డబ్బులు ఇస్తామన్నా ఎవ్వడూ రావట్లేదు....

 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ పాదయాత్ర వైసీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏదో కష్టపడి పాదయాత్రను లాక్కొచ్చారు కానీ.. ఇప్పుడు అదే చాలా కష్టమైపోయింది వారికి. రోజూ లారీల కొద్దీ జనాలని, వారికి భోజనాలు, మంచినీళ్లు అన్ని చూసుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. ఇక ఇదే విషయంపై ఓ వైసీపీ నాయకుడికి కోపం వచ్చినట్టుంది.. అందుకే లోటల్ పాండ్ సిబ్బందికి చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నాడు. ఈనేపథ్యంలో... లోటస్ పాండ్ నుండి ఓ సిబ్బంది అక్కడ నియోజక వర్గానికి చెందిన వైసీపీ నేతకు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఈరోజు ఎంతమంది జనాన్ని తరలిస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎన్ని వెహికిల్స్ లో తీసుకువస్తున్నారు అన్ని ప్రశ్నల మీద ప్రశ్నల మీద వేయగా... అప్పటికే ఎండలో తిరిగి, తిరిగి ఉన్న సదరు వైసీపీ నేతకు సుర్రున కాలి... మేం కింద ఫీల్డ్ లో నానా చావు చస్తున్నాం.. మీకేం మీరూ చక్కగా ఏసీ గదుల్లో కూర్చున్నారు... ఏసీ గదుల్లో కూర్చుని లెక్కన అడగటానికి మీకు బ్రెయిన్ ఉందా...? ఏంటి మీకు చెప్పేది లెక్కలు..? అని చీవాట్లు పెట్టాడట. అంతేకాదు.. మీరు ఇక్కడికి వచ్చి ఎండలో ఒకరోజు పని చేయండి తెలుస్తుంది...డబ్బులు ఇస్తామన్నా ఎవ్వడూ రావట్లేదని తిట్టిపోశాడట. దీంతో సదరు సిబ్బంది ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఫోన్ పెట్టేశాడట. మొత్తానికి జగన్ పాదయాత్రకు జనాల్ని తీసుకురావడానికి బాగానే వైసీపీ నేతలు బాగానే కష్టపడుతున్నట్టున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. జగన్ అన్న పాదయాత్ర ఏంటో... మాకు ఈ గతి పట్టడం ఏంటో అని బహిరంగంగానే కామెంట్ చేసుకుంటున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu