Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోటి మందితో యోగాంధ్ర 2026.. సీఎం చంద్రబాబు!
posted on: Jun 4, 2026 9:30AM
.webp)
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత అమూల్యమైన, అద్భుతమైన జీవన విధానం యోగా. ఈ దివ్యమైన ప్రాచీన సంపదను కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా.. ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసి, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ఇందులో భాగంగానే జూన్ 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు యోగాను ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్దీ ఏజింగ్.. అంటే వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడం అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా అనేది ఒక్క రోజుతో ముగిసిపోయే ముచ్చట కాకూడదనీ, ప్రతి ఒక్కరూ దీనిని నిత్య సాధనగా మార్చుకోవాలనే గొప్ప సంకల్పంతో జూన్ నెలను ఏకంగా యోగా మాసంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మహా యజ్ఞంలో భాగంగా జూన్ 7 నుండి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వివిధ యోగాంధ్ర కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ మెగా ఈవెంట్ కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతిలోని కృష్ణా నది పశ్చిమ బైపాస్ వంతెనపై ఏకంగా పాతిక వేల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ 2,000 నుంచి 3,000 మంది చొప్పున ప్రజలు పాల్గొనేలా ప్లాన్ చేశారు. ఈసారి కేవలం సాధారణ ప్రజలే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో ప్రత్యేకమైన యోగా సెషన్స్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో ఉన్న ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి 56 ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా యోగా-టూరిజంకు కొత్త రూపురేఖలు తీసుకురానున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పది కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది.
ఈ ప్రతిష్ఠాత్మక 'యోగాంధ్ర-2026' మహోత్సవాన్ని అత్యంత విజయవంతం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 కోట్ల భారీ బడ్జెట్ను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, యోగాను 365 రోజుల పాటు నిరంతరం సాగే ఒక నిత్య జీవిత ఉద్యమంగా మార్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.






