ఉలవచారు నుంచి ఉలవచారు రత్నం వరకూ.. రైతు విజయగాధ
ఉలవచారు నుంచి ఉలవచారు రత్నం వరకూ.. రైతు విజయగాధ

వేడివేడి అన్నంలో కాస్తంత వెన్న లేదా మీగడ వేసుకుని, ఘుమఘుమలాడే ఉలవచారుతో కలిపి తింటే ఆ రుచే వేరు. తెలుగువారి వంటింట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ సాంప్రదాయ వంటకం వెనుక ఒక అసాధారణ విజయగాధ దాగి ఉంది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి ఎదురైన వరుస ఆర్థిక నష్టాలు, సమాజం నుంచి ఎదురైన అవహేళనలు, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఒక వ్యక్తి ఆత్మాభిమాన పోరాటమే నేటి ఇందిరా ఫుడ్స్ సంస్థ. ఇంట్లో తయారు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పనిగా భావించే ఉలవచారును.. ప్యాకేజ్డ్ రూపంలోకి తెచ్చి అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసిన ఘనత మండవ వెంకటరత్నానికే దక్కుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆయన ప్రయాణం సరికొత్త చరిత్రను లిఖించింది. వ్యవసాయంలో ఒడిదుడుకులు.. కుప్పకూలిన కలలు.. కృష్ణా జిల్లా వెంట్రప్రగడ గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన వెంకటరత్నంకు చిన్నతనం నుంచే వ్యవసాయంపై ఎంతో ఆసక్తి ఉండేది. ఆధునిక పద్ధతులలో పెద్ద ఎత్తున సాగు చేయాలనే లక్ష్యంతో వారి కుటుంబం బోధన్ ప్రాంతంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి ఆధారం చూసుకుని సాగు ప్రారంభించింది. అయితే ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి, అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ కాలంలోనే సుమారు రెండు లక్షల రూపాయల భారీ నష్టం వాటిల్లడంతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ తర్వాత గుల్బర్గా, ఎర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ వాతావరణం, మార్కెట్ ధరలు కలిసి రాకపోవడంతో వ్యవసాయం ద్వారా స్థిరపడాలనే వారి ఆశలు అడుగంటాయి. చివరకు అప్పులు తీర్చడం కోసం సొంత ఊరిలోని భూమిని విక్రయించాల్సి వచ్చింది, ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ్ముడి చదువు కూడా మధ్యలోనే ఆగిపోయింది. సామాజిక ఒత్తిడి, అవహేళనలు వ్యవసాయ రంగంలో వరుస పరాజయాలు ఎదురైనప్పుడు సమాజం చూసే దృక్పథం వెంకటరత్నంను తీవ్రంగా గాయపరిచింది. ఇన్ని ఊళ్లు తిరిగి ఏం సాధించావు? అంటూ చుట్టుపక్కల వారి నుంచి వచ్చిన చులకన మాటలు, హేళనలు వారి కుటుంబాన్ని సామాజికంగా ఒంటరిని చేశాయి. ఒక రైతు పడిన కష్టాన్ని లేదా నష్టాన్ని వ్యవస్థా లోపంగా చూడకుండా, వ్యక్తిగత వైఫల్యంగా ముద్ర వేసే సామాజిక పోకడలను ఆయన ఎదుర్కొన్నారు. ఆ సమయంలో డబ్బు సంపాదించడం కంటే కూడా.. పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే ఆయన ముందున్న అతిపెద్ద లక్ష్యంగా మారింది. అదే ఉలవచారు వ్యాపార ఆలోచనకు పునాది అయ్యింది. ఈ సంక్షోభ సమయంలో విశాఖపట్నంలోని తన అత్తగారి ఇంట్లో రుచి చూసిన ఉలవచారు వెంకటరత్నం జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్వసాధారణంగా చేసుకునే ఈ వంటకానికి నగరాల్లో మంచి డిమాండ్ ఉందని, ప్రజలు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన గమనించారు. ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ, సుదీర్ఘ సమయం పడుతుందనే కారణంతో ఇంట్లో వండుకోవడానికి వెనుకాడుతున్న వంటకాన్ని వ్యాపారంగా మార్చాలని ఆయన నిర్ణయించుకున్నారు. 1996లో వైజాగ్‌లోని మధురవాడ ప్రాంతంలో సుమారు 40 వేల రూపాయల స్వల్ప పెట్టుబడితో, సాంప్రదాయ కట్టెల పొయ్యి మీద చిన్న స్థాయిలో ఉలవచారు తయారీని ప్రారంభించారు. ప్రారంభంలో లాభాల కంటే కూడా మార్కెట్‌లో స్థిరపడటమే ధ్యేయంగా వ్యాపారం సాగింది. హైదరాబాద్ మార్కెట్ విస్తరణ.. ఒక వ్యూహాత్మక నిర్ణయం వైజాగ్‌లో వ్యాపారం సాగుతున్నప్పటికీ, ఒక శ్రేయోభిలాషి ఇచ్చిన సలహా వెంకటరత్నం ఆలోచనను మార్చింది. అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే హైదరాబాద్ నగరంలో దీనికి మరింత పెద్ద మార్కెట్ ఉంటుందని గుర్తించి, ఆయన తన కేంద్రాన్ని హైదరాబాద్‌లోని నిజాంపేట్ రోడ్డుకు మార్చారు. స్థానిక జనాభా అవసరాలను సరిగ్గా అంచనా వేస్తూ మొదట చిన్న కిరాణా దుకాణాలు, ఆపై సూపర్ మార్కెట్లు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగే శుభకార్యాల క్యాటరింగ్ ఆర్డర్లను దక్కించుకోవడం ప్రారంభించారు. ఈ రకంగా ఒక సాదాసీదా గ్రామీణ వంటకం కాస్తా, నగరాల్లోని విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన ప్రత్యేక ఐటెంగా మారిపోయింది. సాంకేతిక ఆవిష్కరణ, పేటెంట్ గుర్తింపు ఉలవచారును పెద్ద ఎత్తున తయారు చేయడంలో ప్రధాన అడ్డంకి దాని సుదీర్ఘ తయారీ ప్రక్రియ. కనీసం 10 నుండి 12 గంటల పాటు నిరంతరంగా ఉడికించాల్సి రావడం, కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగ, వేడి తట్టుకోవడం కార్మికులకు పెద్ద సవాలుగా మారింది. దీనికోసం డీజిల్, గ్యాస్ బర్నర్లతో ప్రయోగాలు చేసినప్పటికీ ఆశించిన నాణ్యత, రుచి లభించలేదు. పరిశ్రమల్లో వాడే సాధారణ బాయిలర్ల వల్ల అడుగు అంటుకుపోయే సమస్య ఎదురై, దాదాపు 35 లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి క్లిష్ట సమయంలో వెంకటరత్నం స్వయంగా ఒక సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని ఆలోచించారు. నేరుగా మంట తగలకుండా, బాయిలర్ నుంచి వచ్చే విరి (స్టీమ్) సహాయంతో మాత్రమే ఉడికేలా ప్రత్యేకమైన పొడవాటి, వెడల్పాటి పాత్రలను డిజైన్ చేశారు. ఈ జాకెటెడ్ బాయిలర్ వెసెల్ విధానం ద్వారా ఉలవచారు అడుగు అంటకుండా, అసలైన రుచి, నాణ్యత చెడకుండా భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి వీలు కలిగింది. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న గ్రామీణ రైతు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా చేసిన ఈ ఇండస్ట్రియల్ డిజైన్‌కు అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించడం విశేషం. ఇందిరా ఫుడ్స్ బ్రాండింగ్, అంతర్జాతీయ ప్రస్థానం మార్కెట్‌లో ఆదరణ పెరిగే కొద్దీ నకిలీల సమస్య మొదలైంది. వెంకటరత్నం దగ్గర పనిచేసి వెళ్లిన కొందరు సొంతంగా ఉలవచారు తయారు చేస్తూ మార్కెట్‌లో గందరగోళం సృష్టించారు. దీనిని అరికట్టడానికి ఆయన తన భార్య పేరిట ఇందిరా ఫుడ్స్ అనే బ్రాండ్‌ను అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత వ్యాపార వికేంద్రీకరణలో భాగంగా ఉత్పత్తి కేంద్రాన్ని విజయవాడలోని గుణడలకు మార్చారు. ఈ సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది విస్తృత నెట్‌వర్క్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థ ఏర్పాటయింది. డీ-మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ వంటి ప్రముఖ సూపర్ మార్కెట్లతో పాటు వేలాది కిరాణా దుకాణాల్లో ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉంది. అంతే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారి కోసం అక్కడి గ్రోసరీ స్టోర్లకు భారీగా ఎగుమతి అవుతోంది. ఇక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా నేరుగా వినియోగదారుల చెంతకు చేరుతోంది. ఒకప్పుడు కేవలం రోజుకు 4 కిలోల ఉలవలతో ప్రారంభమైన ఈ ప్రయాణం,ఇప్పుడు ప్రతిరోజూ నాలుగువేల కిలోల ఉలవలను ప్రాసెస్ చేసే స్థాయికి చేరిందంటే.. ఈ బ్రాండ్ సాధించిన విజయం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకటరత్నం కుటుంబం ఒక పటిష్టమైన బృందంగా వెన్నుదన్నుగా నిలిచింది. అరవై ఏళ్లు పైబడినప్పటికీ ఆయన తండ్రి వెంకట్రామయ్య పొయ్యి దగ్గర గంటల తరబడి శ్రమించగా, తల్లి విజయలక్ష్మి, సోదరి సరోజిని తయారీకి కావాల్సిన సరుకుల శుభ్రతను చూసుకునేవారు. తమ్ముడు చంద్రశేఖర్ ఆజాద్ మార్కెటింగ్ రంగాన్ని విస్తరించగా, భార్య ఇందిర వ్యాపార ఆలోచనల్లో, బ్రాండింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ఒక విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్ మోడల్‌కు వీరి ప్రయాణం చక్కటి ఉదాహరణ. గ్రామీణ యువతకు సరికొత్త పాఠాలు మండవ వెంకటరత్నం జీవితం కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంలో ఉన్న ఎందరో రైతులకు, గ్రామీణ యువతకు ఒక దిక్సూచి. సాంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు. కేవలం పంటలు పండించడమే కాకుండా, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి, సరైన బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లగలిగితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చనే బలమైన సందేశాన్ని ఈ కథ అందిస్తోంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 5:06PM
 అమెరిక‌న్ క‌ల‌ క‌రిగిపోతోందా?  భార‌తీయుల‌పై ద్వేషం  పెరుగుతోందా?
