుకే ఈసారి వచ్చినపుడు మాత్రం తప్పకుండా కలవండి’ అంటూ ఆ అభిమానిని రిక్వెస్ట్‌ చేసింది అనసూయ.   
సినీ సెలబ్రిటీస్,రాజకీయ నాయకులు ఎప్పుడు కలిసినా కూడా ఏదో  తెలియని వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరిలో  కలుగుతుంది. అలా కలగడానికి ప్రత్యేక కారణాలు కూడా అక్కర్లేదు. ఆ ఇద్దరి డిజిగ్నేషన్స్ కి సొసైటీ లో ఉన్న క్రేజ్ అది. తాజాగా పవన్ కళ్యాణ్(pawan kalyan)మాజీ వైఫ్ రేణు దేశాయ్(renu desai)తెలంగాణ మంత్రి  కొండా సురేఖ(konda surekha)కలిశారు. అసలు వీళ్ళద్దరు కలవడానికి రీజన్ ఏంటి! ఏం జరిగిందో చూద్దాం. వరంగల్ ఏంఎల్ ఏ అయిన  కొండా సురేఖ ప్రస్తుతం  దేవాదాయ ధర్మశాఖ తో పాటు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కి రేణు దేశాయ్  చీఫ్ అడ్వైజర్ గా ఉంది.  ఈ నేపథ్యంలోనే  సురేఖ ని ఆమె నివాసంలో కలిశారు. వన్నె ప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి విషయాలపై చర్చించారు. అన్ని విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లి చర్చించాలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా నెలకొల్పిన గీత యూనివర్సిటీ కి సంబంధించిన విషయాల గురించి కూడా రేణు దగ్గర్నుంచి  సురేఖ గారు అడిగి తెలుసుకుంది. అదే విధంగా రేణు విషయాన్నీ  సురేఖ గారు ఎక్స్ వేదికగా కూడా  వెల్లడి చేసారు ఇక ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో రేణు దేశాయ్ మరి ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లి పవన్ ని కలుస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు.  ఎందుకంటే పవన్  ఇప్పుడు పంచాయితీ రాజ్ తో పాటు అటవీ అండ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు. పవన్ ని కలిసి ప్రకృతి గురించి మాట్లాడాలి కదా అని అంటున్నారు.  
గ్రూప్‌ డాన్సర్‌ నుంచి కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత హీరోగా, డైరెక్టర్‌గా ఎదిగిన రాఘవ లారెన్స్‌ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హారర్‌ సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన లారెన్స్‌కి దర్శకుడుగా మొదటి అవకాశం ఇచ్చింది కింగ్‌ నాగార్జున. ఒకప్పుడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను పరిచయం చేస్తూ ‘శివ’ చిత్రాన్ని తమ సొంత బేనర్‌లోనే నిర్మించారు. ఆ తర్వాత రాఘవ లారెన్స్‌ను ‘మాస్‌’ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం చేశారు. ఈ సినిమాను కూడా తన సొంత బేనర్‌లోనే నాగార్జున నిర్మించారు. ఈ సినిమా లారెన్స్‌కి డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ‘స్టైల్‌’ అనే డాన్స్‌ బేస్డ్‌ మూవీ చేశారు లారెన్స్‌. అది కూడా సూపర్‌హిట్‌ అవ్వడంతో దర్శకుడిగానే కాదు, హీరోగా కూడా నటిస్తూ ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చారు. డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమాలతో మంచి ఊపు మీదున్న ప్రభాస్‌ తన నెక్స్‌ట్‌ మూవీ కోసం ‘కాంచన’ వంటి బ్లాక్‌బస్టర్‌ని డైరెక్ట్‌ చేసిన లారెన్స్‌ అయితే పర్‌ఫెక్ట్‌ అనుకున్నాడు. కానీ, ప్రభాస్‌తో లారెన్స్‌ చేసిన ‘రెబల్‌’ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.  దీంతో డైరెక్టర్‌గా మూడు సంవత్సరాలు విరామం తీసుకున్నాడు లారెన్స్‌. డైరెక్టర్‌గా తనకెంతో పేరు తెచ్చిన ‘కాంచన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కాంచన2’ చేశాడు. ఆ సినిమా తెలుగులో ‘గంగ’ పేరుతో రిలీజ్‌ అయింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ‘కాంచన3’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కాంచన చిత్రాన్ని హిందీలో ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్‌ చేశాడు. ఇది కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో డైరెక్టర్‌గా లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు లారెన్స్‌. నాలుగు సంవత్సరాలుగా అలాంటి ప్రయత్నాలు ఏమీ చేస్తున్నట్టు కనిపించలేదు. అయితే తాజాగా ఓ వార్త మాత్రం వినిపిస్తోంది. అదేమిటంటే.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత డైరెక్ట్‌గా తెలుగులో ఓ సినిమా డైరెక్ట్‌ చేయబోతున్నాడట లారెన్స్‌.  ఆ సినిమాకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శర్వానంద్‌ హీరోగా ‘శ్రీకారం’ చిత్రాన్ని రూపొందించిన బి.కిశోర్‌రెడ్డి ఓ కథను రెడీ చేశాడట. ఆ కథను లారెన్స్‌కి చెప్పారు. లారెన్స్‌కి కథ నచ్చిందట. ఆ కథతోనే మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చేయబోతున్నాడు లారెన్స్‌. హాస్య మూవీస్‌ బేనర్‌పై రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఇది ఏ జోనర్‌ సినిమా, హీరోగా లారెన్సే నటిస్తాడా.. లేక మరో హీరోతో వెళతాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. 
