వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు బెయిల్..!

posted on: Jul 17, 2026 3:02PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టైన వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనంతరం నాగార్జున యాదవ్‌ను  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నాగార్జున యాదవ్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, దర్యాప్తుకు సహకరించాలనే షరతుల తో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ అరెస్టుపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు. మరోవైపు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. నాగార్జున యాదవ్‌కు బెయిల్ లభించడంతో ఆయన త్వరలో విడుదల కానున్నారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, తదుపరి విచారణలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన హాజరు కావాల్సి ఉంటుంది.

YSRCP leader Nagarjuna Yadav granted bail, CM Revanth reddy, Social media, YSRCP, YS Jagan, CM Chandrababu, Naralokesh

google-ad-img
    Related Sigment News
    • Loading...