అమెరిక‌న్ క‌ల‌ క‌రిగిపోతోందా? భార‌తీయుల‌పై ద్వేషం పెరుగుతోందా?

అమెరికా సిలికాన్ వ్యాలీని.. ఒక వాగ్దాన‌ పునాదుల‌ మీద నిర్మించారు. మీకు తగినంత ప్రతిభ ఉంటే, ఇక్కడ ఉండటానికి అర్హులు. వీపున బ్యాక్‌ప్యాక్‌తో ఉన్న ఒక ఇంజనీర్, రెండు సూట్‌కేసులు, ఒక హెచ్-1బి వీసా, ఇమ్మిగ్రేషన్ పత్రాలలో ఇమడలేనంత పెద్ద కలతో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో అడుగుపెడుగు పెట్టి స‌రాస‌రి ఇక్క‌డికి వ‌చ్చేవారు. భారతీయులు ఆ వాగ్దానాన్ని నమ్మారు. వారు దానిని ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి నిర్మించారు. అలంకారికంగా కాదు, అక్షరాలా. చిప్స్, సాఫ్ట్‌వేర్, క్లౌడ్ సిస్టమ్స్, మీ ఫోన్‌లో నడుస్తున్న కోడ్. సిలికాన్ వ్యాలీ భారతీయ ప్రతిభను కేవలం స్వాగతించడమే కాదు. అది దానిపై ఆధారపడి న‌డిచింది కూడా. నేడు.. సిలికాన్ వ్యాలీలోని టెక్ వర్క్‌ఫోర్స్‌లో సుమారు మూడింట ఒక వంతు మంది భారత మూలాలకు చెందినవారే. మొత్తం మీద.. వారు దాదాపు 50 వేల‌ నుంచి 75వేల‌ మంది టెక్ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ.. ఇక్కడ ఒక ఇబ్బందికరమైన ప్రశ్నత‌లెత్తుతోంది. యంత్రాన్ని నిర్మించిన వారిని, ఆల్ ఆఫ్ ఏ స‌డెన్.. యంత్రంలోకి చొరబడిన వారిలా చూసినప్పుడు.. అస‌లేం జరుగుతోంది? విమానాల్లో.. ప్రతిభామంతులను దిగుమతి చేసుకున్న అదే దేశం, చెక్కులు తీసుకున్న తర్వాత.. అకస్మాత్తుగా జాతీయవాదాన్ని కనుగొంటే ఏం జ‌రుగుతోంది? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. ఎందుకంటే.. ఈ రోజు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో, ఇండియన్లను ఐడ‌ల్ మైనార్టీగా చూడటం లేదు. వారు సులభంగా లొంగిపోయే అల్పసంఖ్యాక వర్గంలా మారుతున్నారు. దెబ్బలు తినే బలిపశువుగా, నిందకు పాత్రులుగా, ఇతరులుగా, పరాయివారిగా. ప్రపంచీకరణకు దేవాలయంలాంటి సిలికాన్ వ్యాలీ, భవిష్యత్తులా కాకుండా, తమ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన ఆక్ర‌మ‌ణ‌దారులుగా వీరు చిత్రీక‌రించ‌బ‌డుతున్నారు. ఈ సిలికాన్ వ్యాలీ కథ దాతృత్వం గురించి కాదు. పర్యాటకులు స్టార్‌బక్స్‌ను కనుగొన్నంత ఈజీగా, భారతీయులు యాదృచ్ఛికంగా సిలికాన్ వ్యాలీలోకి ప్రవేశించి విజయాన్ని అందుకోలేదు. అమెరికా వారిని నియమించుకుంది. అది కూడా చాలా దూకుడుగా. 1990లలో వలసల సరళీకరణ వరద గేట్లను తెరిచింది. సిలికాన్ వ్యాలీ ఇంజనీర్ల కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూసింది. భారతదేశంలో వారు పుష్కలంగా ఉన్నారు. ఆధునిక చరిత్రలోనే అత్యంత కీలకమైన ప్రతిభా వలసలలో ఒకటైన ఈ ఘ‌ట్టం అలా మొదలైంది. ఈ ప్రాంతంలోని వ్యాపార కార్యనిర్వాహకులలో, శ్వేతజాతీయుల తర్వాత ఇండియన్ అమెరికన్లు రెండవ అతిపెద్ద సమూహంగా ఉన్నారు.ఇండియన్ అమెరికన్లు కార్పొరేట్ అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహించారు. ఇంద్రా నూయి, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్.. ఇలా వీరంద‌రి విజ‌య‌గాథ‌ల‌ను.. ఒక‌ప్పుడు అమెరికా ఎంతగానో ఇష్టపడింది. ఎందుకంటే ఈ విజయం ఒక‌ స్ఫూర్తిదాయకం. ఆ తర్వాత ఏమైందో తెలీదు.. అకస్మాత్తుగా అది పూర్తిగా మారిపోయింది. భారతీయులు తెల్లవారుజామున 2 గంటలకు క్యూబికల్స్‌లో నిశ్శబ్దంగా కోడింగ్ చేస్తున్నప్పుడు, వారు కష్టపడి పనిచేసే వలసదారులు. కానీ వారు ఇళ్లు కొనడం, కంపెనీలకు నాయకత్వం వహించడం, రాజకీయాల్లోకి ప్రవేశించడం ప్రారంభించిన తర్వాత, అమెరికాలోని కొన్ని వర్గాలు ప్రతిస్పందించడం మొదలుపెట్టాయి. ఆదర్శ అల్పసంఖ్యాక వర్గం నుంచి బలిపశువుగా మారడం.. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. హెచ్-1బి వీసా హోల్డర్లను ఉద్యోగ దొంగలుగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల.. భారతీయులే అతిపెద్ద లబ్ధిదారులు. భారతీయ వలసదారులు అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ, స్టీఫెన్ మిల్లర్, వలస విధానాల విషయంలో భారతీయులు చాలా మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దక్షిణాసియా ప్రజలపై ఆన్‌లైన్ దూషణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో, ఆన్‌లైన్‌లో ఉపయోగించిన దక్షిణాసియా వ్యతిరేక దూషణలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల, ఒక అమెరికన్ వ్యక్తి ఒక భారతీయ జంటను నిలదీస్తున్న వీడియో బాగా వైరల్ అయింది చూశారా? ఆ వీడియోలో, ఆ వ్యక్తి భార‌తీయ‌ జంటను తిరిగి మీ దేశానికి వెళ్ళండి అని చెప్పడం మ‌నం స్ప‌ష్టంగా వినవచ్చు. ఫ్రీమాంట్‌లోని ఒక హిందూ దేవాలయం తలుపుపై నల్ల శిలువలను చిత్రించి ధ్వంసం చేశారు. 2024 డిసెంబర్ నాటి నుంచి, యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా ఎనిమిదికి పైగా హిందూ దేవాలయాలు ధ్వంస‌మ‌య్యాయి, వాటిలో అత్యధికం కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఈ దాడులు ఇకపై అక్కడక్కడా జరగడం లేదు. భారతీయులు అమెరికాపై దండెత్తుతున్నారనే కుట్ర సిద్ధాంతాలను బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు కొంద‌రు అమెరిక‌న్ రైటిస్టులు. భారతీయ జనసమూహాల ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు. చేతులతో తినడం వెనుకబాటుతనానికి నిదర్శనంగా మారుతున్నది. గత సంవత్సరం న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల సమయంలో, మాజీ డెమోక్రటిక్ గవర్నర్ ఆండ్రూ క్యూమోకి చెందిన ఫ్రీలాన్స్ ప‌బ్లిసిటీ టీం, ప్రస్తుత న్యూయార్క్ మేయర్ జోరాన్ మొమ్దానీ చేతులతో అజాగ్రత్తగా అన్నం తింటున్నట్లు చిత్రీకరిస్తూ, ఏఐ రూపొందించిన చిత్రాన్ని విడుదల చేసింది. సోషల్ మీడియా ప్రతీ విషయాన్ని విస్తృతం చేసింది. గత సంవత్సరం ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఆన్‌లైన్‌లో దీపావళి శుభాకాంక్షలు పోస్ట్ చేసినప్పుడు, కొంద‌రు ఎక్స్ట్రీమిస్టులు.. జాత్యహంకార దూషణలతో ముంచెత్తారు. నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నీ ఇసుక రాక్షసులను పూజించు. ఇదీ వారి నుంచి వచ్చిన ప్ర‌తిస్పందన. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి రాజకీయ నాయకులు కూడా ఈ దాడులను ఎదుర్కొన్నారు. ఇది ఎంత అసంబద్ధమో ఆలోచించండని అంటారు ఇండో అమెరిక‌న్స్. అమెరికా ఇన్‌స్టాగ్రామ్‌లో టాకోస్‌ను వేడుకగా జరుపుకుంటుంది, సుషీ ట్రెండింగ్‌లోకి వస్తుంది, యోగా బిలియన్ డాలర్ల వెల్నెస్ పరిశ్రమగా మారుతుంది, కానీ అకస్మాత్తుగా దీపావళి ఒక‌ విదేశీ పండుగలా అనిపిస్తుంది. ఆ తర్వాత రాజకీయ ద్వంద్వ ప్రసంగం మ‌న చెవుల‌ను తాకుతుంది. అమెరికా తనకు అత్యుత్తమైన అత్యంత తెలివైన వారు కావాలని చెబుతుంది. కానీ, ఆ అత్యంత తెలివైన వారే విదేశీయుడిలా వినిపించడం మొదలుపెట్టే వరకు. అప్పుటి వ‌ర‌కూ ఉన్న స‌ర‌ళ‌త‌ర‌మైన నిబంధనలు అక‌స్మాత్తుగా మారిపోతాయి. పెరిగిన వీసా ఫీజులు, పౌరసత్వ ప్రక్రియలో.. అడ్డంకులు, గ్రీన్ కార్డ్ కోసం అంతులేని పెండింగ్ కేసులు. భారతీయ నిపుణులు సంవత్సరాల తరబడి, కొన్నిసార్లు దశాబ్దాల తరబడి వేచి చూస్తారు. ఈ పరిణామం మరింత వేగవంతమైతే, అది బే ఏరియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలదు, ఎందుకంటే ఆ ఆర్థిక వ్యవస్థ టెక్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆకర్షించడంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇవన్నీ ఉన్నా, భారతీయ అమెరికన్లు యునైటెడ్ స్టేట్స్‌లో.. అత్యధిక సంపాదన, ఉన్న‌త‌ విద్య గ‌ల‌ వర్గాలలో ఒకరిగా నిలిచారు. ఇండియన్ అమెరికన్ల సగటు కుటుంబ ఆదాయం సుమారు ల‌క్ష‌న్న‌ర‌గా ఉంది. అదే అమెరిక‌న్ల విష‌యానికి వ‌స్తే ఇది డెబ్బై వేలుగా ఉంది. సుమారు 70 శాతం మంది ఇండియన్ అమెరిక‌న్లు.. వివిధ ర‌కాల విద్య‌, వైద్యం, ఆర్ధిక‌, సాంకేతిక రంగాల్లో డిగ్రీల‌ను క‌లిగి ఉన్నారు. అంతే స్థాయిలో ఆధిప‌త్యం చెలాయిస్తున్నారు కూడా. అమెరికా పన్నుల వ్యవస్థకు వారు మ‌రింత బ‌లాన్ని చేకూర్చుతున్నారు. జనాభాలో కేవలం 1.5శాతం ఉన్నప్పటికీ, మొత్తం యు.ఎస్. ఆదాయపు పన్నులలో సుమారు 5శాతం నుంచి 6శాతం వరకు చెల్లిస్తున్నారు. అది ఆర్థిక వ్యవస్థపై భారం కాదు. అదే అస‌లైన‌ ఆర్థిక వ్యవస్థ. వలస కార్మికుల శ్ర‌మ‌, శ‌క్తుల ద్వారా ఒక‌ సామ్రాజ్యాన్ని నిర్మించడం. ఆపై వారిని వెళ్ల‌గొట్టే య‌త్నం చేయ‌డ‌మే ఇక్క‌డ అతి పెద్ద న‌మ్మ‌క ద్రోహాన్ని త‌ల‌పిస్తోంది. ఇక్కడే సిలికాన్ వ్యాలీ తన అతిపెద్ద వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నది. మీరు వలస కార్మికులతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి, ఆ తర్వాత వలసదారులు విజయం సాధించినప్పుడు ఆశ్చర్యపోయినట్లు నటించలేరు. అది లెబ్రాన్ జేమ్స్‌ను నియమించుకుని, ఆ తర్వాత అతను చాలా ఎక్కువ పాయింట్లు సాధిస్తున్నాడని ఫిర్యాదు చేయడం లాంటిది. సిలికాన్ వ్యాలీ రాత్రికి రాత్రే అదృశ్యం కాదు. కానీ దాని ఆత్మ.. ప్రపంచం నలుమూలల నుంచి.. అత్యుత్తమ మేధావులు ఒకే చోట చేరి భవిష్యత్తును నిర్మించగలరనే అద్భుతమైన అందమైన ఆలోచన. ఆ ఆత్మ క్రమంగా డొల్లగా మారుతోంది. ఒక్కో ద్వేషపూరిత పోస్ట్, ధ్వంసానికి గురవుతోన్న ఒక్కో దేవాలయం, తిరస్కరించిన ఒకానొక వీసాతో ఇది జరుగుతోంది. ఇది వలసదారుల భూమి. మరి ఇక్కడి స్థానికులు ఎవరు? నిస్సందేహంగా స్థానిక అమెరికన్లు, అంటే రెడ్ ఇండియన్లు. వారికేమైంది? ఈ కాలంలో అమెరికాలో ఎంతమంది మిగిలి ఉన్నారు? 400 సంవత్సరాల క్రితం ఐరోపా ఖండం నుంచి పశ్చిమ అర్ధగోళానికి వలస వచ్చిన శ్వేతజాతి ఆంగ్లో-సాక్సన్ ప్రొటెస్టంట్లు, కాథలిక్కులు. మిగిలింది చరిత్ర, స్థానిక అమెరికన్లను వధించి నిర్మూలించారు. తెలివైన ఐరోపా వలసదారులు కేవలం పశ్చిమ అర్ధగోళాన్నే కాకుండా మొత్తం ప్రపంచాన్ని వలసరాజ్యంగా మార్చుకున్నారు. ఆఫ్రికన్లను తోటల కార్మికులుగా తీసుకువచ్చి బానిసలుగా మార్చారు. ఆ బానిస కార్మికులను ఎలా చూశారనేది చరిత్ర. ఆధిపత్యం చెలాయించిన, వివేకవంతులైన, తెలివైన ఆ యూరోపియన్ల వారసులు తమను తాము స్థాపించుకున్నారు. వారే పుట్టుకతో అమెరికన్లు. ఇక భారతీయుల వంటి ఇటీవలి వలసదారుల విషయానికి వస్తే, వారందరూ ఉన్నత విద్యావంతులు, చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, తమ బాధ్యతలను నెరవేర్చారు, సంపదను సృష్టించి అమెరికాను సుసంపన్నం చేశారు. వారు సృష్టించే ప్రతి హెచ్1బీ వీసాకు 1.8 అదనపు ఉద్యోగాలు లభిస్తున్నాయి. 1.2శాతం మంది భారతీయ వలసదారులు అమెరికాలో విధించే వ్యక్తిగత పన్నులలో 6శాతం వ‌ర‌కూ చెల్లిస్తున్నారు. వారి వారసులు పుట్టుకతోనే పౌరులుగా ఉన్న యూరోపియన్ వలసదారులకు, ప్రస్తుతం వలస వచ్చిన భారతీయుల వంటి వలసదారులకు మధ్య గ‌ల‌ ఏకైక తేడా ఏమిటంటే, యూరోపియన్ల ద‌గ్గ‌ర‌ వారి వలసకు సంబంధించిన రికార్డు ఉండదు, కానీ భారతీయుల వద్ద వారు వలస వచ్చిన తేదీ ఇత‌ర‌త్రా వివ‌రాలుంటాయి. వారి మధ్య ఉన్న ఏకైక తేడా ఇదే. వారిలో చాలామంది ఈ గొప్ప అవకాశాల గడ్డకు వలస వచ్చినవారే. ఆ రోజుల్లో యూరోపియన్ వలసదారులు తెలివైనవారు, వివేకవంతులు కాబట్టి వారు.. పశ్చిమ అర్ధగోళంపై ఆధిపత్యం చెలాయించారు. చరిత్రే గనుక సాక్ష్యమైతే, తెలివైనవారే ఎల్లప్పుడూ పెత్తనం చేస్తారు. మార్పు ఒక్కటే శాశ్వతం. సణుగుతూ, అలిగే వారు వివక్ష చూపడం మానేసి.. తొలుత‌ శాంతిని నెలకొల్పాలి, ఎందుకంటే వివక్ష చూపడం చాలా అన్యాయం కాబ‌ట్టి. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 4:29PM
గ‌నుల్లో కాదు.. ల్యాబుల్లో వ‌జ్రాల పంట‌!
గ‌నుల్లో కాదు.. ల్యాబుల్లో వ‌జ్రాల పంట‌!