జాన్ విజయ్(john vijay)చిరంజీవి(chiranjeevi)వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ(balakrishna)భగవంత్ కేసరి, ప్రభాస్(prabhas)సలార్, రామ్ పోతినేని(ram potineni)స్కంద లతో తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుల్లో ఒకడిగా మారాడు. 2006  లో  శరత్ కుమార్, నయనతార జంటగా తమిళంలో తెరకెక్కిన  తలై మగన్ తో  సినీ రంగ ప్రవేశం చేసిన ఈ తమిళ నటుడు  తాజాగా లైంగిక ఆరోపణలని ఎదుర్కొంటున్నాడు. చిన్మయి శ్రీపాద(chinmayi sripaada)అమృత దారని  కురిపించే ఎన్నో పాటలు ఆమె నోటి నుంచి జాలు వారాయి. కొన్ని వందల పాటలు పాడింది. ప్రముఖ నటి సమంతకి తన గొంతుని అరువుగా ఇచ్చి సమంత నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి కూడా  దోహపడింది. ఇప్పుడు  జాన్ విజయ్ మీద లైంగిక ఆరోపణలు చేస్తుంది. కొంత మంది  మహిళలను జాన్  లైంగికంగా వేధించాడంటూ  సోషల్ మీడియాలో వరుసగా  పోస్టులు పెడుతుంది. కొన్ని రోజులు క్రితం  ఇంటర్వ్యూకు వెళ్లిన ఒక  మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడని,గతంలోను  చాలా మంది  మహిళలతో ఇలాగే  వ్యవహరించాడని పలు స్క్రీన్ షాట్స్ ని కూడా పోస్ట్  చేసింది. ఇప్పుడు ఈ విషయం తమిళ ఇండస్ట్రీ తో పాటు  ఇండియన్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. రావణన్, సమర్, డేవిడ్, నీరం, కబాలి, వీర శివాజీ, సాగసం, పట్టతు యానై, తిరుడాన్ పోలీస్, కో 2 నంబియార్, భూమి.కొలై, పార్టనర్, సోలో, కామ్రేడ్ ఇన్ అమెరికా, లూసిఫర్, బిగ్ బ్రదర్, గజ కేసరి,డేవిడ్, ఇలా తమిళ తెలుగు హిందీ కన్నడ భాషలో ఇప్పటివరకు 70 కి పైగా సినిమాలు చేసాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి.   
 ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరో అనే ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)ఒన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజ్ విషయంలో  కూడా ఇదే  పరిస్థితి నెలకొని ఉంది. ఏ నిమిషానికి ఏ కొత్త డేట్ వస్తుందో అర్ధం కాకుండా పోయింది. రీసెంట్ గా పుష్ప 2  రిలీజ్ విషయంలో కొన్ని  రూమర్స్  షికారు చేస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 హిట్ కావడంతో పుష్ప 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని కుదిరి ఉంటే ఈ పాటికి ట్రైలర్ రిలీజ్ అయ్యి అగస్ట్ 15 ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ తో పాటు  ప్రేక్షకులు  వేయికళ్లతో ఎదురుచూస్తుండే వాళ్ళు.  షూటింగ్ ప్రారంభం అయిన రోజునే  అగస్ట్ 15  డేట్ అనౌన్స్  అయ్యింది. బన్నీకి దర్శకుడు సుకుమార్ కి ఉన్న బాండింగ్ దృష్ట్యా అగస్ట్ 15 లాండింగ్ పక్కా అని అనుకున్నారు. కానీ  డిసెంబర్ 6 కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ డేట్ కూడా మారబోతుందనే రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.  వచ్చే ఏడాది వేసవికి పుష్ప  షిఫ్ట్  అయ్యాడని  ఈ మేరకు  త్వరలోనే  అధికార ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో పూర్తి   క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే.  ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఆ లుక్ చూసిన వాళ్లకి క్లియర్ గా అర్ధమవుతుంది. అది పుష్ప లుక్ కాదని. దీంతో పుష్ప దర్శకుడు  సుకుమార్ కి, బన్నీ కి మధ్య మనస్పర్థలు వచ్చాయని దీంతో షూటింగ్ వాయిదాపడిందనే వార్తలు వచ్చాయి.ఇంకో అడుగు ముందుకేసి  సుకుమార్(sukumar)అలిగి ఫారెన్ వెళ్లాడనే వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే షూటింగ్ జరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. షూటింగ్ అప్ డేట్ మాత్రం కొన్ని రోజుల నుంచి రావడం లేదు. రెండు సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అవి రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా బన్నీ సరసన రష్మిక జోడీకడుతుంది.ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.  
హీరోగా నటిస్తూనే తమ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తుంటారు విశాల్‌. హీరోగా, నిర్మాతగానే కాదు తమిళ చిత్ర పరిశ్రమలో పలు సమస్యలపై పోరాటం కూడా చేశారు. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. అయితే కొన్ని ఆరోపణలు కూడా అతనిపై వచ్చాయి. దానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. విశాల్‌తో సినిమాలు చేయకూడదని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎక్స్‌ వేదికగా విశాల్‌ స్పందించారు.  ‘నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. నన్నెవరూ ఆపలేరు. మీ పని మీరు చేసుకోండి’ అంటూ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కి కౌంటర్‌ ఇచ్చారు విశాల్‌. ఒకవేళ తనను ఆపాలని ప్రయత్నిస్తే అలా చేసిన వారు ఎప్పటికీ సినిమాలు నిర్మించలేరన్నారు. తను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమం కోసం నిధులు వినియోగించానని గుర్తు చేశారు. అంతేకాదు, వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యబీమా కల్పించానన్నారు. ఈ నిర్ణయాలన్నీ తానొక్కడినే తీసుకోలేదని, మిగతా సభ్యులతో కలిసి చేసినవేనని తెలిపారు. ప్రస్తుత కౌన్సిల్‌పై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చేస్తే సరిపోతుందని అన్నారు. తనకు సినిమాలు చేయకపోతే సొంతంగా తీసుకునే కెపాసిటీ తనకు ఉందని అందరికీ తెలుసునని గుర్తు చేశారు. తనను సినిమాలు చేయకుండా ఆపాలన్న ప్రయత్నం చేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని కౌన్సిల్‌కు సలహా ఇచ్చారు విశాల్‌. 
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ ఘడియలు దగ్గరకి రాగానే పెళ్ళికి సంబంధించిన బట్టలు పలానా చోట కొనాలని ఫిక్స్ అవుతాం. ప్రస్తుత బిజీ లైఫ్ లో ఇంకాస్త ముందే ఫిక్స్  అయ్యే పరిస్థితి. రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)కి కూడా ఆ శుభ ముహూర్తం దగ్గర పడిందనుకుంటా! పెళ్లి బట్టలు  టాపిక్ ప్రభాస్ ఇంటి చుట్టు తిరుగుతుంది. రీసెంట్ గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రముఖ సారీస్ స్టోర్ ఓపెన్ అయ్యింది. పేరు  ఈ జరివరం.  నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(shyamala devi)స్టోర్ ని సందర్శించారు.  స్టోర్ మొత్తం పరిశీలించి  అక్కడున్న కంచి పట్టు చీరలని గుర్తించి  పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది.నాకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టం.కృష్ణం రాజు(krishnam raju) గారు కూడా నాకు కొన్న  మొట్టమొదటి  చీర  కంచి పట్టు చీరనే.అలాగే  ప్రభాస్ పెళ్లికి ఈ జరివరం నుంచే బట్టలు కొంటామని చెప్పింది.  దీంతో ఇప్పుడు  ఈ మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి. అదే విధంగా రీసెంట్ గా వినిపిస్తున్న ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమే  అయ్యుంటుందని, ప్రభాస్ పెళ్లి ముహూర్తం దగ్గరలో ఉంది కాబట్టే ఆ మాట చెప్పిందని అంటున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే  ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటినుంచో తమ డార్లింగ్  ఒక ఇంటి వాడు కావాలని ఆశపడుతున్నారు. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు  అసూయపడుతున్నారు.  ఈ  జరివరం స్టోర్ ని ప్రముఖ హీరో, నటుడు అయిన కృష్ణుడు భార్య స్థాపించింది. వినాయకుడు తో కృష్ణుడు ఎంత గుర్తింపు పొందాడో  అందరకి తెలిసిందే. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలే పోషించాడు.ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి బట్టల వార్తలతో  కృష్ణుడు స్టోర్ కి  ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.  
