Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ విక్టిమ్ కార్డు...మళ్లీ బయటకు తీశాడ్రోయ్...జనం మాట ఇదేనా!
posted on: May 22, 2026 3:29PM
.webp)
చంద్రబాబును చేరదీసింది రాజారెడ్డే అంటారు. వాళ్లు వాళ్లు ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్లే కదా? అలాంటి చంద్రబాబు రాజారెడ్డిని హత్య చేయించి ఉంటారా? చంద్రబాబు జగన్ చెప్పినంత వరెస్టుగా ఉంటారా? చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణల్లో నిజా నిజాలెంత? అసలేంటీ ఆరోపణల పర్వం వెనక దాగిన రాజకీయం???
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజారెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ల మధ్య ఉన్న పాత సంబంధాలు, ప్రస్తుత వివాదాలు అత్యంత ఆసక్తికరమైనవి. వాటి వెనుక ఉన్న రాజకీయ కోణాలను విశ్లేషిస్తే.. చంద్రబాబును చేరదీసింది రాజారెడ్డేనా? వాళ్లు ఒకప్పుడు కాంగ్రెస్ లీడర్లేనా? అని ప్రశ్నించుకుంటే.. ఇది కొంతవరకు నిజం, కానీ పూర్తిగా కాదని అంటారు.
నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరూ.. 1978లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అప్పట్లో వీరిద్దరూ చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో రూమ్ షేర్ చేసుకునేంత సాన్నిహిత్యం వీరి మధ్య ఉండేది.
వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి కడప జిల్లాలో అప్పట్లోనే బలమైన కాంగ్రెస్ నాయకుడు. చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో.. వైఎస్సార్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండేవి. అయితే చంద్రబాబును రాజకీయంగా చేరదీసింది కేవలం రాజారెడ్డే అనడం కంటే, అప్పట్లో వైఎస్సార్-చంద్రబాబు ఇద్దరూ యువ నాయకులుగా కలిసి ప్రయాణించారని చెప్పడం కరెక్ట్.
1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లోనే ఉండి వైఎస్సార్తో కలిసి పనిచేశారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాతే ఆయన టీడీపీలోకి వెళ్లారు.
చంద్రబాబు రాజారెడ్డిని హత్య చేయించి ఉంటారా? జగన్ చెప్పినంత వరెస్ట్ గా ఉంటారా? అంటే,
ఇది పూర్తిగా రాజకీయ ఆరోపణల పర్వం. ఒకరిని ఒకరు రాజకీయంగా దెబ్బతీసుకోవడానికి చేసే విమర్శలని అంటారు చాలా మంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అంటే 1998లో.. రాజారెడ్డి హత్య జరిగింది కాబట్టి, నాడు అధికారంలో ఉన్న టీడీపీ రక్షణలోనే నిందితులు రెచ్చిపోయారని, వైఎస్సార్ కుటుంబాన్ని రాజకీయంగా ముగించడానికే చంద్రబాబు ఈ కుట్ర వెనుక ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు.
తాము ఎప్పుడూ వ్యవస్థీకృత నేరాలకు, ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడలేదని చంద్రబాబు స్పష్టం చేస్తూ ఉంటారు. రాజారెడ్డి హత్య అనేది కడప జిల్లాలోని స్థానిక గనుల వివాదాలు, ఫ్యాక్షన్ గొడవల వల్ల జరిగిందని, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పులను కూడా వారు ఉదహరిస్తున్నారు.రాజకీయాల్లో ఏ నాయకుడూ ఒకరు చెప్పినంత ఉత్తముడు కాడు, ఇంకొకరు చెప్పినంత వరెస్ట్ కూడా కాడని నిర్వచిస్తారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా పవర్ పాలిటిక్స్ ఆధారిత రాజకీయం అంటారు వీరు.