భారత వజ్ర పరిశ్రమలో ఓ చారిత్రక మలుపు చోటుచేసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. భారతదేశం నుంచి ఎగుమతి అయిన పాలిష్ చేసిన ల్యాబ్-గ్రోన్ డైమండ్స్- ఎల్జీడీ పరిమాణం తొలిసారిగా సహజ వజ్రాల మార్కెట్ ని క్రాస్ చేసింది. సూరత్ కేంద్రంగా వేగంగా విస్తరిస్తున్న ఈ రంగం, కేవలం తయారీ విధానంలోనే కాదు, గ్లోబల్ ఆభరణాల మార్కెట్ స్వరూపాన్నే మార్చే స్థాయికి చేరింది. నామమాత్ర స్థితి నుంచి పదేళ్లలో సహజ వజ్రాల ఎగుమతులను మించిపోయే స్థాయికి ల్యాబ్ గ్రోన్ వజ్రాలు చేరడం, భారత రత్నాభరణ పరిశ్రమలో భారీ మార్పును సూచిస్తోంది. ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు సూరత్ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదిగింది. భారతదేశపు కృత్రిమ వజ్రాలలో 90 శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది సూరత్‌కు కొత్త పారిశ్రామిక గుర్తింపును తీసుకొచ్చి పెడుతోంది. ఒకప్పుడు సహజ వజ్రాల కటింగ్, పాలిషింగ్‌కు ప్రసిద్ధి చెందిన సూర‌త్.. నేడు డిజిటల్ కంట్రోల్డ్, ఫాస్టెస్ట్, చీప్ అండ్ బెస్ట్ డైమండ్ మేకింగ్ కి కేరాఫ్ గా మారింది. ఈ మార్పు అనుకోకుండా జ‌రిగింది కాదు. ఆధునిక సాంకేతికత, తక్కువ తయారీ ఖర్చులు, ఎగుమతి మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ వెర‌శీ.. ఎల్జీడీ రంగాన్ని ఎంతో వేగంగా పైపైకి తీసుకెళ్లాయి. భారత రత్నాభరణ పరిశ్రమ దీని ద్వారా కొత్త శ‌కంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ గణాంకాల ప్రకారం, 2025-26లో భారతదేశం 18.8 మిలియన్ క్యారెట్ల పాలిష్ చేసిన ఎల్జీడీలను ఎగుమతి చేసింది. ఇదే కాలంలో సహజ వజ్రాల ఎగుమతులు 16 మిలియన్ క్యారెట్ల ద‌గ్గ‌ర‌ నిలిచాయి. అంటే.. పరిమాణం పరంగా చూస్తే.. ఈ స‌రి కొత్త వజ్ర పరిశ్రమ సంప్రదాయ వజ్ర పరిశ్రమను అధిగమించిందన్న మాట‌. పదేళ్ల క్రితం ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. 2015-16లో పాలిష్ చేసిన సహజ వజ్రాల ఎగుమతులు 33.51 మిలియన్ క్యారెట్లు కాగా, ఎల్జీడీ ఎగుమతులు కేవలం ల‌క్ష‌ క్యారెట్ల పరిమితిలోనే ఉండేవి. ఈ మార్పు, ఒక చిన్న విభాగం నుంచి.. ప్రపంచ స్థాయి పరిశ్రమగాఎల్జీడీలు ఎదిగిన తీరు ఎంత వేగవంతమైందో చూపిస్తోంది. పదేళ్లలో ల‌క్ష‌ క్యారెట్ల నుంచి 18.8 మిలియన్ క్యారెట్లకు చేరడం, ప్రపంచ వజ్ర మార్కెట్‌లో అరుదైన రికార్డుగా అంచ‌నా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. విలువ పరంగా మాత్రం సహజ వజ్రాలు ఇంకా ముందంజలో ఉన్నాయి. పాలిష్ చేసిన ఎల్జీడీల సగటు ఎగుమతి ధర.. క్యారెట్‌కు సుమారు 60 డాలర్లు కాగా, సహజ వజ్రాల సగటు ధర క్యారెట్‌కు 760 డాలర్ల వరకు ఉందని సమాచారం. అంటే, ఎల్జీడీలు పరిమాణంలో ఎదిగినా, విలువలో ఇంకా సహజ వజ్రాల స్థాయికి చేరలేదు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 4:07PM
దేశ వ్యాప్తంగా  100 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు
దేశ వ్యాప్తంగా 100 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేట్ స్కీమ్.. భారత తయారీ రంగానికి ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి ద్వారా సమీకృత మౌలిక సదుపాయాలను, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని, ఉపాధి అవకాశాలను విస్తరించాలన్నది ఈ పథకం ప్రధాన ధ్యేయం. ఆరు సంవత్సరాల్లో రూ.33,660 కోట్ల ఆ వ్యయంతో వంద‌ పారిశ్రామిక పార్కులు, ప్రపంచ ప్రమాణాల పారిశ్రామిక మౌలిక సదుపాయాలు.. ఇవీ ఈ భవ్య పథకంలోని కీల‌కాంశాలు. ఇక ఈ ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న విష‌యానికి వ‌స్తే.. మేక్ ఇన్ ఇండియా, పీఎం గతి శక్తి లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ పథకం.. ఇండియాని ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే వ్యూహాత్మక ప్రయత్నంగా నిలుస్తోంది. 2026-27 నుంచి 2031-32 వరకు ఆరేళ్లలో సుమారు 33,660 కోట్ల రూపాయల వ్యయంతో 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఛాలెంజ్ బేస్డ్ ప్ర‌క్రియ‌ ద్వారా 50 పార్కులను ఎంపిక చేయనున్నారు. ఈ విధానం కేవలం భూమి కేటాయింపునకు మాత్రమే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పాలనా నాణ్యత, అమలు సామర్థ్యాన్ని ఆధారంగా తీసుకుంటుంది. అంటే.. పార్కు ఏర్పాటు కావడం కంటే, అది నిజంగా పనిచేయడం ముఖ్యమన్న సంకేతాన్నిస్తోంది కేంద్ర‌ ప్రభుత్వం. ఈ పథకంలో పెట్టుబడికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను రూపొందించాలన్న లక్ష్యం అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది. ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, మ‌ల్టీ ట్రాన్స్ పోర్టేజేష‌న్ క‌నెక్టివిటీ, క్రెడిబిలిటీ గ‌ల‌ యుటిలిటీలు, కార్మికులు అక్క‌డే నివ‌సించే విధంగా గృహ వసతి, డిజిటల్ పాలనా వ్యవస్థలు, సుస్థిరాభివృద్ధి లక్షణాలు ఈ పార్కు రూప‌క‌ల్ప‌న‌లో అత్యంత కీల‌కంగా ఉంటాయి. ఇలాంటి మోడ‌ల్ ఉంటే పరిశ్రమలు, భూమి, విద్యుత్, నీరు, మురుగునీటి శుద్ధి, అనుమతులు వంటి ప్రాథమిక అడ్డంకులపై సమయం వృథా చేయకుండా నేరుగా ఉత్పత్తిపై దృష్టి పెట్టగలవు. ఇది ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల వ్యయాన్ని, సమయాన్ని రెండింటినీ తగ్గించగలదు. ఈ పథకం కింద.. భూగర్భ వినియోగ వ్యవస్థలు, నీటి, వ్యర్థాల నిర్వహణ, ఉమ్మడి మురుగునీటి శుద్ధి కేంద్రాలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు, కార్మికుల గృహ వసతి, ప్రయోగశాలలు, డిజిటల్ సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థలు, నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలు వంటి అంశాలకు ప్రాధాన్య‌త‌ ఇవ్వనున్నారు. ఈ నిర్మాణం చూస్తే.. ఇది కేవలం పరిశ్రమల కోసం భూమిని సిద్ధం చేయడం కాదు.. పూర్తి ఇండ‌స్ట్రియ‌ల్ ఎకో సిస్ట‌మ్ తయారు చేయడం అన్నమాట. దేశీయ స‌ప్ల‌య్ చైన్ బలపడాలన్నా, ఎగుమతులు పెరగాలన్నా, ఇలాంటి సమగ్ర మౌలిక వ్యవస్థ తప్పనిసరి. పరిశ్రమలకు కేవ‌లం భూమి మాత్రమే కాదు.. పనిచేసే వ్యవస్థ అందించాలన్నదే ఈ పథకంలోని అసలైన దృష్టి కోణం. కొండ ప్రాంతాలు కాని రాష్ట్రాలకు కనీసం 100 ఎకరాల భూమి అవసరం కాగా.. కొండ ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాలకు 25 ఎకరాల కనీస పరిమితిని నిర్ణ‌యించారు. అదే సమయంలో వెయ్యి ఎకరాల వరకు ఉన్న.. పెద్ద పార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవ‌డం ద్వారా, అవసరాన్ని బట్టి విస్తరణకు అవ‌కాశాన్ని క‌ల్పించారు. ఇది రెండు విధాలుగా.. ఉపయోగపడుతుంది. ఒకవైపు చిన్న రాష్ట్రాలు కూడా రంగంలోకి రావచ్చు. మరోవైపు భారీ పెట్టుబడులు కోరే రాష్ట్రాలు పెద్ద పార్కులతో ముందుకు వెళ్లవచ్చు. ఇలా భౌగోళిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం, కేంద్ర విధానానికి ఒక సౌలభ్యాన్ని తీసుకొస్తుంది. ఈ పథకంలో నిధులను ఈక్విటీ వాటాల‌ రూపంలో అందించనున్నారు. SPVలకు బదిలీ చేసిన భూమి విలువకు అనుసంధానించిన మద్దతు, ప్రాజెక్టు మైలురాళ్ల సాధనకు సంబంధించిన ప్రోత్సాహకాలు, ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యానికి నిర్మాణాత్మక నిబంధనలు ఇందులో భాగమవుతున్నాయి. ఇది సాధారణ గ్రాంట్ మోడల్ కంటే మరింత మెరుగైన‌ పనితీరు క‌లిగిన‌ విధానం. అంటే.. డబ్బు ఇవ్వడమే కాకుండా, ఫలితాల పట్ల బాధ్యతను కూడా కట్టుదిట్టంగా ఉంచుతార‌న్న‌మాట‌. ఈ మోడల్ అమలులో సవ్యంగా నడిస్తే, వృథా వ్యయం తగ్గి, ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ఐసీడీసీ ని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీగా నియమించడం, అలాగే డీపీఐఐటీ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఈ పథకానికి పాలనా బలాన్ని ఇస్తుంది. జీఐఎస్ ఆధారిత పర్యవేక్షణ, పీరియాడిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు, ఆడిట్ యంత్రాంగాలు, పారదర్శకతకు సంబంధించిన సేఫ్టీ మెజ‌ర్మెంట్స్ గా తెలుస్తోంది. పెద్ద పథకాలు కాగితంపై గొప్పగా కనిపించడం సులభం. కానీ వాటి నిజమైన పరీక్ష.. గ్రౌండ్ లెవ‌ల్లో పనులు ఎంత వేగంగా, ఎంత నాణ్యంగా, ఎంత పారదర్శకంగా జరుగుతాయన్నదే . దీంతో డిజిటల్ పర్యవేక్షణను బలంగా చేర్చడం ఒక కీలక పరిణామంగా తెలుస్తోంది. ఈ గ్రేట్ ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ.. కేవలం పారిశ్రామిక మౌలిక సదుపాయాల పథకం మాత్ర‌మే కాదు. అది భారత ఆర్థిక వ్యూహంలోని మెయిన్ పిల్ల‌ర్ కూడా. వ‌ర‌ల్డ్ స‌ప్లై చైన్ రీజ‌న‌రేట్ అవుతోన్న‌ ఈ కాలంలో, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పార్కులు విదేశీ, దేశీయ పరిశ్రమలకు ఒక ఆహ్వానంలాంటివి అవుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రసాయనాలు, ఎగుమతి.. తయారీ రంగాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.ఇలాంటి పార్కులు స్థానిక ఉపాధిని పెంచడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, రాష్ట్రాలకు పోటీదారులుగా ఉండే అవకాశాన్ని అందిస్తాయి. రాష్ట్రాల మధ్య పారిశ్రామిక పోటీ మరింత తీవ్ర త‌రం చేయ‌డం ఖాయం. అయితే, ఈ పథకం విజయవంతం కావాలంటే.. కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. భూ సేకరణ, అనుమతులు, రాష్ట్ర–కేంద్ర సమన్వయం, ప్రైవేట్ భాగస్వామ్య ఆకర్షణ, వాస్తవిక సమయపాలన ఇందులోని ప్రధాన అంశాలు. ఒకసారి పార్కు స్థాపన జరిగినంత మాత్రాన పరిశ్రమలు ఆటోమేటిక్‌గా రాకపోవచ్చు. వాటికి నమ్మకం, సౌలభ్యం, ఇత‌ర‌త్రా విధాన స్థిరత్వం కావాలి. అందువల్ల, ఈ గ్రేట్ ఇండ‌స్ట్రియ‌ల్ స్కీమ్ కేవలం ప్రకటనగా కాకుండా, నిరంతర అమలు, సమర్థ సమన్వయం, కట్టుదిట్టమైన ఫలితాలను రాబ‌ట్ట‌డం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 3:56PM
 డెడ్ ఎకాన‌మీలోనూ ఆటోసేల్స్ అదుర్స్.. వింటున్నారా రాహుల్ జీ
డెడ్ ఎకాన‌మీలోనూ ఆటోసేల్స్ అదుర్స్.. వింటున్నారా రాహుల్ జీ

రాహుల్ గాంధీ ఆయ‌న మ‌నుషులు.. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా వెక్కిరిస్తూ ఉంటే.. ఇప్పుడు సొసౌటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏమ్) డేటా ఈ వాదనలను తారుమారు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగం రికార్డు స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎస్ఐఏమ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అన్ని సెగ్మెంట్లను కలుపుకుని దేశవ్యాప్తంగా సుమారు- 2.83 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే, దేశీయ మార్కెట్లో సగటున ప్రతి నిమిషానికీ 54 వాహనాల విక్ర‌యాలు జ‌రిగాయి. ఇది భారతీయుల కొనుగోలు శక్తికి, ఆర్థిక వ్యవస్థ బలానికి ప్రతిబింబం. సెగ్మెంట్ల వారీగా అమ్మకాల వివరాలు చూస్తే.. టూవీల‌ర్ మొత్తం అమ్మకాలు.. 2.17 కోట్లు కాగా.. కార్ల సేల్స్ 46.43 లక్షల యూనిట్లుగా ఉంది. ఇక ఈ అమ్మ‌కాల్లో 5.64 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాల‌తో మ‌హారాష్ట్ర టాప్ గేర్ వేయ‌గా.. త్రీవీల‌ర్స్ మొత్తం అమ్మ‌కాలు 8.36 యూనిట్లు. క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ సేల్స్ 10.80 ల‌క్ష‌ల యూనిట్లు. ఈ ఆటో సేల్స్ లో మ‌హారాష్ట్ర 1.61 ల‌క్ష‌ల‌ అమ్మ‌కాల‌తో హై పొజిష‌న్లో ఉండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానాలలో.. గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క ఉన్న‌ట్టు చెబుతున్నాయి గ‌ణాంకాలు. ఇందులో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేంటంటే.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ అమ్మ‌కాలు ఎక్కువ జ‌రిగిన‌ట్టు ఎస్ఐఏమ్ పేర్కొంది. టూవీల‌ర్స్, మ‌రీ ముఖ్యంగా 100సీసీ నుంచి 125సీసీ మోటార్ సైకిళ్ల అమ్మకాల్లో.. గ్రామీణ ప్రాంతాల వాటా చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే కార్ల అమ్మకాల సంఖ్య కూడా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం.. ఇది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు సూచిక అంటున్నారు మార్కెట్ పండితులు. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటో ఎన‌లైజ్ చేస్తే.. ఎస్ఐఏమ్ డేటా ప్రకారం,, ఈ రికార్డు వృద్ధికి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్, పండ‌గ సీజ‌న్ల ఆఫ‌ర్లు, ఆపై దేశంలో మెరుగుప‌డ్డ ఆర్ధిక స్థితిగ‌తులు, త‌ద్వారా పెరిగిన ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తి. వేగంగా జ‌రుగుతోన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు ప్ర‌ధాన కార‌ణాలుగా చెబుతున్నారు. ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి సూచిక అనడంలో సందేహం లేదంటారు మార్కెట్ ఎన‌లిస్టులు. రోడ్లు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి.. పెరగడంతో గ్రామీణ భారతం కూడా వాహనాల కొనుగోలులో ముందంజలో ఉంది. రాహుల్ అండ్ కో డెడ్ ఎకానమీ వంటి నినాదాలు త‌ర‌చూ ఇస్తూనే ఉండొచ్చు. కానీ.. ప్రతి నిమిషానికి 54 వాహనాలు అమ్ముడవుతున్న గణాంకాలు మాత్రం ఈ వెక్కిరింపులకు దీటైన జ‌వాబులే ఇస్తున్నాయంటారు ప‌లువురు ఆర్ధిక నిపుణులు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 3:39PM
 కాక్రోచ్  జ‌న‌తా  పార్టీ.. కేవ‌లం మీమ్ ఫ్యాక్ట‌రీయా?..  రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మా?
కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.. కేవ‌లం మీమ్ ఫ్యాక్ట‌రీయా?.. రాజ‌కీయ వ్యూహంలో భాగ‌మా?

ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెనుక ఉన్న రహస్యం బయటపడింది. పైకి పొలిటిక‌ల్ సెటైర్ లా కనిపించే ఈ గ్రూపు వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ తో ముడిపడి ఉన్న ఒక సోషల్ మీడియా వ్యూహకర్త దాగి ఉన్నారని తెలుస్తోంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీని సోమరులు, నిరుద్యోగులు, సోషల్ మీడియాలోనే కాలం గడిపేవారి పార్టీగా అభివర్ణిస్తూ.. వెబ్‌సైట్ కూడా రూపొందించారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కోర్టులో నిరుద్యోగ యువత, న్యాయవాదులు, జర్నలిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలపై కొన్ని కీల‌క‌ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికీ ఉన్నార‌నీ.. కొంతమంది యువత కాక్రోచ్ లాంటి వాళ్లనీ.. వారికి ఉద్యోగం లేదా ప్రొఫెషన్‌లో సరైన గుర్తింపు దక్కనప్పుడు.. వారిలో కొందరు మీడియా, మ‌రి కొందరు సోషల్ మీడియా, ఇంకొందరు-ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారిపోయి.. అందరినీ టార్గెట్ చేయడం మొదలుపెడతారనీ అన్నారాయ‌న‌. దీనిపై తీవ్ర‌ విమర్శలు రావడంతో, తాను నిజమైన నిపుణుల గురించి కాకుండా.. నకిలీ డిగ్రీలతో చలామణి అవుతున్న వారి గురించి మాట్లాడానని సీజేఐ సూర్య‌కాంత్ వివరణ ఇచ్చారు. ఈ వివాదం నడుస్తుండగానే.. సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ.. వెబ్‌సైట్‌తో సహా ప్రత్యక్షమైంది. దీన్ని అభిజీత్ దిప్కే అనే వ్యక్తి ప్రారంభించారు. ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడిగా, టీమ్ లీడర్‌గా పనిచేసినట్లు ఆయన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉంది. ఆ తర్వాత అతడీ ప్రొఫైల్లోని స‌మాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా డిలీట్ చేసిన‌ట్టు క‌నిపించింది. దిప్కే తన పోస్ట్‌లో.. బొద్దింకలు మేల్కొన్నాయి! అంటూ ఇదొక యువత తిరుగుబాటు అంటూ.. ప్ర‌క‌ట‌న‌లు సైతం గుప్పించారు. దీంతో ఇదంతా ఆప్ వ్యూహ‌మా లేక యాధృచ్చిక‌మా? అన్న చ‌ర్చ మొద‌లైంది. కాక్రోచ్ జనతాపార్టీ తమ వెబ్‌సైట్‌లో మాత్రం తామది.. వ్యవస్థ మర్చిపోయిన ప్రజల పార్టీ అని, సోమరులు, నిరుద్యోగుల గొంతుక అంటూ అభివర్ణించుకుంది. ఈ ఆన్‌లైన్ ట్రెండ్‌పై ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్.. ఎంపీ కీర్తి ఆజాద్ సరదాగా ప్రశ్నించగా, మహువా మోయిత్రా కూడా తాను ఇందులో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. సంభాషణలు నవ్వులాటగా ఉన్నప్పటికీ.. వీటి వెనుక ఉన్న లక్ష్యాలు మాత్రం పూర్తిగా రాజకీయ పరమైనవని అంచ‌నా వేస్తున్నారు విశ్లేషకులు. కాక్రోచ్ జనతాపార్టీ మేనిఫెస్టోని బ‌ట్టి చూస్తే ఇది న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘంపై దాడిగానూ క‌నిపిస్తుంది. అస‌లెవ‌రీ అభిజీత్ దిప్కే అంటే.. ఇత‌డు- కేవలం ఒక సాధారణ సోషల్ మీడియా యూజ‌ర్ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాలు, సోషల్ మీడియా వ్యూహాలతో ఇతనికి ప్రత్యక్ష సంబంధ బాంధ‌వ్యాలున్నాయి. 