ఏ మాటకా మాట చెప్పుకోవాలి.. పూరి జగన్నాధ్(puri jagannadh) ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram potineni) లు ఇరగదీసారంతే.తమ అప్ కమింగ్ మూవీ డబుల్ ఇస్మార్ట్ తో ఇరగదీసారంతే. ఇదేంటి మూవీ ఇంకా రాలేదు కదా! ఒక వేళ గతంలో సంచలన విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ గురించి చెప్పబోయి డబుల్ ఇస్మార్ట్ అని చెప్తున్నారేమో  అని అనుకోకండి. నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నేను చెప్పేది  డబుల్ ఇస్మార్ట్  గురించే. రామ్, అండ్ పూరి ల డబుల్ ఇస్మార్ట్(double ismart) అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ రికార్డు బిజినెస్ తో తన హవా చాటుతుంది. ఇప్పుడు ఈ మ్యాటర్  టాక్ అఫ్ ది ఇండస్ట్రీ కూడా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు . రామ్ అండ్ పూరి ల గత మూవీలు వారియర్, స్కంద, లైగర్ లు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టరీ గా నిలిచాయి.  లైగర్ నష్టం తాలూకు పంచాయితీ అయితే ఇప్పటికి నడుస్తూనే ఉంది. ఇలా గత చిత్రాలు  ప్లాప్ గా నిలిస్తే సాధారణంగా అప్ కమింగ్ మూవీస్ బిజినెస్ కొంచం డల్ గా ఉంటుంది.ఇది సినీ ఆనవాయితీ కూడా.  కానీ  డబుల్ ఇస్మార్ట్ ఆ ఆనవాయితీకి చెక్ పెట్టి భారీ బిజినెస్ ని సొంతం చేసుకుంది.  వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ 60 కోట్లకి జరగగా ఆడియో రైట్స్ 9 కోట్లు, సౌత్ ఇండియా డిజిటల్ రైట్స్ 33 కోట్లు,అదే విధంగా తెలుగు హిందీ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి  50 కోట్ల కి అమ్ముడయ్యింది. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా చేస్తుండగా సంజయ్ దత్, షాయాజీ షిండే, బని జె, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల వచ్చిన  మార్ ముంత చోడ్ చింత సాంగ్ సినిమా మీద ఉన్న అంచనాలని రెట్టింపు చేసింది. మరి పూరి, రామ్ లు ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. మణిశర్మ సంగీత దర్శకుడు కాగా పూరి ఛార్మి లు నిర్మాతలు.  తెలుగు తో పాటు తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.