జగన్ కేవలం రాజారెడ్డి హత్యే కాదు, తన కుటుంబంలో జరిగిన మూడు మరణాలపై చంద్రబాబును టార్గెట్ చేశారు. ఆ ఆరోపణల్లోని వాస్తవాలు పరిశీలిస్తే... ఆరోపణ నెం. 1- రాజారెడ్డి హత్య వెనుక చంద్రబాబు ఉన్నారు. ఇందులో నిజం ఏంటో చూస్తే.. ఈ కేసును కోర్టులు విచారించి, నిందితులకు శిక్షలు వేశాయి. చట్టపరంగా ఎక్కడా చంద్రబాబు పేరు గానీ, కుట్ర కోణం గానీ నిరూపితం కాలేదు.
ఆరోపణ నెం. 2- వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక అనుమానాలు. ఇక నిజం ఏంటో పరిశీలిస్తే.. వైఎస్సార్ మరణానికి రెండు రోజుల ముందు అసెంబ్లీలో చంద్రబాబు నువ్వు మళ్లీ తిరిగి రావు అంటూ వైయస్సార్ ను అన్నట్టు మాట్లాడారని గుర్తు చేస్తున్నారు జగన్. అయితే ఇది రాజకీయ విమర్శే తప్ప నిజం కాదని తెలుస్తోంది. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై నాటి యూపీఏ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించి అది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ప్రమాదంగా తేల్చింది. ఆ మాటకొస్తే వైయస్ఆర్ కూడా చంద్రబాబును మీ అమ్మ నిన్ను ఎందుకు కన్నదో అని ఫీలవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా. మరి దీని ప్రస్తావన జగన్ ఎందుకు చేయలేదో కూడా చెప్పాలంటారు టీడీపీ నాయకులు.
ఆరోపణ నెం. 3- వివేకానంద రెడ్డి హత్య చంద్రబాబు కుట్ర. నిజం ఏంటో చూస్తే.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణలో ఉంది. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులైన భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు విచారణలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. కానీ జగన్ మాత్రం అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఆరోపణల పర్వం వెనుక దాగిన రాజకీయం ఏమిటి? అంటే, ప్రస్తుతం ఏపీలో ఈ పాత కేసులను మళ్లీ తెరపైకి తెచ్చి జగన్ ప్రెస్ మీట్లు పెట్టడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసిపి కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జగన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో, నా తాతను చంపారు, నా తండ్రి చావుపై అనుమానాలు ఉన్నాయి, బాబాయ్ని కూడా చంపారు, నాపై కోడికత్తి దాడి చేశారు.. మా కుటుంబమే బాధితులు అని ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగమని అంచనా. అంటే, విక్టిమ్ కార్డు వాడి తిరిగి రాజకీయంగా పుంజుకోవాలని.. జగన్ చేస్తున్న ఆలోచనగా భావిస్తున్నారు.
సాధారణంగా రాయలసీమ ఫ్యాక్షనిజం అనగానే వైఎస్ కుటుంబంపై విమర్శలు వస్తుంటాయి. దాన్ని రివర్స్ చేసి, అసలైన ఫ్యాక్షనిస్ట్ చంద్రబాబే, ఆయనే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు అని చూపించి సానుభూతి పొందడం జగన్ వ్యూహంగా భావిస్తున్నారు.
అమరావతి లేదా ప్రస్తుత ప్రభుత్వ పాలనాపరమైన అంశాల నుంచి చర్చను పూర్తిగా వ్యక్తిగత వైషమ్యాలు, శవ రాజకీయాల వైపు మళ్లించడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందాలనేది ఉభయ పార్టీల వ్యూహంగానూ తెలుస్తోంది. పాత దోస్తీలు శత్రుత్వాలుగా మారడం, పాత శత్రుత్వాలను అవసరానికి తగ్గట్టు వాడుకోవడం.. రాజకీయాల్లో చాలా మామూలు విషయం. రాజారెడ్డి-చంద్రబాబుల కథ కూడా అలాంటిదేనంటారు పలువురు విశ్లేషకులు.