2020 ఢిల్లీ ఎన్నికలు విష‌యం తీసుకుంటే.. ఆప్ తరఫున మీమ్స్, పారడీ వీడియోలతో కేజ్రీవాల్ ప్రమోషన్, బీజేపీ-కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించింది దీప్కేనే. ఇక వార్ రూమ్ బాధ్యతలు తీసుకుని..ఆప్ జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా వాట్సాప్, ఫేస్‌బుక్ వ్యూహాల పర్యవేక్షణ చేసింది ఇత‌డే. రైతుల ఆందోళనల విష‌యంలోనూ అంతే. ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారినప్పుడు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు దీప్కే. ఇక ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంలోనూ దిట్ట‌గా పేరు సాధించాడు. 2024 తర్వాత, బీజేపీ ప్రజాదరణ తగ్గినా గెలుస్తోందని, ఓట్ల తొలగింపే కారణమని ఆరోపణలు చేశాడిత‌డు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన నీట్, సీబీఎస్ఈ విద్యార్థులకు తాము మద్దతు ఇస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్ర‌క‌టించింది. అయితే.. విద్యార్థుల ఆగ్రహాన్ని రాజకీయంగా వాడుకోవడం.. ప్రతిపక్షాల పాత వ్యూహమే అన్న‌ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది పైకి కేవలం ఒక మీమ్ పేజీలా కనిపించినప్పటికీ, దీని వెనుక పూర్తి రాజకీయ ప్రయోజనాలున్న‌ట్టు స్ప‌ష్టంగానే తెలుస్తోంది. దీని వ్యవస్థాపకుడికి ఆప్ తో ఉన్న సంబంధాలు, మేనిఫెస్టోలోని బీజేపీ వ్యతిరేకాంశాలు.. నీట్ వివాదంపై కేజ్రీవాల్ తరహా విమర్శలు వంటివి చూస్తే అదే అనిపిస్తుంది. ఇది నిరుద్యోగ యువత నుంచి స్వచ్ఛందంగా త‌ర‌లి వచ్చిన ఉద్యమం కానే కాదు. ఇది కేవలం ఆప్ సోషల్ మీడియా ప్రతినిధి చేసిన ఒక డిజిటల్ ప్రయోగం మాత్రమే అంటారు ప‌లువురు సోష‌ల్ మీడియా నిపుణులు. భారత్ వ్యతిరేక శక్తులు, హిందూ ద్వేషులు, కమ్యూనిస్ట్, ముస్లిం జిహాదీ శక్తులు, సోరోస్ లైన్, ఇస్లామిక్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, దళిత సోదరులను అడ్డం పెట్టుకున్న క్రిస్టియన్ ముఠాలు.. ఇలా ప్రతి ఒక్కరూ భారత్ మీద విరుచుకు పడటానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. మనమే జాగ్రత్తగా ఉండాల‌నీ హెచ్చ‌రిస్తారు వీరు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఈ పేజీ ఫాలోవర్స్‌లో 49 శాతం మంది ఇస్లామిక్, కాంగ్రెస్ సొంత దేశం పాకిస్తాన్ నుంచే ఉండటం.. అర్థం చేసుకోవడం ఏమంత‌ కష్టం కాదనీ అంటారు వీరంతా. ఈ సమయంలో భారత రాజకీయాల్లో అందరికంటే ఎక్కువగా కడుపు మంటతో రగిలిపోతున్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేజ్రీవాల్ మాత్రమే. కార‌ణ‌మేంట‌ని చూస్తే.. మొదట ఢిల్లీపై ఉన్న సర్వాధికారాలను లాగేసుకున్నారు. ఆపై గుజరాత్‌లో బీజేపీని ఓడించి తీరుతానని శపథం చేశారు కేజ్రీవాల్. తీరా చూస్తే గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కేజ్రీవాల్ కి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోయారు. షెల్ కంపెనీలు కేవలం అవినీతి, స్కామ్‌ల కోసమే కాగితాలపై ఎలా ఉంటాయో.. సేమ్ ఇదీ అలాగే. గ్రౌండ్ లెవెల్‌లో వాటికి ఎలాంటి ఆధారం ఉండదని కేజ్రీవాల్ సార్ మర్చిపోయారు. దీంతో ఈ కాక్రోచ్‌లు కేవలం సోషల్ మీడియా వరకే ప‌రిమితం అయ్యాయన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ ఈ పేప‌ర్ పులులు.. నిజంగా పని చేస్తుంటే.. పీఎం ఇన్ వెయిటింగ్ ఒక మెలోడీ టాఫీ ట్రెండ్‌కే భయపడి విసిరికొట్టేవారు కాదనీ అంటారు. సోషల్ మీడియా గోడ‌ల‌పై వీరు.. రోజుకోసారి ప్రధానులు అయిపోతుంటారు.. కానీ గ్రౌండ్‌లోకి రాగానే అసలు సిసలైన నిజం ఏంటో బయటపడుతుందనీ చెప్పుకొస్తారు వీరి కార్య‌క‌లాపాల‌పై సునిశిత విశ్లేష‌ణ చేస్తున్న‌వారు. గుర్తుపెట్టుకోండి.. షెల్ కంపెనీలు ఎప్పటికీ నిలబడవు, వాటి వెనుక ఉన్న స్కామ్ ఏదో ఒక రోజు బయటపడక తప్పదు. భారతదేశానికి చెందిన జెన్ జీ వేరే దేశాల యువత లాంటి వాళ్లు కాదు. తిరగబడితే గట్టిగా కొడతారు. అందుకేనేమో.. వీళ్ల ఫాలోవర్లు తగ్గడం కూడా మొదలైపోయినట్టుంది చూస్తుంటే అన్న విశ్లేష‌ణ‌లు సైతం అందుతున్నాయ్. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 3:16PM
జెన్ జీని టార్గెట్ చేస్తున్న‌ కాక్రోచ్  దీప్కే ఎవ‌రి  ఏజెంట్?
జెన్ జీని టార్గెట్ చేస్తున్న‌ కాక్రోచ్ దీప్కే ఎవ‌రి ఏజెంట్?

కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ప‌ట్టి ఊపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెనకున్న వ్యక్తి అసలు రంగు బయటపడింది. ఈ పార్టీని ప్రారంభించిన వ్యక్తి ఒక సాధారణ సోషల్ మీడియా వినియోగదారుడు కాదు. ఇతడు ఆమ్ ఆద్మీ పార్టీ-(ఆప్) తో బ‌ల‌మైన‌ సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు. దాదాపు నెల రోజులుగా.. ఏదో ఒక సందర్భంలో భారత దేశంలో సివిల్ వార్ రావాల‌ని ఆప్ నేతలు తీవ్రంగా ఆశిస్తున్నారు. మ‌రో నేపాల్ లా ఈ భార‌త దేశాన్ని కూడా చేసి, ఒక ఆట ఆడుకోవాల‌న్న‌ది వీరి అస‌లు సిస‌లు ఎత్తుగ‌డ‌. ఇప్పుడొక తోకపార్టీ వచ్చింది. వాళ్ల టార్గెట్ జెన్ జి కిడ్స్. వారిని తేలిగ్గా మోటివేట్ చేయొచ‌న్న‌ది వారి దూరాలోచ‌న‌. ఇది దురాలోచ‌న కూడా. ఒవ‌రాల్ గా బొద్దింక జ‌న‌తా పార్టీ సృష్టిక‌ర్త.. అభిజీత్ దిప్కే వ్యూహాలేంటి? బయటపడిన వాస్త‌వాలు ఎలాంటివి? అని చూస్తే.. ఇందులో అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది.. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలను ప్రమోట్ చేయ‌డం. ఇక పోతే కుల రాజకీయాలు. సమాజంలో కుల రాజకీయాలను ఎంతో తెలివిగా రెచ్చగొడుతుంటాడు మిస్ట‌ర్ దీప్కే. ఇత‌డి మెయిన్ టార్గెట్ గ్రూపు జనరల్ కేటగిరీ (జీసీఎస్). ఈ వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను త‌ర‌చూ టార్గెట్ చేస్తుంటాడు దీప్కే. ఇదొక రెండు ముఖాల నాటకం. డ‌బుల్ ఫేస్ డ్రామా అన్న‌మాట‌. పైకి కాంగ్రెస్, బీజేపీ ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తూ.. లోలోపల మాత్రం ఆప్ జెండాను మోస్తూ.. ఆ పార్టీ ఎజెండాను జ‌నాల్లోకి ప్ర‌వేశ‌పెడుతుంటాడ‌న్న‌మాట‌. ఇత‌డు చేసే అతి పెద్ద మిరాకిల్ ఏంటో చూస్తే.. బోట్ అండ్ పీఆర్ ప్రమోషన్. ఇవెలాంటివంటే.. సోషల్ మీడియాలో భారీగా పీఆర్ చేస్తూ.. బోట్ అంటే, ఫేక్ అకౌంట్లను త‌న పార్టీ ప్రమోషన్ కోసం వాడుతున్నాడు. ప్రతి పోస్ట్‌కి తక్కువ లైకులు, కానీ రికార్డు సమయంలో భారీ ఫాలోవర్లు. ఇదెలా సాధ్య‌ం అని చూస్తే.. ఇదొక ఫేక్ బోట్ ఫాలోయ‌ర్స్ క్రియేష‌న్ అన్న‌మాట‌. ఆప్ తో ఇత‌డికున్న‌ కనెక్షన్ ఎలాంటిదో చూస్తే.. ఇందులో ఈ పార్టీకి చెందిన పెద్ద నేతల ప్రమోషన్ ఇంట‌ర్న‌ల్ గా చేస్తుంటాడు. ఈ కాక్రోచ్ జనతాపార్టీని దీప్కే ప్రమోట్ చేయడంలో ఆప్ పార్టీకి చెందిన పలువురు పెద్ద నేతలు కీలక పాత్ర పోషిస్తుండ‌ట‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇందుకోసం విప‌రీతంగా డ‌బ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఆప్ ఎజెండాను యువ‌త‌లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డానికి ఇదొక పొలిటిక‌ల్ ఫేస్ క‌ట్ అన్న‌మాట‌. 2019లో కాశ్మీర్ అంశంపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు.. అభిజీత్ దిప్కేపై పోలీసు కేసు కూడా నమోదైనట్లు సమాచారం. భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన బ్యాగ్రౌండ్ ఉంది ఇత‌డికి. జెన్ జీ యువతకు విజ్ఞప్తి చేస్తున్న‌ట్టు క‌నిపిస్తాడు. యువతలో ఉన్న ఆవేశాన్ని, ఎమోషన్స్‌ని వాడుకుని క్యాష్ చేసుకోవాలని చూసే ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మకండి! వివేకంతో వ్య‌వ‌హ‌రించండి!! ఇవీ యూత్ కి విజ్ఞులైన వారు చేసే విజ్ఞ‌ప్తి. యువతను రెచ్చగొట్టి, దేశంలో అస్థిరతను సృష్టించడం.. ఇలాంటి వారి ప్రధాన లక్ష్యం. విదేశాలలో కూర్చుని, సోషల్ మీడియా ద్వారా.. భారత యువతను మోసగించే ఈ వ్యూహాలు ఇందులో దాగి ఉన్న‌ట్టు గుర్తించండి. దీప్కే సృష్టించిన కాక్రోచ్ జ‌నతా పార్టీ విష‌యంలో ప్ర‌ధానంగా చ‌ర్చించాల్సిన అంశాలేంటంటే.. ఇది స్వ‌చ్ఛంద యువ ఉద్య‌మం కానే కాదు. పైకి ఇది త‌ట‌స్థ వేదిక‌గా క‌నిపించినా.. ఇందులో ఆప్ అజెండా దాగి ఉంది. ఫేక్ ఫాలోయ‌ర్స్ ద్వారా ఒక ప్ర‌భంజ‌నం సృష్టించాల‌న్న కుయుక్తి కూడా ఉంది. విదేశాల నుంచి ఆప‌రేష‌న్ చేయ‌డం, కావాల‌నే ఇండియ‌న్ యూత్ ని టార్గెట్ చేయ‌డం.. స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని గుర్తించండని అంటారు ప‌లువురు నిపుణులు. ఇందుకు 2019నాటి కాశ్మీర్ కేసు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకొస్తారు వీరు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 2, 2026 1:24PM