వర్షాకాలం ఇంటి పరిసరాలు చాలా చిత్తడిగా ఉంటాయి.  ఇలాంటి ప్రాంతాలు దోమలు పెరగడానికి అనువుగా ఉంటాయి.  విపరీతమైన దోమల కారణంగా వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు,  మలేరియా,  చికెన్ గున్యా వంటి జ్వరాలు వస్తాయి.  అయితే ఇంటి పరిసరాలలో అసలు దోమలు ఉండకూడదంటే ఈ కింద చెప్పుకునే చిట్కాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి.  ఇలా చేస్తేనే ఈ వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తమను తాము మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. ఇంటి పరిసరాలలో ఉండే పూల కుండీలు,  బకెట్లు,  పాత టైర్లు వంటి వాటిలో వర్షం నీరు చేరుతూ ఉంటుంది.  ఇలాంటి వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. నీరు అలాగే నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. వర్షాకాలం పూర్తయ్యేలోపు ఈ దోమల ఉదృతి పెరుగుతుంది.  కాబట్టి ఇంటి పరిసరాలు పొడిగా, నీటితో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో  ఉన్న నీటి కాలువలు,  డ్రైనేజీ సిస్టం, నీరు నిల్వ చేసే సొంపు వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి.  వర్షం కారణంగా వీటిలో కాగితాలు, ప్లాస్టిక్ కవర్లు అడ్డు పడి నీరు నిలుస్తూ ఉంటుంది.  ఇవి కూడా దోమలకు ఆవాసాలుగా మారతాయి. నీటి కాలువలు, డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడూ నీరు పారుతూ ఉండేలా చూసుకోవాలి. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లినా,  ఇంటి చుట్టుప్రక్కల దోమల ఉదృతి ఎక్కువగా ఉన్నా దోమ కాటుకు గురి కాకుండా, చర్మాన్ని సంరక్షించగల లోషన్ లు, క్రీములు, స్ప్రే లు  ఉపయోగించాలి. ఇవే కాదు నిమ్మ, యూకలిప్టస్ నూనె వంటి సారాలతో కూడిన స్ప్రే లు దోమలను దరిదాపుల్లోకి రానివ్వవు. వీటిని వినియోగించాలి. ఇంట్లో నీలగిరి తైలం లేదా యూకలిప్టస్ నూనె, నిమ్మ,  టీట్రీ వంటి నూనెలను ఉపయోగించాలి. ఆయిల్ డిఫ్యూజర్ లను ఉపయోగించాలి.  ఇవి దోమలను ఇంట్లో నుండి తరిమికొట్టడంలో సహాయపడతాయి. పైపెచ్చు ఇల్లంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం సమయాల్లోనే దోమలు ఎక్కువగా వస్తుంటాయి.   ఈ సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ లు ఆన్ లో ఉంచాలి.  గాలి ఉదృతి కారణంగా దోమలు సరిగా ఎగరలేక ఇంట్లో నుండి వెళ్లిపోతాయి. ముఖ్యంగా పడకగదులలో ఫ్యాన్లు ఆన్ లో ఉంచితే పడుకునే సమయానికి దోమలు అక్కడి నుండి వెళ్లిపోతాయి. దోమల బెడద తప్పించుకోవడానికి ఇంట్లో వేప,  సాంబ్రాణి వంటి హానికరం కాని వాటితో ఇంట్లో ధూపం వెయ్యాలి.  ఇవి ఒకవైపు దోమలను తరిమికొట్టడంలోనూ, మరొకవైపు వాటి వాసన కారణంగా ఇంట్లో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడంలోనూ సహాయపడతాయి. ఇంటి బాల్కనీ,  ఇంటి ఆరుబయట ప్రాంతంలో సిట్రోనెల్లా,  లావెండర్,  బంతి పువ్వులు, నిమ్మగడ్డి వంటి మొక్కలను పెంచాలి.  ఈ మొక్కల సువాసన కారణంగా దోమలు ఆ దరిదాపుల్లో ఉండవు. ముఖ్యంగా ఇంటి తలుపులకు,  కిటికీలకు నెట్ కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి.  దీనివల్ల ఇంట్లోకి తాజా గాలి వస్తూనే దోమలు రాకుండా ఉంటాయి.                                         *రూపశ్రీ.
