వివేకా హత్యకు ఏడున్నరేళ్లు.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను.. : సునీత

posted on: Aug 8, 2026 7:08PM

 

తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత  ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి 75 వ పుట్టిన రోజును పులివెందుల లోనీ వైయస్ వివేక పార్కులో ఆయన విగ్రహానికి కూతురు సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిలు శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం వైయస్ సునీత మాట్లాడుతూ ఇప్పటికి వైయస్ వివేకాను హత్య చేసి  చేసి ఏడున్నర సంవత్సరాలు గడిచిందని ఇప్పటికి తాను న్యాయం కోసం పోరాడుతున్నానని తెలిపారు. గత ఆరునెలల కాలంలో కొన్ని జడ్జిమెంట్లు వచ్చాయని ఆ జడ్జిమెంట్లు మంచివి కాదని నా అభిప్రాయం అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజలందరికీ తెలియక ముందే ఉదయం ఐదున్నరకే వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందన్నారు. ఇన్వెస్టిగేషన్లో కొన్ని అవకతవకులు ఉన్నాయని మాట్లాడారు. ఏదో ఒక రోజు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, తాను న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తానన్నారు.

YS Vivekananda Reddy Murder Case, YS Sunitha Reddy, Viveka Murder Case,Vivekananda Reddy Birth Anniversary, Pulivendula, YS Jagan Mohan Reddy,Viveka Murder Investigation
 

google-ad-img
    Related Sigment News
    • Loading...