స్వదేశీ రక్షణ రంగంలో సరికొత్త శకం
స్వదేశీ రక్షణ రంగంలో సరికొత్త శకం

భారత రక్షణ చరిత్రలో అపూర్వమైన అధ్యాయానికి తెరలేచింది. దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలకే పరిమితమైన అధునాతన యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ, ఇప్పుడు ప్రైవేటు రంగానికి విస్తరించింది. భారత స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్- ఏఎమ్సీఏ ప్రాజెక్టులో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, రక్షణ రంగంలో భారతదేశం సాధిస్తున్న స్వావలంబనకు నిదర్శనం. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, సొంత గగనతలాన్ని తామే రక్షించుకోవాలనే సంకల్పంతో భారత్ వేస్తున్న ఈ అడుగు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి బాటలు ప‌రుస్తోంది. భారత వాయుసేన అవసరాల దృష్ట్యా.. ఐదో తరం యుద్ధ విమానాల తయారీ అత్యంత అవ‌స‌ర‌మని గుర్తించిన భారత ప్రభుత్వం, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏడీఏ నేతృత్వంలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గతంలో తేజస్ ప్రాజెక్టు విజయంతో ఊపిరి పోసుకున్న భారత స్వదేశీ రక్షణ పరిశ్రమ.. ఇప్పుడు మరింత శక్తిమంతమైన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన విమానాల తయారీకి సిద్ధమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తో పాటు ప్రైవేటు దిగ్గజాలను కూడా ఈ బృహత్తర యజ్ఞంలో భాగం చేయడం ద్వారా, తయారీ సామర్థ్యాన్ని, వేగాన్ని పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థల బిడ్లను ఆహ్వానించారు. మొదటి దశ ప్రోటోటైప్‌ల తయారీకి సుమారు రూ. 15 వేల‌ కోట్ల భారీ కేటాయింపు చేశారు. 2031 నాటికి ఐదు ప్రోటోటైప్‌ల నిర్మాణం ఇందులోని ప్ర‌ధానాంశం. ఈ మార్పును కేవలం వాణిజ్య పరంగా చూడకూడద‌ని అంటారు నిపుణులు. ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు, అస్థిరమైన స‌ప్లై చైన్ ఉన్న ఈ సిట్యువేష‌న్లో విదేశీ యుద్ధ విమానాలపై ఆధారపడటం ప్రమాదకరమని భావించింది ప్రభుత్వం. ఏఎంసీఏలో రెండు ఇంజన్లు ఉండటం, ఆయుధాలను బాడీ లోపల ఉంచడం టివి శత్రువుల రాడార్లకు చిక్కకుండా చేస్తాయి. హెచ్ఏఎల్ తనకున్న పరిమితుల వల్ల పనులన్నింటినీ ఒకేసారి చేయలేదు. టాటా, ఎల్ అండ్ టి వంటి సంస్థల రాక వల్ల ప్రాజెక్టులో నైపుణ్యం, వేగం, నాణ్యత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. విదేశీ సరఫరాదారుల షరతులు, సుంకాల యుద్ధం, రాజకీయ ఒత్తిళ్ల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఈ ఆత్మనిర్భరతే ఏకైక మార్గంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామం రక్షణ రంగంలో ఉన్న మోనోపోలీని విచ్ఛిన్నం చేస్తోంది. ప్రైవేటు సంస్థల ప్రవేశం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, రక్షణ రంగానికి సంబంధించి ఒక బలమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. అయితే, ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా? ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? అనే అంశాలపై మేధోవర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా దేశ భద్రతను బలోపేతం చేసే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సానుకూలత వ్యక్తమవుతోంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 1, 2026 1:38PM
 ఎల్టీటీఈ 2.0 ద్వారా ఇంకా బ‌తికే ఉందా!?
ఎల్టీటీఈ 2.0 ద్వారా ఇంకా బ‌తికే ఉందా!?

శ్రీలంకలో ఎల్టీటీఈ సైనిక పరాజయం తర్వాత దాని అనుబంధ వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తంగా కొత్త వ్యూహాలతో పనిచేస్తున్నాయి. నార్వే, బ్రిటన్‌, అమెరికా కేంద్రాలుగా చేసుకుని నిధులు సమీకరించడం, అంతర్జాతీయ వేదికలపై ప్రభావం చూపడం, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునివ్వడం వంటివి ఈ వ్యవస్థల ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వీటికి తోడు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విదేశీ నిఘా సంస్థలతో అనుబంధం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణం, ఎల్టీటీఈ సైనిక పరాజయం తర్వాత, ఈ సంస్థ.. ఆర్థిక, ప్రచార వ్యవస్థలు పూర్తిగా నిర్మూలం కాలేదు. బదులుగా, అవి మరింతగా ప‌దునుదేలిన‌ వ్యూహాలతో ఎల్టీటీఈ 2.0గా రూపాంత‌రం చెందాయి. ప్రముఖ ఉగ్రవాద నిపుణుడు ప్రొఫెసర్ రోహన్ గుణరత్న అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఎల్టీటీఈకి సంబంధించిన మూడు ప్రధాన వర్గాలు అత్యంత‌ చురుకుగా పనిచేస్తున్నాయి. వాటిలో ఒక‌టి- ట్రాన్స్‌నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ తమిళ్ ఈలం(టీజీటీఈ) ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. ఎల్టీటీఈ నాయకుడికి చట్టపరమైన సలహాదారుగా ఉన్న విశ్వనాథన్ రుద్రకుమారన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. రెండోది.. గ్లోబల్ తమిళ్ ఫోరమ్(జీటీఎఫ్). ఇదైతే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫాదర్ ఎస్. జె. ఇమ్మాన్యుయేల్ నేతృత్వంలో ఈ బృందం మానవ హక్కుల పేరుతో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మూడోది. తమిళ్ ఈలం పీపుల్స్ అసెంబ్లీ (టీఈపీఏ). ఇది నార్వే కేంద్రంగా పనిచేస్తుంది. ప్రభాకరన్ తర్వాత శిక్షణ పొందిన ఎల్టీటీఈ కేడర్ అయిన పెరిన్పనాయగం శివపరన్ అలియాస్ నెడియావాన్ దీనికి నాయకుడు. ఈ మూడు వర్గాలు కలిసి, ఒక సమన్వయ వ్యూహంలో భాగంగా ఐక్యరాజ్యసమితి సెషన్ల వంటి అంతర్జాతీయ వేదికలపై శ్రీలంక, భారత్ వంటి దేశాలపై ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్టీటీఈ అనుబంధ వర్గాలు ఇప్పుడు ఆయుధాలను పక్కన పెట్టి, రాజకీయ లాబీయింగ్, మానవ హక్కుల ప్రచారం, ప్రవాసుల ఓటు బ్యాంకును కేంద్రంగా చేసుకున్న కొత్త తరహా పోరాటానికి మారాయి. జీటీఎఫ్ నాయకుడు ఫాదర్ ఇమ్మాన్యుయేల్ పాత్ర విష‌యానికి వ‌స్తే.. ఈ మూడు బృందాల్లో అత్యంత కీలకమైంది గ్లోబల్ తమిళ్ ఫోరమ్. శ్రీలంక తమిళుల ప్రవాస సమన్వయ సంస్థగా, 2010లో ఏర్పడిన ఈ ఫోరమ్, బ్రిటిష్ పార్లమెంటులో ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవంలో అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ మిలిబాండ్, షాడో ఫారిన్ సెక్రటరీ విలియం హేగ్ వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం. ఇక ఫాదర్ ఎస్. జె. ఇమ్మాన్యుయేల్ నేపథ్యం.. ఆయ‌న విద్యాబ్యాసం- కొలంబో విశ్వవిద్యాలయంలో భౌతిక, గణిత శాస్త్రాలలో డిగ్రీ, రోమ్ నుంచి థియాలజీలో డాక్టరేట్ పొందారాయ‌న‌. ఇక మతపరమైన పాత్ర ఎలాంటిదంటే.. క్యాథలిక్ పూజారిగా, జాఫ్నా డియోసెస్‌కు వికార్ జనరల్ గా పనిచేశారు. ప్రస్తుతం జర్మనీలోని డార్ఫెల్డ్‌లో పాస్టర్ గా ఉన్నారు. ఎల్టీటీఈ సంబంధాలు అనే అంశంలో, శ్రీలంక ప్రభుత్వ మూలాల