ఈకాలంలో అందరికి శరీరం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పుకోవాలి. ట్రెండింగ్ లో ఉన్న దేన్నీ వదలరు. తినే తిండి నుండి, తాగే ద్రవపదార్థాలు, సమయం, ప్లానింగ్, ఇంకా వ్యాయామాలు, జిమ్ లో కసరత్తులు ఇలా బోలెడు ఫాలో అవుతుంటారు. ఎంత బిజీ లైఫ్లో మునిగిపోయిన కనీసం వారానికి ఒకసారి అయినా ఔటింగ్ వెళ్లడం, స్నేహితులను కలవడం, ఎంజాయ్ చేయడం. ఇలాంటివన్నీ బోలెడు ఫాలో అవుతుంటారు.  ఇవన్నీ కూడా మనిషిని శారీరకంగానూ మరియు మానసికంగానూ దృఢంగా ఉంచేవే!! అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. ముఖ్యంగా బాచ్లర్స్ వీటిని ఫాలో అవ్వగలరు. వాళ్లకున్న ఫ్రీడమ్ అలాంటిదే మరి. కానీ పెళ్ళైనవాళ్ళు అన్నిటినీ ఫాలో అవ్వాలన్నా ఎన్నో కారణాలు కనిపిస్తుంటాయి. వాటిలో నిజానికి కుటుంబం మరియు కుటుంబంతో కలసిపోయిన బాండింగ్ మొదలైనవి చిన్న అడ్డంకులుగా కనిపిస్తాయి. కానీ వాటిని బయటకు చెప్పలేరు. అందుకే చాలామంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. అయితే లైఫ్ స్టైల్ లో కొన్ని మారినా అలవాట్లు మాత్రం మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇదిగో ఇలా చేస్తే కచ్చితంగా కొత్తగా మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది.  టైం ప్లానింగ్!! ఇది కేవలం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో గొప్పగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం నుండి రాత్రి పడుకునేవరకు  ప్రతిదీ ఒక సమయం ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అనుకున్న సమయానికి ఏది పూర్తవకుండా ఇబ్బంది పెడుతుంది. కానీ దాన్ని అట్లాగే వదిలెయ్యకూడదు. ఒక పని అనుకున్న సమయం కంటే ఓ అరగంట ఆలస్యం అయినా సరే దాన్ని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తూ ఉంటే దాన్ని ఆ అరగంట సమయం ఎక్స్ట్రా తీసుకోకుండా కరెక్ట్ టైమ్ కు పూర్తిచేసే రోజు తప్పకుండా వస్తుంది. అంటే ఇదొక సాధనలాగా జరిగే ప్రక్రియ. సమయ ప్రణాళిక అనుకోగానే మొదట్లోనే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోదు. అందువల్ల కరెక్ట్ గా సెట్ అవట్లేదని నిరుత్సాహపడి దాన్ని వదిలేయకండి. ఈ సమయ ప్రణాళిక మీ నుండి మీ కుటుంబానికి, మీ పిల్లలకు ఎంతో మేలు  చేస్తుంది. ముఖ్యంగా పిల్లల జీవితం గొప్పగా సాగేందుకు సహాయపడుతుంది. ప్రాధాన్యతలు!!  ప్రతి ఒక్కరి సమయ ప్రణాళికలో కొన్ని ప్రాధాన్యత ఎక్కువ ఉన్నవి, కొన్ని తక్కువ ఉన్నవి ఉంటాయి. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం అందరూ పొరపాటు చేస్తారు. ఏదైనా ఆఫీస్ పని లేదా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినపుడు శారీరక మరియు వ్యక్తిగత సమయాలను కుదించి వాటికి కేటాయిస్తారు. అయితే తిరిగి వాటిని భర్తీ చేయడం ఎలా అనే విషయాన్ని పట్టించుకోరు. కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అనేది ముఖ్యమే కానీ శరీరాన్ని, మూడ్స్ ను డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. వృత్తి పరమైన ప్రాధాన్యతల్లో పడి శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించకూడదు. ప్రణాళిక వేసుకున్నాకా ప్రతి ఒక్కటీ ముఖ్యమైనదే అని, అన్నిటికి సమప్రధాన్యత, ప్రతి పనిని ఒకే విధమైన శ్రద్ధా భక్తులతో చేయాలి. అప్పుడే మీ ప్రణాళికలకు, ఆలోచనలకు సార్థకత.  