వైసీపీ నరకాసుర వధ తుస్సు!!

posted on: Jul 26, 2014 10:41AM

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ పిలుపు ఇచ్చిన మూడు రోజులపాటు నరకాసుర వధ కార్యక్రమం మొదటి రోజే తుస్సుమంది. నరకాసుర వధ పేరుతో ఒకరోజు చాలదన్నట్టు మూడు రోజులపాటు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దగ్ధం చేసే బృహత్తర కార్యక్రమానికి జగన్ పిలుపు ఇచ్చారు. తన పిలుపు విని ఆంధ్రప్రదేశ్ మొత్తం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మల్ని దగ్ధం చేసే ఘనకార్యంలో నిమగ్నమైపోతుందని ఆయన కలలు కన్నారు. అయితే జనం సంగతి అలా వుంచితే వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం మీద ఆసక్తి చూపించడం లేదు. మొన్న ఎన్నికల ముందు వరకూ పార్టీ కోసం అడ్డమైన గాడిద చాకిరి చేసి వున్న వైసీపీ కార్యకర్తలు మళ్ళీ ఈ కొత్త తద్దినం ఏంట్రా భగవంతుడా అనుకుంటూ ఇళ్లలోంచి కూడా బయటకి రాలేదు. దాంతో ఎంతో హడావిడిగా చేయాలని అనుకున్న నరకాసుర వధ కార్యక్రమం తుస్సుమంది. మొదటిరోజే తుస్సుమంది.. ఇక రెండు మూడు రోజుల పరిస్థితి కూడా అలాగే వుంటుందని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. దీనిమీద తెలుగుదేశం నాయకులు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. జగన్ నరకాసుర వధ చేయమని పిలుపు ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలు నరకాసురుడంలే జగనే కదా అని ఆయన్ని ఏమీ చేయలేక ఊరుకున్నారని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...