ప్రకారం చూస్తే.. ఇమ్మాన్యుయేల్, ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ కి సంబంధించిన‌ అంతర్జాతీయ కార్యకలాపాల విభాగానికి నాయకుడు. కాస్ట్రో వంటి వారితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వన్నీలోని కల్నల్ కిట్టు పొలిటికల్ కాలేజీలో ఎల్టీటీఈ కేడర్లకు శిక్షణ ఇచ్చిన ఆరోపణలు కూడా ఉన్నాయి. జిఫ్ మెయిన్ టార్గెట్.. సైనిక పోరాటాన్ని విడనాడి, అంతర్జాతీయ స్థాయిలో తమిళ జనాభా ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, మారణహోమం వంటి అంశాలతో శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావడమే. ఈ క్రమంలో, వారు బ్రిటన్, అమెరికా, కెనడా వంటి దేశాల్లోని ప్రవాస తమిళుల ఓటు సామర్థ్యాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. బ్రిటిష్ పార్లమెంటులోనే ప్రారంభించిన జిఫ్, బ్రిటిష్ రాజకీయ నాయకులను సభ్యులుగా కలిగి ఉంది. ఇది శ్రీలంక విషయంలో బ్రిటన్ విధానంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడానికే అంటారు నిపుణులు. టీజీటీఈ అనేది పూర్తి స్థాయి ప్రభుత్వ త‌ర‌హా నిర్మాణాన్ని కల్పించుకున్న సంస్థ. ప్రధానమంత్రి, పార్లమెంట్, విదేశాంగ విధానంతో కూడిన ఈ ప్రభుత్వం, ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఉన్న తమిళ ప్రవాసుల మధ్య ఎన్నికలను నిర్వహిస్తుంది. ఎల్టీటీఈ నేతకు చట్టపరమైన సలహాదారుగా ఉన్న విశ్వనాథన్ రుద్రకుమరన్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. భారత్, యూఎస్.. రెండు దేశాలు.. ఎల్టీటీఈని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినప్పటికీ,టీఈటీఈ అమెరికాలో తన కార్యకలాపాలను చట్టబద్ధంగానే కొనసాగిస్తోంది. ఇది పెన్సిల్వేనియా రాష్ట్రంలో తమిళ జాతి నిర్మూలన ఆరోపణలతో తీర్మానాలు ఆమోదించేలా ప్రభావం చూపగలిగింది. ఇక ఈ సంస్థ‌లు నిధుల సేకరణ ఎలా చేస్తాయంటే, మూడు ప్రధాన వనరులు క‌నిపిస్తాయి. ఈ ప్రవాస సంస్థల కార్యకలాపాలకు ప్రధాన ఆజ్యం పోసే నిధుల మూలాలను నిపుణులు గుర్తించారు. వాటిలో ఫ‌స్ట్ వ‌న్.. ప్రవాసుల విరాళాలు. ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న తమిళ ప్రవాసుల నుంచి వచ్చే నిధులు. న్యాయపోరాట గ్రాంట్లు. మానవ హక్కుల పేరుతో పనిచేసే ఎన్జీవోల ద్వారా అందే గ్రాంట్లు. రెండో మార్గం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం, శ్రీలంక గుండా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న.. మాదకద్రవ్యాల మార్గం ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ సంస్థలకు చేరుతుందని అంచనా. ఇక నార్వే, ఐఎస్ఐ వంటి బెదిరింపులు ఎలాంటివి ఏంట‌ని చూస్తే.. ఈ విశ్లేషణలోని మరో కీలకమైన అంశం నార్వే పాత్ర. సుమారు 50 వేల‌ మంది పాకిస్తానీ ప్రవాసులు నివసిస్తున్న ఈ దేశం, కొన్ని నివేదికల ప్రకారం, నిధుల ప్రవాహానికి కేంద్రంగా ఉంది. ఐఎస్ఐ, ఇతర అంతర్జాతీయ నిఘా వ్యవస్థలు తమిళనాడు వంటి ప్రాంతాల్లో అస్థిరతను సృష్టించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు. తమిళనాడు.. వ్యూహాత్మక ప్రాముఖ్యత విష‌యానికి వ‌స్తే.. శ్రీలంకకు ద‌గ్గ‌ర‌లో ఉండటం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు ప్రవేశ ద్వారంగా ఉండటం.. దీన్ని మరింత సున్నితమైన ప్రాంతంగా మారుస్తుంది. ఇండివిడ్యువ‌ల్ సోర్సెస్, కోర్డు రికార్డుల ద్వారా పరిశీలిస్తే, ఎల్టీటీఈ ప్రవాస నెట్‌వర్కులు.. వాస్తవంగా ఉనికిలో ఉన్నాయని, అవి వివిధ దేశాల్లో తమ ప్రభావాన్నింకా చూపుతున్నాయని స్పష్టమవుతూనే ఉంది. కాబ‌ట్టి ఎల్టీటీఈ పూర్తిగా స‌మ‌సిపోలేదు. ఇంకా అది 2. 0 రూపంలో బ‌తికే ఉంద‌న‌డానికి నిద‌ర్శ‌నాలే ఇవ‌న్నీ. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 1, 2026 1:25PM
 ఇరాన్ యుద్ధం, అమెరికా రక్షణ సామర్థ్యం.. ఒక విశ్లేష‌ణ‌
ఇరాన్ యుద్ధం, అమెరికా రక్షణ సామర్థ్యం.. ఒక విశ్లేష‌ణ‌

ఆధునిక యుద్ధ తంత్రంలో కేవలం వీరత్వం సరిపోదు, అంతులేని ఆయుధ సంపత్తి కూడా అవసరం. ఇరాన్‌తో జరిగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సంఘర్షణ, అమెరికా రక్షణ వ్యవస్థలోని ఒక చేదు నిజాన్ని ప్రపంచం ముందుంచింది. దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ కవచంగా ఉన్న అమెరికా అమ్ములపొది, నేడు ఖాళీ అయ్యే స్థితికి చేరుకుంది. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్నప్పటికీ, ఆ ఆయుధాలను యుద్ధరంగంలో నిరంతరాయంగా భర్తీ చేసే తయారీ సామర్థ్యం విషయంలో.. అమెరికా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, అమెరికా రక్షణ వ్యూహకర్తలు ఒక పొరపాటు అంచనాకు వచ్చారు. భవిష్యత్తు యుద్ధాలు స్వల్పకాలికంగా, ప్రాంతీయంగానే ఉంటాయని, అందువల్ల భారీ ఆయుధ నిల్వలు అవసరం లేదని భావించారు. ఈ తప్పుడు అంచనానే పెంటగాన్ ఆయుధాల కొనుగోలులో కోత విధించడానికి దారితీసింది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, తాజాగా ఇరాన్‌తో జరిగిన సంఘర్షణలు - యుద్ధాలు సుదీర్ఘంగా సాగుతాయని, భారీ స్థాయిలో అధునాతన మందుగుండు సామాగ్రి అవసరమనే సంకేతాన్నిస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. యుద్ధ నష్టం - గణాంకాలు ఎలాంటివో చూస్తే.. ఈ సంఘర్షణ అమెరికాకు కేవలం భౌగోళిక రాజకీయ సవాలే కాదు, ఆర్థికంగా, సైనికంగా భారీ దెబ్బను మిగిల్చింది. నివేదికల ప్రకారం.. చూస్తే.. మొద‌ట ధ్వంసమైన విమానాల విష‌యానికి వ‌స్తే, ఎఫ్-35, ఎఫ్-15ఈ, ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, కేసీ-135 ట్యాంకర్లు, ఏడబ్ల్యూఏసీఎస్ నిఘా విమానాలతో కలిపి మొత్తం 42 విమానాలు దెబ్బతిన్నాయి. ఇక ఆర్ధిక న‌ష్టం సంగ‌తి చూస్తే. సుమారు 29 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఒక‌ అంచనా. ఆయుధాల కొరత విష‌యానికి వ‌స్తే.. సమయమే అతిపెద్ద శత్రువుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డబ్బు కాదు, సమయం. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్‌ను కేటాయించినప్పటికీ, క్లిష్టమైన ఆయుధ వ్యవస్థల తయారీకి ఏళ్లు పడుతోంది. టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు.. యుద్ధంలో వెయ్యి కంటే ఎక్కువ వాడారు. ఈ విష‌యంలో గ‌త‌కాల‌పు నిల్వలకు చేరుకోవడానికి 2030వ సంవ‌త్స‌రం వరకు పట్టవచ్చు. THAAD ఇంటర్‌సెప్టర్లు సంగ‌తి చూస్తే వీటిని సుమారు 290 వ‌ర‌కూ వాడారు. వీటి భర్తీ 2029 చివరి వరకు పట్టవచ్చు. పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లు- వెయ్యి కంటే ఎక్కువ భర్తీ చేయడానికి 2029 మధ్య వరకు సమయం ప‌ట్టొచ్చు. ఫైన‌ల్ గా రాజకీయాలు, వ్యూహాత్మక కోణాల విష‌యానికి వ‌స్తే.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2027 నాటికి తైవాన్ అంశంపై చేస్తున్న హెచ్చరికలు, అమెరికా రక్షణ వ్యూహకర్తలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్‌ను రక్షించడం, మరోవైపు తమ సొంత నిల్వలను పెంచుకోవడం, ఇంకోవైపు 17 దేశాలకు పేట్రియాట్ వ్యవస్థలను సరఫరా చేయడం - ఈ మూడు బాధ్యతల మధ్య అమెరికా స‌త‌మ‌త‌మ‌వుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, రక్షణ కాంట్రాక్టర్లపై ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, పారిశ్రామిక పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నివేదికలు అమెరికా సైనిక సంసిద్ధతపై అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. రక్షణ కాంట్రాక్టర్లు అయిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్ భారీ పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆయుధాల కొరత అమెరికా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తోంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఏవైనా ఘర్షణలు తలెత్తితే, ఈ బలహీనతలు అమెరికాకు శాపంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Publish Date: Jun 1, 2026 12:33PM
TeluguOne Picks For You
rss-imgRss Feeds