ప్రోద్బలం, ప్రోత్సాహం!! కుటుంబ సభ్యుల నుండి ఎదో ఒక విధంగా ఏదో ఒక పనిదగ్గర ఇబ్బంది ఎదురవుతూ ఉంటే సింపుల్ గా కుటుంబ సభ్యులలో ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను ఆ పని వైపు ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళు కూడా వారిలో ప్రత్యేకత ఉందని గమనించి తమకంటూ ఓ గుర్తింపు వైపు సాగిపోతారు. ఇలా చేయడం వల్ల ఇతరుల సమయాన్ని గౌరవించే అలవాటు కలుగుతుంది. అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఒకరికొకరు చర్చించుకుని సమయాన్ని ఎంతో సరదాగా గడపవచ్చు. నిజానికి  ఎప్పుడూ వెన్నెల ఉంటే దాన్ని అంతగా ఇష్టపడేవాళ్ళా?? లేదు కదా!! ఇది కూడా అంతే మనుషులు ఎప్పుడూ బంధించుకున్నట్టు ఉంటే ఆ బంధంలో కొత్తదనం కనిపించదు. చివరగా చెబుతున్నా ఎంతో ముఖ్యమైన మాట. మొదట బద్ధకాన్ని వదిలి జీవితాన్ని కొత్తగా మలచుకోవాలి అనే ఆలోచనతో ఆగిపోకుండా అటువైపు అడుగులు వేయాలి. అప్పుడే కొత్తదనం కిలకిలా నవ్వుతుంది జీవితంలో. ◆ వెంకటేష్ పువ్వాడ  
క్రీడాకారులు అంత ఆక్టివ్ గా, ఫిట్ గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా?? చాలామంది వారి ఆహారం అని, వారు చేసే వ్యాయామమని అంటారు. కానీ ఇది శుద్ధ తప్పు. అవన్నీ ఎంత పక్కాగా పాటించినా నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఎవరూ ఫిట్ గా ఉండలేరు. దీన్ని బట్టి చూస్తే నిద్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. నిద్ర ఒక గొప్ప ఔషధం అని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప క్రీడాకారులు తమ ఒత్తిడిని చక్కగా అధిగమిస్తున్నారన్నా, రోజును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారన్నా దానికి వారి నిద్రా విధానాలే మూల కారణం. మానవ జీవక్రియకు, కణజాలాల పెరుగుదలకు శరీరంలో కండరాల మరమ్మత్తులో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న చక్కని నిద్ర ద్వారానే సాధ్యమవుతుంది. సరిగ్గా గమనిస్తే నిద్ర చక్కగా ఉన్నవారు, నిద్రలేమి సమస్య, నిద్రకు సరైన సమయం కేటాయించని వారిని కంపెర్ చేస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మనిషి ఫిట్నెస్ లో నిద్ర కీ పాయింట్ అని అంటున్నారు. ఏరోబిక్ ఫిట్నెస్ ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికి చాలా చక్కని ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాయామాలలో భాగంగా శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. కండరాల పెరుగుదల కోసం.. శరీర కంధర సామర్థ్యం చక్కగా ఉండాలంటే కండరాలను కష్టపెట్టడమే మార్గం కాదు. ఆ కండరాలు రిలాక్స్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిద్ర దానికి చక్కని మార్గం. కండర వ్యవస్థ నిద్రలో బలోపేతం అవుతుంది. అలాగే కండరాలకు తగినంత ప్రోటీన్లు కూడా అందితే కండరాలు దృఢంగా మారతాయి.  హార్మోన్ల గుట్టు టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అనేవి అనాబాలిక్ హార్మోన్లుగా పిలవబడతాయి. ఈ రెండూ నిద్రలోనే విడుదల అవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో రకాల కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా జరిగి ఫిట్నెస్ బావుంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా మంచి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి బాగా లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండా కేవలం మెదడు మీద భారం పడుతూ ఒత్తిడుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో నిద్ర చక్కని ఔషధం. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఫిట్నెస్ కి మొదటి అడుగు పర్ఫెక్ట్ గా పడినట్టే..                                    ◆నిశ్శబ్ద.
చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి గుండె నుండి మెదడు వరకు ప్రతి అవయవానికి ఆరోగ్యం చేకూరుస్తాయి.  కొందరు చేపలు తినని వ్యక్తులు ఫిష్ సప్లిమెంట్లు వాడుతూ ఉంటారు.  ఈ చేప నూనె టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వీరి నమ్మకం.  అయితే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు ఫిష్ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదంతో చలగాటం ఆడటమే అని చెబుతున్నాయి.  అసలు ఫిష్ సప్లిమెంట్లు ఎందుకు అనారోగ్యం? వీటితో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలుసుకుంటే.. సాల్మన్, మాకేరెల్,  ట్రౌట్ వంటి కొవ్వు చేపల నుండి తీసుకోబడిన నూనెను కలిగి ఉన్న క్యాప్సూల్స్  శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.  ఇవి  ముఖ్యంగా గుండె జబ్బులు (CVD), అధిక రక్తపోటు, లిపిడ్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి చాలా మంచివి.  ఈ సమస్యలు ఉన్నవారు ఈ క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె జబ్బులు,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలలో వెల్లడైంది. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ క్రమ రహిత హృదయ స్పందన లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ సప్లిమెంట్లను తీసుకుంటే  క్రమరహిత హృదయ స్పందన 13శాతం,  స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5శాతం  పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తీసుకుంటే  హార్ట్ ఫెయిల్ ప్రమాదం 15శాతం,  మరణించే ప్రమాదం 9శాతం తగ్గించవచ్చట.   అంటే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. కానీ ఆరోగ్య స్పృహతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వీటిని వాడితే మాత్రం ముప్పు  వాటిల్లుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.                                                   *రూపశ్రీ.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి.  కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం అయినా కురుస్తూనే ఉంటోంది.  వర్షాల కారణంగా చెరువులు,  నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో కదలిక వస్తుంది. కొత్తనీరుతో పాటూ వివధ ప్రాంతాలలోని వ్యర్థాలు,  కలుషితాలు కూడా నీటితో కలుస్తాయి. వీటినే తాగునీరుగా,  వంటలకోసం ఉపయోగించడం వల్ల ఆహారం, నీరు అన్నీ కలుషితమవుతాయి.  ఒకవైపు ఇలా ఉంటే అధిక తేమ కారణంగా కొన్ని రకాల కూరగాయలు,  ఆకుకూరలు చాలా తొందరగా చెడిపోతాయి.  అలాంటి వాటిలో ఆకుకూరలు కూడా ఒకటి.  ఆకుకూరలను వర్షాకాలంలో తినవద్దని చెప్పడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా లేని ఆకుకూరలను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, డయేరియా, ఫుడ్ పాయిజనింద్ వంటి అనేక ప్రేగు సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో కూడా ఆకుకూరలను ఆస్వాదించవచ్చని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం ఏం చేయాలంటే.. తాజా ఆకుకూరలు..  నచ్చిన ఆకు కూరలను  కొనుగోలు చేసిన తర్వాత  ఆకుకూరల మధ్యన తడిగా, కుళ్లినట్టు ఉండే ఆకులను వేరు చేయాలి.   ఆరోగ్యంగా, తాజాగా  కనిపించే ఆకులను వేరు చేయాలి. శుభ్రం..  ఆకుకూరల నుండి తాజాగా ఉన్న ఆకులను వేరు చేసిన తరువాత వాటిని శుభ్రం చేయాలి.  ఆకుకూరలు శుభ్రం చేయడానికి చాలామంది మార్కెట్లో లభ్యమయ్యే లిక్విడ్ లను ఉపయోగిస్తుంటారు.   అయితే ఈ  కృత్రిమ క్లీనర్‌లను ఉపయోగించకూడదు.  బదులుగా, ఆకు కూరలను కుళాయి కింద వేగంగా పడుతున్న నీటి ధారలో కడగాలి. ఆరబెట్టాలి.. ఆకుకూరలను కడిగిన తర్వాత అదనపు నీటిని వడకట్టి ఫ్యాన్ కింద ఆకులను ఆరబెట్టాలి. ఆకు కూరలలో తేమ పోయేలా చేయడానికి సలాడ్ స్పిన్నర్‌ను కూడా ఉపయోగించవచ్చు. లేదా కిచెన్ టవల్‌తో ఆరబెట్టవచ్చు. ఈ ఆకుకూరలను వెంటనే అయినా ఉపయోగించవచ్చు. లేదంటే నిల్వ కూడా చేయవచ్చు. జాగ్రత్త..  ఒక గిన్నె నీటిలో  కొంచెం ఉప్పు వేసి నీటిని మరిగించి మంటను ఆపివేయండి. ఇందులో ఆకుకూరలు,  పచ్చిమిర్చి వేసి 30 సెకన్ల పాటు ఉంచాలి. పేర్కొన్న సమయాన్ని మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాటిని ఎక్కువసేపు వేడి నీటిలో ఉంచడం వల్ల వాటి రంగు,  ఆకుకూరల స్వభావం మారిపోతుంది.    ఐస్ బాత్.. వేడి నీటి నుండి ఆకు కూరలను తీసివేసిన వెంటనే  వాటిని మంచు నీటితో నిండిన గిన్నెలోకి మార్చాలి. ఒక నిమిషం అలాగే ఉంచి  తీసివేయాలి. ఇది ఆకుకూరలు తాజాగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండేలా చేస్తుంది.                                         *రూపశ్రీ.